అన్వేషించండి

Bharat Bandh: ఇవాళ భారత్ బంద్‌ ఎందుకు చేస్తున్నారో తెలుసా? ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా ఎఫెక్ట్!

Bharat Bandh Updates: సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆగస్టు 1వ తేదీన తీర్పునిచ్చింది. ఈ తీర్పుని వ్యతిరేకిస్తూ పలు వర్గాలు ఇవాళ భారత్‌ బంద్‌కి పిలుపునిచ్చాయి.

Why Bharat Bandh: దేశవ్యాప్తంగా ఇవాళ (ఆగస్టు 21) భారత్ బంద్ కొనసాగుతోంది.  Reservation Bachao Sangharsh Samiti ఈ బంద్‌కి పిలుపునిచ్చింది. ఇప్పటికే ఈ ఎఫెక్ట్ పలు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. పోలీసులు,నిరసనకారుల మధ్య పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయియ. అత్యవసర సేవలు మాత్రమే ఇవాళ పని చేయనున్నాయి. హాస్పిటల్స్, ఆంబులెన్స్‌లు, ఫార్మసీలు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు పోలీస్ సర్వీస్‌లూ అందుబాటులోనే ఉంటాయి. ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లైకి ఎలాంటి అంతరాయం కలగదు. ఇక బ్యాంక్‌లూ తెరిచే ఉంటాయి. అయితే..ఈ బంద్ ప్రభావం ఎక్కువగా రాజస్థాన్‌లో కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ పలు చోట్ల స్కూల్స్ మూసేశారు. మిగతా చోట్ల విద్యాసంస్థలు యథావిధిగా నడుస్తున్నాయి. 

ఇంతకీ బంద్ ఎందుకు..?

ఎస్‌సీ, ఎస్టీ రిజర్వేషన్‌లపై ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. సబ్ కేటగిరీలు చేర్చుకోవచ్చని, అవసరమైన వాళ్లందరికీ ఈ రిజర్వేషన్‌ ఫలాలు అందాలని తేల్చి చెప్పింది. వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నో రోజులుగా దీనిపై పోరాటం జరుగుతుండగా ఇన్నాళ్లకు ఆ వర్గానికి సానుకూలంగా తీర్పు వచ్చింది. అయితే..ఈ తీర్పుని విభేదిస్తున్న వాళ్లూ ఉన్నారు. దళితులు, ఆదివాసీలు పెద్ద ఎత్తున ఈ తీర్పుని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా రాజస్థాన్‌లో ఈ వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. భారత్ బంద్‌కి అక్కడి వర్గాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆగస్టు 1వ తేదీన వచ్చిన తీర్పు తమకు ఏ మాత్రం నచ్చలేదని, అంతకు ముందున్న రిజర్వేషన్‌ విధానాన్నే కొనసాగించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇప్పటికే ఈ ఆందోళనలకు మద్దతునిచ్చారు. ఝార్ఖండ్ ముక్తి మోర్ఛతో పాటు కాంగ్రెస్,RJD కూడా మద్దతు ప్రకటించాయి. ఈ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని భద్రతను భారీగా పెంచారు. పలు చోట్ల పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. యూపీ, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌లో భద్రత పటిష్ఠం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.  (Also Read: Badlapur: టాయిలెట్‌లో చిన్నారులను లైంగికంగా వేధించిన స్వీపర్, ఎవరూ లేని సమయంలో దారుణం - బాలల హక్కుల సంఘం విచారణ)

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి..?

ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు రాష్ట్రాలకు అధికారం కల్పిస్తూ తీర్పు ఇచ్చింది. విద్య, ఉద్యోగాల్లో వర్గీకరణ చేసేందుకు అనుమతినిచ్చింది. CJI డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోనే ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. అయితే..వీరిలో ఆరుగురు వర్గీకరణకు మొగ్గు చూపగా ఒకరు మాత్రం వ్యతిరేకించారు. మొత్తంగా 6:1 మెజార్టీతో ఈ తీర్పు వెలువడింది. 

Also Read: Kolkata: ఆ రాత్రంతా ఇద్దరు వేశ్యలతో నిందితుడు, రెడ్‌లైట్ ఏరియా నుంచి నేరుగా హాస్పిటల్‌కి - ఆపై డాక్టర్‌పై హత్యాచారం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
IPL 2026 Play Offs Shchedule: రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
త్వరలో పెరగనున్న Maruti Alto K10 ధర.. చీపెస్ట్ కారు ఇక కాస్ట్‌లీ- ధర, ఫీచర్లు చూశారా
త్వరలో పెరగనున్న Maruti Alto K10 ధర.. చీపెస్ట్ కారు ఇక కాస్ట్‌లీ- ధర, ఫీచర్లు చూశారా

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
IPL 2026 Play Offs Shchedule: రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
IPL 2026 RR VS MI Result Update: స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై రాయ‌ల్స్ గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై RR గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Crime Thriller OTT : వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
Embed widget