అన్వేషించండి

China New Map: చైనాకు ఎదురుదెబ్బ, కొత్త మ్యాప్‌ను తిరస్కరించిన మరో నాలుగు దేశాలు

China New Map: చైనాకు మరో నాలుగు దేశాలు షాక్ ఇచ్చాయి. చైన ప్రకటించిన కొత్త మ్యాప్‌‌ను తిరస్కరించాయి.

China New Map: చైనాకు మరో నాలుగు దేశాలు షాక్ ఇచ్చాయి. చైన ప్రకటించిన కొత్త మ్యాప్‌‌ను తిరస్కరించాయి. చైనా కొత్త అధికారిక మ్యాప్ స్ప్రాట్లీ, పారాసెల్ దీవులపై దాని సార్వభౌమాధికారాన్ని, దాని జలాలపై అధికార పరిధిని ఉల్లంఘిస్తోందని వియత్నాం పేర్కొంది. మ్యాప్‌లోని తొమ్మిది చుక్కల రేఖ ఆధారంగా చైనా ప్రకటించిన సార్వభౌమాధికారం, సముద్రయాన ప్రకటనలు చెల్లవని వియత్నాం విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫామ్ థు హాంగ్ అన్నారు. చుక్కల రేఖ ఆధారంగా దక్షిణ చైనా సముద్రంలో చైనా చేస్తున్న అన్ని వాదనలను వియత్నాం గట్టిగా వ్యతిరేకిస్తుందని హాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. 

ఇతర దేశాలు సైతం చైనా మ్యాప్‌ను తిరస్కరించాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని విభాగాలను తమ భూభాగంలో చూపుతూ చైనా ప్రచురించిన మ్యాప్‌ను భారతదేశం మంగళవారం తప్పుబట్టింది. అలాగే దక్షిణ చైనా సముద్రంలో చైనా వాదనలను గుర్తించలేదని ఫిలిప్పీన్స్ పేర్కొంది. మలేషియా, తైవాన్ ప్రభుత్వాలు కూడా చైనా తమ భూభాగాన్ని క్లెయిమ్ చేస్తున్నాయని ఆరోపిస్తూ  ప్రకటనలు జారీ చేశాయి.

బుధవారం బీజింగ్‌లో జరిగిన సాధారణ విలేకరుల సమావేశంలో మ్యాప్‌ ప్రకటనపై  చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ స్పందించారు. మ్యాప్‌పై ఇతర దేశాలు మ్యాప్ గురించి రాద్దాంతం చేయకుండా, అతిగా వ్యాఖ్యానించకుండా ఉంటేనే ప్రశాంతంగా ఉండగలవన్నారు. చైనా కొత్త  మ్యాప్ ప్రకటించిన నేపథ్యంలో ప్రచురణకర్తలు, కంపెనీలు ఆయా వివరాలను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చైనా తీసకునే నిర్ణయంంతో విదేశీ సంస్థలు మ్యాప్‌లను ఎలా ఉపయోగించాలో తెలియక కొన్నిసార్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. 

1947 నాటి మ్యాప్‌లో అస్పష్టమైన గీతలు - తొమ్మిది - డ్యాష్ లైన్‌ను చూపుతూ చైనా దక్షిణ చైనా సముద్రంలో హైనాన్ ద్వీపానికి దక్షిణంగా 1,100 మైళ్ల (1,800 కిలోమీటర్లు) దూరంలో ఉన్న బిందువు వరకు 80% కంటే ఎక్కువ భాగాన్ని తమ దేశానికి చెందినదిగా ప్రకటించుకుంది. వియత్నాం, ఫిలిప్పీన్స్, బ్రూనై, మలేషియా, తైవాన్ సైతం అదే సముద్రంలో కొన్ని భాగాలను తమ దేశాలకు చెందినవిగా ప్రకటించుకున్నాయి. దీంతో చైనాకు ఆయా దేశాల మధ్య సరిహద్దుల వివాదం నడుస్తోంది.

వివాదం ఇదీ..
చైనా తాజాగా తమ దేశ అధికార మ్యాప్‌ 2023 ఎడిషన్‌ను ఆగస్టు 28న విడుదల చేసింది. అయితే ఇందులో భారత్‌ భూభాగాలను తమవిగా చూపిస్తోంది. సోమవారం చైనా అధికారికంగా విడుదల చేసిన మ్యాప్‌లో భారత్‌కు చెందిన అరుణాచల్‌ ప్రదేశ్‌, అక్సాయిచిన్‌లు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాలను చైనా తమ భూభాగాలుగా పేర్కొంది. అలాగే తైవాన్‌, వివాదాస్పద సౌత్‌ చైనా సముద్రాన్ని కూడా తమ స్టాండర్డ్‌ మ్యాప్‌లో చూపించింది. ఇంతకుముందు కూడా చైనా ఇలా పలుమార్లు భారత్‌ను రెచ్చగొట్టే విధంగా మ్యాప్‌లు విడుదల చేసింది. తాజాగా మరోసారి పొరుగుదేశం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కాగా అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగమని, ముందు నుంచీ అలాగే ఉందని.. ఇక ముందు కూడా అలాగే ఉంటుందని భారత్‌ పలుమార్లు వెల్లడించింది. 

చైనా విడుదల చేసిన మ్యాప్‌ ప్రకారం.. అరుణాచల్‌ ప్రదేశ్‌ను సౌత్‌ టిబెట్‌గా, అక్సాయిచిన్‌ను 1962 యుద్ధంలో చైనా ఆక్రమించుకున్నట్లుగా చూపిస్తోంది. తాజా ఎడిషన్‌ మ్యాప్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాలు తమవేనని చూపించింది . అలాగే వివాదాస్పద వివాదాస్పదమైన తొమ్మిది డ్యాష్‌ లైన్స్‌ కూడా చైనా మ్యాప్‌లో చూపించింది. దీని ప్రకారం దక్షిణ చైనా సముద్రంలో చాలా భాగాన్ని చైనా భూభాగంగా పేర్కొంటోంది. ఈ చర్య కారణంగా వియత్నాం, ఫిలిప్పీన్స్‌, మలేషియా, బ్రూనై, తైవాన్‌ వంటి దేశాల నుంచి కూడా డ్రాగన్‌ వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఈ దేశాలు కూడా సముద్రంలోని కొన్ని ప్రాంతాలను తమవంటే తమవి అని పోటీ పడుతున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

US Iran News: ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!  
ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!  
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Cross Border Love Story: సరిహద్దులు దాటిన ప్రేమకథ! ఉరీ ఎల్‌ఓసీ వేదికగా స్నాప్‌చాట్ ప్రేమికుల ఎమోషనల్ థ్రిల్లర్! ఎమోషనల్ క్లైమాక్స్
సరిహద్దులు దాటిన ప్రేమకథ! ఉరీ ఎల్‌ఓసీ వేదికగా స్నాప్‌చాట్ ప్రేమికుల ఎమోషనల్ థ్రిల్లర్! ఎమోషనల్ క్లైమాక్స్
Doppelgangers : మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారా? పరిశోధనలో బయటపడిన ఆసక్తికర విషయాలు ఇవే
మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారా? పరిశోధనలో బయటపడిన ఆసక్తికర విషయాలు ఇవే

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget