అన్వేషించండి

గురుద్వారలోకి వెళ్లిన ఇండియన్ హైకమిషనర్, అడ్డగించిన సిక్కులు - వైరల్ వీడియో

Indian High Commissioner: స్కాట్‌లాండ్‌లో గురుద్వారలోకి వెళ్లిన భారత హైకమిషనర్‌ని సిక్కులు అడ్డుకున్నారు.

Indian High Commissioner: 


స్కాట్‌లాండ్‌లో ఘటన..

భారత్ కెనడా మధ్య వివాదం ఈ రెండు దేశాల్లోనే కాకుండా విదేశాల్లోనూ అలజడి సృష్టిస్తోంది. స్కాట్‌లాండ్‌లో ఇండియన్ హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామిని (Vikram Doraiswami) గురుద్వారలోకి రానివ్వకుండా అడ్డుకోవడం సంచలనమైంది. బ్రిటీష్ సిక్కులు కొందరు ఆయనను అడ్డగించారు. "మిమ్మల్ని ఎవరూ ఆహ్వానించలేదు" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని పట్టుబట్టారు. గురుద్వార కమిటీతో సమావేశమయ్యేందుకు విక్రమ్ దొరైస్వామి వచ్చినట్టు సమాచారం. కానీ...కొందరు సిక్కులు ఆయనను అడ్డగించారు. కొద్ది సేపు ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆయన రావడంపై గురుద్వార కమిటీ కూడా విచారం వ్యక్తం చేసిందని అక్కడి సిక్కు కార్యకర్తలు కొందరు తేల్చి చెప్పారు. నిజానికి యూకేలో ఏ గురుద్వారలోకి అయినా భారతీయులున్ని రానివ్వడం లేదు. భారత్, బ్రిటన్ మధ్య సత్సంబంధాలే ఉన్నప్పటికీ...ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య తరవాత బ్రిటన్‌లోని సిక్కుల్లో భారత్‌పై వ్యతిరేకత పెరిగింది. అందుకే ఇండియన్ హై కమిషనర్‌ని గురుద్వారలోకి రానివ్వకుండా ఇలా అడ్డుకున్నారు సిక్కులు. ఇప్పటికే భారత్, కెనడా మధ్య వివాదం ముదురుతోంది. ఇలాంటి సమయంలో ఈ ఘటన జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. సిక్కులు విక్రమ్ దొరైస్వామిని అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన వెళ్లిపోతుండగా కొందరు సిక్కులు వచ్చి కార్‌ని అడ్డగించారు. ఓ వ్యక్తి వాళ్లకు అడ్డుగా నిలిచాడు. విక్రమ్ దొరైస్వామి కార్ వెళ్లిపోయేంత వరకూ ఎలాంటి ఘర్షణ జరగకుండా చూశాడు. ఆ తరవాత ఆయన కార్ అక్కడి నుంచి వెళ్లిపోయింది.  Sikh Youth UK ఈ వీడియోని పోస్ట్ చేసింది. 

"విక్రమ్ దొరైస్వామిని ఎవరూ ఆహ్వానించలేదు. ఆయనే వచ్చారు. అందుకే సిక్కులు వచ్చి ఆయన్ని అడ్డుకున్నారు. కాసేపు ఘర్షణ జరిగింది. బహుశా గురుద్వార కమిటీ కూడా ఆయన ఆహ్వానం లేకుండా రావడంపై అసహనం వ్యక్తం చేసే ఉండొచ్చు. ఇక్కడే కాదు. యూకేలో గురుద్వారాల్లోకి భారతీయుల్ని రానివ్వడం లేదు. భారత్, యూకే తీరుతో ఇప్పటికే విసిగిపోయాం. హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య తరవాత బ్రిటీష్ సిక్కులంతా అప్రమత్తమయ్యారు"

-  బ్రిటీష్ సిక్కు యాక్టివిస్ట్ 

 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sikh Youth UK (@sikhyouthuk)

భారత్ కెనడా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించేందుకు కెనడా ఇప్పటికీ సిద్ధంగానే ఉందని వెల్లడించారు. నిజ్జర్ హత్య విషయంలో తాము భారత్‌పై చేసిన ఆరోపణలు చేసినప్పటికీ ద్వైపాక్షిక బంధం విషయానికొచ్చినప్పుడు వాటిని పక్కన పెట్టేస్తామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌ ఎలాంటి ప్రభావం చూపిస్తోందో గమనిస్తున్నామన్న ట్రూడో...భారత్‌తో మైత్రి కొనసాగించడం తమకు ఎంతో ముఖ్యమని తేల్చి చెప్పారు. ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన...ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read: మేమేం తలుపులు మూసేసి కూర్చోలేదు, ఆధారాలుంటే చూపించండి - కెనడాకి జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Goa Sarswat Math: పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
Advertisement

వీడియోలు

Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Goa Sarswat Math: పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
India GDP: భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
Annagaru Vostaru Teaser : నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది...  వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది... వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
Embed widget