అన్వేషించండి

Nara Lokesh: 'వైసీపీ హయాంలో అన్ని విభాగాల ఉద్యోగులకు తీవ్ర నష్టం' - అధికారంలోకి రాగానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేస్తామన్న లోకేశ్

Andhra News: సీఎం జగన్ మాయమాటలతో అన్ని విభాగాల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేస్తామన్నారు.

Outsourcing Employees Letter to Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) దివాలాకోరు పాలనలో అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) మండిపడ్డారు. యువగళం (Yuvagalam) పాదయాత్రలో భాగంగా సోమవారం ఆయన్ను, గాజువాక (Gajuwaka) అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని జీవీఎంసీ శ్రీనగర్ లో సోమవారం వాటర్ సప్లై ఇంజినీరింగ్ విభాగం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిశారు. తాము 20 ఏళ్లుగా నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్నామని తమను మినిమం టైమ్ స్కేల్ ఉద్యోగులుగా మార్చేలా చొరవ చూపాలని వినతిపత్రం సమర్పించారు. 'టీడీపీ ప్రభుత్వ హయాంలో 2019, ఫిబ్రవరి 8న జీవో 96 ద్వారా మమ్మల్ని మినిమం టైమ్ స్కేల్ కార్మికులుగా చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఆ ఆదేశాలు అమలయ్యేలోపు ప్రభుత్వం మారిపోయింది. ప్రస్తుతం మాకు రూ.13 వేల వేతనం మాత్రమే వస్తుంది. మాకు ఆప్కాస్ ద్వారా జీతాలు ఇవ్వడంతో ప్రభుత్వ పథకాలు సైతం అందడం లేదు. ఎంటీఎస్ ను అమలు చేయాలి.' అని లోకేశ్ కు విన్నవించారు. అలాగే, కరోనాలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని కోరారు.

లోకేశ్ హామీ

దీనిపై స్పందించిన లోకేశ్, పర్మినెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సైతం జగన్ మాటలు నమ్మి మోసపోయారని అన్నారు. అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలిచ్చి మాట తప్పడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లాలో రూ.వందల కోట్లు వెచ్చించి సత్యసాయి మంచినీటి పథకాన్ని నిర్మిస్తే ఉద్యోగులకు జీతాలు, నిర్వహణ ఖర్చులు ఇవ్వలేక నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే వాటర్ వర్క్స్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిబంధనలకు లోబడి కరోనా సమయంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఉపాధి కల్పించే అంశాన్ని పరిశీలిస్తాన్నారు.

ముగిసిన 'యువగళం'

కాగా, నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్ర సోమవారం సాయంత్రం ముగిసింది. విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ ను ఆవిష్కరించి ఆయన తన పాదయాత్రను ముగించారు. చివరి రోజు గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ వడ్లమూడి జంక్షన్ నుంచి పాదయాత్ర ప్రారంభించగా, తల్లి భువనేశ్వరి, అత్త నందమూరి వసుంధరా దేవి, ఇతర కుటుంబసభ్యులతో కలసి ఆయన ముందుకు నడిచారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన టీడీపీ, జనసేన శ్రేణులతో ఆ ప్రాంతం పసుపు సంద్రాన్ని తలపించింది. పైలాన్ ఆవిష్కరణ అనంతరం లోకేశ్, తన పాదయాత్రలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అసమర్థుడు గద్దెనెక్కి ప్రజాస్వామ్యంపై దాడి చేశారని విమర్శించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కాగా, రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,028 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు  ఆయన పాదయాత్ర సాగింది. సోమవారం ముగింపు సమయానికి లోకేశ్, 3,132 కి.మీలు నడిచినట్లైంది. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద పాదయాత్ర విజయోత్సవ సభను టీడీపీ భారీ ఎత్తున నిర్వహిస్తోంది.

Also Read: Nara Lokesh: 'యువగళం' ముగింపు సభకు రానున్న జనసేనాని పవన్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Who is Abhinandan Singh: రంజీ కూడా ఆడలేదు, నేరుగా ఐపీఎల్‌లో అరంగేట్రం.. ఎవరీ అభినందన్ సింగ్
రంజీ కూడా ఆడలేదు, నేరుగా ఐపీఎల్‌లో అరంగేట్రం.. ఎవరీ అభినందన్ సింగ్
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Tamil Nadu Assembly Elections 2026: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
IPL 2026 RCB vs SRH: ఆర్సీబీ, సన్‌రైజర్స్ పోరులో పైచేయి ఎవరిది? తొలి విజయం ఎవరికి దక్కుతుందో !
ఆర్సీబీ, సన్‌రైజర్స్ పోరులో పైచేయి ఎవరిది? తొలి విజయం ఎవరికి దక్కుతుందో !

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Affordable Mileage Cars: రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
Embed widget