అన్వేషించండి

Bharat Bandh: ఇవాళ భారత్ బంద్‌ ఎందుకు చేస్తున్నారో తెలుసా? ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా ఎఫెక్ట్!

Bharat Bandh Updates: సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆగస్టు 1వ తేదీన తీర్పునిచ్చింది. ఈ తీర్పుని వ్యతిరేకిస్తూ పలు వర్గాలు ఇవాళ భారత్‌ బంద్‌కి పిలుపునిచ్చాయి.

Why Bharat Bandh: దేశవ్యాప్తంగా ఇవాళ (ఆగస్టు 21) భారత్ బంద్ కొనసాగుతోంది.  Reservation Bachao Sangharsh Samiti ఈ బంద్‌కి పిలుపునిచ్చింది. ఇప్పటికే ఈ ఎఫెక్ట్ పలు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. పోలీసులు,నిరసనకారుల మధ్య పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయియ. అత్యవసర సేవలు మాత్రమే ఇవాళ పని చేయనున్నాయి. హాస్పిటల్స్, ఆంబులెన్స్‌లు, ఫార్మసీలు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు పోలీస్ సర్వీస్‌లూ అందుబాటులోనే ఉంటాయి. ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లైకి ఎలాంటి అంతరాయం కలగదు. ఇక బ్యాంక్‌లూ తెరిచే ఉంటాయి. అయితే..ఈ బంద్ ప్రభావం ఎక్కువగా రాజస్థాన్‌లో కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ పలు చోట్ల స్కూల్స్ మూసేశారు. మిగతా చోట్ల విద్యాసంస్థలు యథావిధిగా నడుస్తున్నాయి. 

ఇంతకీ బంద్ ఎందుకు..?

ఎస్‌సీ, ఎస్టీ రిజర్వేషన్‌లపై ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. సబ్ కేటగిరీలు చేర్చుకోవచ్చని, అవసరమైన వాళ్లందరికీ ఈ రిజర్వేషన్‌ ఫలాలు అందాలని తేల్చి చెప్పింది. వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నో రోజులుగా దీనిపై పోరాటం జరుగుతుండగా ఇన్నాళ్లకు ఆ వర్గానికి సానుకూలంగా తీర్పు వచ్చింది. అయితే..ఈ తీర్పుని విభేదిస్తున్న వాళ్లూ ఉన్నారు. దళితులు, ఆదివాసీలు పెద్ద ఎత్తున ఈ తీర్పుని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా రాజస్థాన్‌లో ఈ వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. భారత్ బంద్‌కి అక్కడి వర్గాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆగస్టు 1వ తేదీన వచ్చిన తీర్పు తమకు ఏ మాత్రం నచ్చలేదని, అంతకు ముందున్న రిజర్వేషన్‌ విధానాన్నే కొనసాగించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇప్పటికే ఈ ఆందోళనలకు మద్దతునిచ్చారు. ఝార్ఖండ్ ముక్తి మోర్ఛతో పాటు కాంగ్రెస్,RJD కూడా మద్దతు ప్రకటించాయి. ఈ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని భద్రతను భారీగా పెంచారు. పలు చోట్ల పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. యూపీ, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌లో భద్రత పటిష్ఠం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.  (Also Read: Badlapur: టాయిలెట్‌లో చిన్నారులను లైంగికంగా వేధించిన స్వీపర్, ఎవరూ లేని సమయంలో దారుణం - బాలల హక్కుల సంఘం విచారణ)

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి..?

ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు రాష్ట్రాలకు అధికారం కల్పిస్తూ తీర్పు ఇచ్చింది. విద్య, ఉద్యోగాల్లో వర్గీకరణ చేసేందుకు అనుమతినిచ్చింది. CJI డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోనే ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. అయితే..వీరిలో ఆరుగురు వర్గీకరణకు మొగ్గు చూపగా ఒకరు మాత్రం వ్యతిరేకించారు. మొత్తంగా 6:1 మెజార్టీతో ఈ తీర్పు వెలువడింది. 

Also Read: Kolkata: ఆ రాత్రంతా ఇద్దరు వేశ్యలతో నిందితుడు, రెడ్‌లైట్ ఏరియా నుంచి నేరుగా హాస్పిటల్‌కి - ఆపై డాక్టర్‌పై హత్యాచారం

టాప్ హెడ్ లైన్స్

Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Rawalakot Protest PoJK: పాకిస్తాన్‌కు పీఓకే షాక్.. భారత్‌లో కలుస్తామంటూ రావాలాకోట్‌లో వేలాది మంది నిరసనకారుల ర్యాలీ!
పాకిస్తాన్‌కు పీఓకే షాక్.. భారత్‌లో కలుస్తామంటూ రావాలాకోట్‌లో వేలాది మంది నిరసనకారుల ర్యాలీ!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Breaking News: పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Embed widget