అన్వేషించండి

Uttarakhand Nagrasu Gurdwara Standoff: మరో స్వర్ణదేవాలయం తరహా ఆపరేషన్ ? ఆ గురుద్వారాలో నాలుగు రోజులుగా బందీలు - రంగంలోకి ఆర్మీ !

Nihang Sikhs Armed Protest Rudraprayag: ఉత్తరాఖండ్‌లోని ఓ గురుద్వారా చుట్టూ నాలుగు రోజులుగా హైడ్రామా నడుస్తోంది. నిహాంగ్ సిక్కులు గురుద్వారాను హైజాక్ చేశారు. ఆర్మీ రంగంలోకి దిగింది.

Army Deployed At Uttarakhand Gurdwara: ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల మార్గంలో ఉన్న నాగ్రాసు గురుద్వారా  ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది. ఈటెలు, ఖడ్గాలు, గొడ్డళ్లు వంటి మారణాయుధాలతో గురుద్వారాలోకి దూసుకెళ్లిన నిహాంగ్ సిక్కుల బృందం, అక్కడ సృష్టించిన హైడ్రామా మంగళవారానికి నాలుగో రోజుకు చేరింది. చమోలి ఘర్షణల వల్ల  తమ వర్గానికి చెందిన నలుగురి అరెస్ట్‌కు నిరసనగా ఈ బృందం గురుద్వారా మూడో అంతస్తును తమ ఆధీనంలోకి తీసుకుని నిరసన తెలుపుతోంది. ఈ ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేయడానికి స్థానిక పోలీసులతో పాటు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ,  ఏకంగా సైన్యం రక్షణ రంగంలోకి దిగడం జాతీయస్థాయిలో సంచలనంగా మారింది.

శ్రీ హేమకుండ్ సాహిబ్ యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న నిహాంగ్ సిక్కుల బృందానికి, జూన్ 16న చమోలి జిల్లా కర్ణప్రయాగ మార్కెట్‌లోని ఒక హోటల్ సమీపంలో పార్కింగ్ విషయమై స్థానికులతో తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో నలుగురు స్థానికులు గాయపడటంతో.. చమోలి పోలీసులు   యాక్షన్ తీసుకుంటూ నలుగురు నిహాంగ్ సిక్కులను అరెస్ట్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ అరెస్టులపై నిరసన తెలపడానికి నాగ్రాసు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ను ఆశ్రయించిన సుమారు ఎనిమిది మంది నిహాంగులు.. శనివారం ఒక్కసారిగా గురుద్వారాపై దాడి చేసి, ఒక భక్తుడిని ,  ఒక సేవకుడిని  మూడో అంతస్తులో బందీలుగా చేసుకున్నారు.

ఈ సంక్షోభం తీవ్రం కావడంతో జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీలు రంగంలోకి దిగి నిహాంగులతో చర్చలు జరిపారు. ఫలితంగా శనివారం భక్తుడిని, ఆదివారం సాయంత్రానికి సేవకుడిని క్షేమంగా విడిపించారు. అయితే, గురుద్వారా   ప్రధాన పూజారి  బాబా బీంత్ సింగ్ ఈ నిహాంగ్ బృందంపై తీవ్ర ఆరోపణలు చేశారు.  యాత్రికులుగా వచ్చిన వారికి ఆశ్రయం కల్పించి, రాత్రి భోజనం పెడితే.. మరుసటి రోజు ఉదయం నుంచే వాలంటీర్లపై దాడులు చేస్తూ, బూతులు తిడుతూ హింసకు దిగారు  అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా గురుద్వారా వాటర్ సప్లై కట్ చేశారని, సోలార్ ప్యానెళ్లను ధ్వంసం చేస్తూ, పోలీసులపైకి, స్థానికులపైకి రాళ్లు రువ్వారని ఆయన ఆరోపించారు.

ఈ ఉద్రిక్తతల కారణంగా రుద్రప్రయాగ జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాదాపు 12 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. వదంతులు వ్యాపించకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తీసుకున్న ఈ నిర్ణయం.. 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంటర్నెట్ బ్యాన్ చేయడం ఇది కేవలం మూడోసారి మాత్రమే కావడం ఇక్కడి తీవ్రతను సూచిస్తోంది. సోమవారం నాటికి ఆర్మీ బలగాలు కూడా పట్టణానికి చేరుకోవడంతో గురుద్వారా వెలుపల భారీ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.  

ప్రస్తుతం గురుద్వారా లోపల ఉన్న నిహాంగులను శాంతింపజేయడానికి మరియు అధికారుల ఆదేశాలకు లోబడేలా చేయడానికి సిక్కు సమాజానికి చెందిన మరికొందరు నిహాంగ్ పెద్దలు రాయబారానికి వచ్చారు. వారి మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, ప్రస్తుతానికి గురుద్వారా లోపల, వెలుపల పరిస్థితి ప్రశాంతంగానే ఉందని సమాచార సంస్థ ANI తెలిపింది. డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచినట్లు, నేషనల్ హైవేపై ట్రాఫిక్ రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా సాధారణంగానే సాగుతోందని యంత్రాంగం స్పష్టం చేసింది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CWG Ajaya Babu: తండ్రి బాటలోనే కొడుకు.. ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ రికార్డ్ బ్రేక్ చేస్తూ అజయ్ బాబు సిల్వర్ కైవసం
తండ్రి బాటలోనే కొడుకు.. ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ రికార్డ్ బ్రేక్ చేస్తూ అజయ్ బాబు సిల్వర్ కైవసం
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Breaking News: ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Embed widget