అన్వేషించండి

Papua New Guinea: ఘోర విషాదం - కొండ చరియలు విరిగి 2 వేల మంది సజీవ సమాధి

LandSlide: పపువా న్యూ గునియాలో కొండ చరియలు విరిగి పడిన ఘటనలో 2 వేల మంది సజీవ సమాధి అయినట్లు అక్కడి ప్రభుత్వం ఐరాసకు వెల్లడించింది.

2 Thousand People Died Due To Landslide In Papua New Guinea: నైరుతి పసిఫిక్‌లోని ద్వీపదేశమైన పావువా న్యూ గునియాలో ప్రకృతి విపత్తు కారణంగా ఘోర విషాదం చోటు చేసుకుంది. కొండ చరియలు విరిగి పడిన ఘటనలో దాదాపు 2 వేల మంది సజీవ సమాధి అయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశంలోని నేషనల్ డిజాస్టర్ సెంటర్.. ఐరాసకు వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఉదయం లేఖ రాసింది. 'కొండచరియలు విరిగి పడిన ఘటనలో 2 వేల మంది ప్రజలు సజీవ సమాధి అయ్యారు. వేల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయి. ఆహార పంటలకు తీవ్ర నష్టం సంభవించింది. ఈ విపత్తు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది' అని ఐరాస్ కార్యాలయానికి సమాచారం అందించింది. అయితే, దాదాపు 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ బీభత్సం సంభవించగా.. కొన్నిచోట్ల 8 మీటర్ల ఎత్తున శిథిలాలు కుప్పలుగా పడినట్లు తెలుస్తోంది. 

సహాయక చర్యలు ముమ్మరం

విపత్తుతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను కాపాడేందుకు బృందాలు శ్రమిస్తున్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో మృతదేహాలను గుర్తించారు. ఇప్పటికీ చాలా చోట్ల కొండ చరియలు విరిగి పడుతుండడంతో సహాయక బృందాలకు సవాల్‌గా మారింది. సైన్యం, ఇతర బృందాలను సైతం సహాయక చర్యల కోసం సిద్ధం చేస్తున్నారు. అటు, మిత్రదేశాలు అందించే సాయాన్ని డిజాస్టర్ సెంటర్ ద్వారా సమన్వయం చేసుకుంటామని అక్కడి ప్రభుత్వం తెలిపింది.

పెను విపత్తు

పాపువా న్యూ గునియాలోని రాజధాని పోర్ట్ మోర్స్‌బీకి 600 కిలోమీటర్ల దూరం ఎంగా ప్రావిన్స్‌లోని యంబాలి గ్రామంలో ఈ నెల 24న (శుక్రవారం) తెల్లవారుజామున మౌంట్ ముంగాల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ క్రమంలో ఆ ప్రావిన్స్ లో చాలా ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. తొలుత పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయని అక్కడి ప్రభుత్వం భావించగా.. అనంతరం భారీ విపత్తు జరిగినట్లు గుర్తించింది. భారీ భవనాలు, పంటలు కూడా శిథిలాల కింద చిక్కుకున్నట్లు తేలింది. ఈ ప్రమాదంలో దాదాపు 150 ఇళ్లు ధ్వంసయ్యాయని లెక్క తేలింది. అంతకు ముందు 60 ఇళ్లు ఇలాగే మట్టిలో కూరుకుపోయినట్టు అధికారులు వెల్లడించారు. తొలుత 670 మంది మట్టిలో కూరుకుపోయి చనిపోయినట్లు అంచనా వేయగా.. అనంతరం మృతుల సంఖ్య వేలకు చేరింది. ఇప్పటివరకూ 2 వేల మంది సజీవ సమాధి అయ్యారని అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. విపత్తు సంభవించిన వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఎక్కడికక్కడ మట్టి పోగవడం వల్ల రెస్క్యూ ఆపరేషన్స్‌కి కూడా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒక్కో చోట 20 - 26 అడుగుల లోతులో కూరుకుపోయిన బాధితులను చాలా శ్రమించి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అటు, పోర్గెర మైన్‌కు వెళ్లే ప్రధాన జాతీయ రహదారి ఈ ఘటనలో తీవ్రంగా దెబ్బతినగా.. రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం పలుచోట్ల సహాయక శిబిరాలు ఏర్పాటు చేసింది.

Also Read: Gaza: ఇజ్రాయేల్‌పై బిగ్‌ మిజైల్‌ని ప్రయోగించిన హమాస్‌, ఉలిక్కిపడ్డ టెల్ అవీవ్ - యుద్ధం మరింత తీవ్రం!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
Embed widget