అన్వేషించండి

Red Sea: ర‌క్త మోడుతున్న ఎర్ర స‌ముద్రం.. వ‌ర‌ల్డ్ హాట్ టాపిక్ ఎందుకైంది?

గ‌త కొన్ని రోజులుగా ఎర్ర స‌ముద్రం వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఇక్క‌డ జ‌రుగుతున్న సాయుధ పోరు, ముఖ్యంగా హౌతీఉగ్ర‌వాదులు చేస్తున్న విధ్వంసాలు ప్రధానంగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

Houty In Red Sea: చిన్న‌ప్పుడు ఎర్ర స‌ముద్రం(Red Sea) గురించి పాఠాల్లో చ‌దువుకున్న విష‌యం గుర్తుండే ఉంటుంది. ఆ త‌ర్వాత పెద్ద‌గా ఈ విష‌యాన్ని ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. కానీ, గ‌త కొన్ని రోజులుగా ఎర్ర స‌ముద్రం వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఇక్క‌డ జ‌రుగుతున్న సాయుధ పోరు, ముఖ్యంగా హౌతీ(Houty) ఉగ్ర‌వాదులు చేస్తున్న విధ్వంసాలు ప్రధానంగా చ‌ర్చ‌నీయాంశ‌మే కాకుండా.. ప్ర‌పంచ వార్త‌లుగా నిలుస్తున్నాయి. ఇప్పుడు ఏ దేశాన్ని(Country) క‌దిపినా.. ఎర్ర స‌ముద్రంలో హౌతీల దాడుల గురించే చ‌ర్చ సాగుతోంది. 

ఏంటీ ఎర్ర స‌ముద్రం?

ఆసియా, ఆఫ్రికా ఖండాల మ‌ధ్య ఉన్న తీవ్ర ల‌వ‌ణీయ స‌ముద్రమే ఎర్ర స‌ముద్రం(Red Sea). గ్రీకు దేశానికి చెందిన హిప్పాలస్(Hippalas) అనే నావికుడు ఎర్ర సముద్రం నుంచి భారత దేశానికి(India) సముద్ర మార్గం కనిపెట్టాడని ప‌రిశోధ‌కులు చెబుతారు. ఈ స‌ముద్ర(Sea) విస్తీర్ణం సుమారు 4 ల‌క్ష‌ల 38 వేల కిలో మీట‌ర్లు ఉంటుంది. అంతేకాదు.. పొడ‌వు 2 వేల 250 కిలో మీట‌ర్లు ఉండ‌గా, వెడ‌ల్పు మాత్రం 335 కిలో మీట‌ర్లు ఉంటుంది. ఇక‌, స‌ముద్రం లోతు 2 వేల 211 మీట‌ర్లు ఉంది. రోమ‌న్ సామ్రాజ్యాన్ని పాలించిన ఆగస్టస్(Augustus)  అనే చ‌క్ర‌వ‌ర్తి.. ఎర్ర సముద్రం ద్వారా భారతదేశంతో వ్యాపారం సాగించేవారు. భారత దేశ ఓడరేవుల నుంచి చైనా ఉత్పత్తులు ఎర్ర సముద్రం ద్వారా రోమన్లకు చేరేవి. 

ఇప్పుడు ఏం జ‌రుగుతోంది?

సౌదీ అరేబియా, యెమెన్, ఈజిప్టు, ఇజ్రాయెల్‌, జోర్డాన్, డ్జిబౌటి, ఎరిట్రియా, సోమాలియా, ఈజిప్టు త‌దిత‌ర దేశాలు  ఈ ఎర్ర స‌ముద్ర తీరంలో ఉన్నాయి. ఆయా దేశాల‌కు ప్ర‌పంచ స్థాయిలో వాణిజ్య బంధాల‌ను కూడా ఈ స‌ముద్ర‌మే బ‌లోపేతం చేసింది. ఈ స‌ముద్రం గుండానే రూ.ల‌క్ష‌ల కోట్ల రూపాయల వ్యాపారం నిరంత‌రాయంగా సాగుతోంది. అయితే.. ఇప్పుడు ఈ స‌ముద్రం వివాదంగా మారింది. ఇజ్రాయెల్ పై పాల‌స్తానాలోని హ‌మాస్ ఉగ్ర‌వాదులు దాడులు చేసిన త‌ర్వాత‌.. ఈ దాడుల‌ను ఇజ్రాయెల్ ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. క‌న్నుకు క‌న్ను.. అన్న విధంగా ఎదురు దాడులు చేసి.. హమాస్‌ను నిర్మూలించే దిశ‌గా ఇజ్రాయెల్ భీక‌ర యుద్ధం సాగిస్తోంది. 

స‌మాంత‌ర ప్ర‌భుత్వం

యెమెన్‌లోని మెజారిటీ ప్రాంతాల‌ను త‌మ హ‌స్త‌గ‌తంలో ఉంచుకుని స‌మాంత‌ర ప్ర‌భుత్వాన్ని సాగిస్తున్న హౌతీ ఉగ్ర‌వాదులు.. హ‌మాస్ ఉగ్ర‌వాదుల‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. ఈ క్ర‌మంలో ఇజ్రాయెల్‌పై దాడులు చేయ‌కుండా.. చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ప్ర‌పంచ దేశాల నుంచి ఇజ్రాయెల్‌కు సాయం అంద‌కుండా చేయ‌డంతోపాటు.. ప్ర‌పంచ దేశాలు ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉండ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ దేశ‌ల‌ను ప‌రోక్షంగా దెబ్బ కొట్టేలా.. ఎర్ర స‌ముద్రాన్ని అడ్డాగా మార్చుకున్నారు. 

దాడులు ఆగ‌వా?

ఎర్ర స‌ముద్రం గుండా రాక‌పోక‌లు సాగించే వాణిజ్య నౌక‌ల‌ను టార్గెట్ చేసుకుని.. హౌతీ ఉగ్ర‌వాదులు పేట్రేగి పోతున్నారు. దీంతో ఏ దేశం నుంచి ఈ మార్గం గుండా నౌక‌లు ప్ర‌యాణిస్తున్నా.. వాటిని అడ్డుకుంటున్నారు. ధ్వ‌సం చేస్తున్నారు. పౌరుల‌ను సైతం చంపేస్తున్నారు. ఇటీవ‌ల భార‌త్‌కు చెందిన నౌక‌కు కూడా నిప్పు పెట్టిన విష‌యం సంచ‌ల‌నం సృష్టించింది. దీంతో ఎర్ర సముద్రంలో ఇప్పుడు ర‌క్త‌పు టేరుగా మారింద‌ని ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడులు ఆగేవ‌ర‌కు.. హ‌మాస్ తేరుకునే వ‌ర‌కు.. త‌మ యుద్ధం ఆగ‌బోద‌ని హౌతీలు తేల్చి చెబుతున్నారు. 

ప్ర‌పంచ దేశాల ఆందోళ‌న 

ప్ర‌పంచ దేశాల్లో కీల‌క‌మైన అమెరికా, బ్రిట‌న్‌లు.. హౌతీ ఉగ్ర‌వాదుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని క్షిప‌ణి దాడులు కొన‌సాగిస్తున్నాయి. యెమెన్‌లోని హౌతీ ఉగ్ర‌వాద ప్రాబ‌ల్యం.. వారి ఆధిప‌త్యం ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో దాడులు ముమ్మ‌రం అయ్యాయి. వీటిని హౌతీ ఉగ్ర‌వాదులు మ‌రింత తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నారు. తాము ఈ దాడుల‌ను ఉపేక్షించేది లేద‌ని తేల్చి చెబుతున్నారు. దీంతో ఇటు ప్ర‌పంచానికి, అటు హౌతీల‌కు మ‌ధ్య స‌మ‌రం మ‌రింత పెరిగే సూచ‌న‌లే క‌నిపిస్తున్నాయ‌ని.. ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. ఎర్ర స‌ముద్రం ఇప్పుడు ఈ దాడుల కార‌ణంగా నిజంగానే ఎర్ర బార‌డం.. క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్న విష‌యం. 

టాప్ హెడ్ లైన్స్

Japan Illegal Mosque Inauguration: జపాన్‌లో పాకిస్తాన్‌కు ఊహించని షాక్ - పర్మిషన్ లేని మసీదును ప్రారంభించిన రాయబారి.. కూల్చివేతకు జపాన్ ఆర్డర్!
జపాన్‌లో పాకిస్తాన్‌కు ఊహించని షాక్ - పర్మిషన్ లేని మసీదును ప్రారంభించిన రాయబారి.. కూల్చివేతకు జపాన్ ఆర్డర్!
Texas Resident Rips Indian Flag: డాలస్‌లో రెచ్చిపోతున్న పనీపాటా లేని అమెరికన్ యువత - భారత జెండాలు చించి జాత్యాహంకారం -సోషల్ మీడియా వైరల్ కోసమే !
డాలస్‌లో రెచ్చిపోతున్న పనీపాటా లేని అమెరికన్ యువత - భారత జెండాలు చించి జాత్యాహంకారం -సోషల్ మీడియా వైరల్ కోసమే !
ABP India at 2047 Conclave: పశ్చిమాసియా అనిశ్చితితో భారత్‌లో ఆర్థిక ముప్పు.. దిగుమతులపై నిషేధం సరికాదు: మాంటెక్ సింగ్ అహ్లూవాలియా
పశ్చిమాసియా అనిశ్చితితో భారత్‌లో ఆర్థిక ముప్పు.. దిగుమతులపై నిషేధం సరికాదు: మాంటెక్ సింగ్ అహ్లూవాలియా
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget