అన్వేషించండి

Bharat Bandh: ఇవాళ భారత్ బంద్‌ ఎందుకు చేస్తున్నారో తెలుసా? ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా ఎఫెక్ట్!

Bharat Bandh Updates: సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆగస్టు 1వ తేదీన తీర్పునిచ్చింది. ఈ తీర్పుని వ్యతిరేకిస్తూ పలు వర్గాలు ఇవాళ భారత్‌ బంద్‌కి పిలుపునిచ్చాయి.

Why Bharat Bandh: దేశవ్యాప్తంగా ఇవాళ (ఆగస్టు 21) భారత్ బంద్ కొనసాగుతోంది.  Reservation Bachao Sangharsh Samiti ఈ బంద్‌కి పిలుపునిచ్చింది. ఇప్పటికే ఈ ఎఫెక్ట్ పలు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. పోలీసులు,నిరసనకారుల మధ్య పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయియ. అత్యవసర సేవలు మాత్రమే ఇవాళ పని చేయనున్నాయి. హాస్పిటల్స్, ఆంబులెన్స్‌లు, ఫార్మసీలు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు పోలీస్ సర్వీస్‌లూ అందుబాటులోనే ఉంటాయి. ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లైకి ఎలాంటి అంతరాయం కలగదు. ఇక బ్యాంక్‌లూ తెరిచే ఉంటాయి. అయితే..ఈ బంద్ ప్రభావం ఎక్కువగా రాజస్థాన్‌లో కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ పలు చోట్ల స్కూల్స్ మూసేశారు. మిగతా చోట్ల విద్యాసంస్థలు యథావిధిగా నడుస్తున్నాయి. 

ఇంతకీ బంద్ ఎందుకు..?

ఎస్‌సీ, ఎస్టీ రిజర్వేషన్‌లపై ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. సబ్ కేటగిరీలు చేర్చుకోవచ్చని, అవసరమైన వాళ్లందరికీ ఈ రిజర్వేషన్‌ ఫలాలు అందాలని తేల్చి చెప్పింది. వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నో రోజులుగా దీనిపై పోరాటం జరుగుతుండగా ఇన్నాళ్లకు ఆ వర్గానికి సానుకూలంగా తీర్పు వచ్చింది. అయితే..ఈ తీర్పుని విభేదిస్తున్న వాళ్లూ ఉన్నారు. దళితులు, ఆదివాసీలు పెద్ద ఎత్తున ఈ తీర్పుని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా రాజస్థాన్‌లో ఈ వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. భారత్ బంద్‌కి అక్కడి వర్గాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆగస్టు 1వ తేదీన వచ్చిన తీర్పు తమకు ఏ మాత్రం నచ్చలేదని, అంతకు ముందున్న రిజర్వేషన్‌ విధానాన్నే కొనసాగించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇప్పటికే ఈ ఆందోళనలకు మద్దతునిచ్చారు. ఝార్ఖండ్ ముక్తి మోర్ఛతో పాటు కాంగ్రెస్,RJD కూడా మద్దతు ప్రకటించాయి. ఈ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని భద్రతను భారీగా పెంచారు. పలు చోట్ల పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. యూపీ, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌లో భద్రత పటిష్ఠం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.  (Also Read: Badlapur: టాయిలెట్‌లో చిన్నారులను లైంగికంగా వేధించిన స్వీపర్, ఎవరూ లేని సమయంలో దారుణం - బాలల హక్కుల సంఘం విచారణ)

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి..?

ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు రాష్ట్రాలకు అధికారం కల్పిస్తూ తీర్పు ఇచ్చింది. విద్య, ఉద్యోగాల్లో వర్గీకరణ చేసేందుకు అనుమతినిచ్చింది. CJI డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోనే ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. అయితే..వీరిలో ఆరుగురు వర్గీకరణకు మొగ్గు చూపగా ఒకరు మాత్రం వ్యతిరేకించారు. మొత్తంగా 6:1 మెజార్టీతో ఈ తీర్పు వెలువడింది. 

Also Read: Kolkata: ఆ రాత్రంతా ఇద్దరు వేశ్యలతో నిందితుడు, రెడ్‌లైట్ ఏరియా నుంచి నేరుగా హాస్పిటల్‌కి - ఆపై డాక్టర్‌పై హత్యాచారం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Embed widget