News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Ukraine Returned Students: ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు సీట్ ఇవ్వలేం, షాక్ ఇచ్చిన కేంద్రం

Ukraine Returned Students: ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులకు భారత్‌లోని వర్సిటీల్లో సీట్ ఇవ్వేలమని సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది.

FOLLOW US: 
Share:

Ukraine Returned Students:

అనుమతి ఇవ్వలేం..

ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులకు భారత్‌లో సీటు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం వెల్లడించింది. సుప్రీం కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్‌లో ఈ విషయం పేర్కొంది. ఉక్రెయిన్‌ నుంచి వచ్చి ఇక్కడ వైద్య విద్యను కొనసాగించేందుకు అనుమతి కోరిన వారికి ఆ మేరకు పర్మిషన్ ఇవ్వలేమని ఆ అఫిడవిట్‌లో తెలిపింది. జస్టిస్ హేమంత్ గుప్తా నేతృత్వం వహిస్తున్న సుప్రీం కోర్టు ధర్మాసనం...ఈ అంశంపై
తదుపరి విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఉక్రెయిన్ నుంచి వచ్చి వైద్య విద్యార్థులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. రష్యా-ఉక్రెయిన్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణంతో తాము వైద్య విద్యను కొనసాగించలేకపోయామని అందులో వెల్లడించారు. స్టడీస్ కంటిన్యూ చేసేందుకు అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులు బాలేకపోవటం వల్ల వెంటనే భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చిందని చెప్పారు. అడ్వకేట్ అశ్వర్య సిన్హా కూడా సుప్రీంకోర్టులో ఇదే విషయమై పిటిషన్ వేశారు. దాదాపు 14 వేల మంది వైద్య విద్యార్థులు ఉక్రెయిన్‌ నుంచి ఉన్నట్టుండి తిరిగి రావాల్సి వచ్చిందని చెప్పారు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని..
తమ చదువుని కొనసాగించేలా చూడాలని అన్నారు. ఈ పరిణామాల వల్ల ఎంతో మంది విద్యార్థులు మానసికంగా ఆందోళన చెందుతున్నారని, వాళ్ల కెరీర్‌పై ఇదెంతో ప్రతికూల ప్రభావం చూపుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్లు తమ స్టడీస్‌నుకొనసాగించే పరిస్థితిలో లేరని, ఉక్రెయిన్‌ అందుకు అనుమతించటం లేదని వెల్లడించారు.  ప్రస్తుత నిబంధనల ప్రకారం... భారత్‌లో విద్యను కొనసాగించేలా చొరవ చూపాలని పిటిషన్‌లో కోరారు. 

వచ్చినప్పటి నుంచి ఇబ్బందులే..

ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులు అదే సంవత్సరాన్ని భారత్‌లో కొనసాగించేలా అనుమతినివ్వాలని కోరారు పిటిషనర్లు. ఆ మేరకు...నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 లోని సెక్షన్ 46 ప్రకారం...గైడ్‌లైన్స్‌ విడుదల చేయాలని అడిగారు. ఇందుకు 
సంబంధించిన స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్‌ను ఫాలో అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ లో  ఉన్న భారతీయ విద్యార్థులు 18వేల మంది. ఇందులో 99శాతం మెడికల్ స్టూడెంట్లే ఉంటారు. అసలు వివిధ దేశాల్లో చదవుల కోసం ఉంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా.. ? అక్షరాల 11లక్షల ౩౩వేల 749. విదేశాంగ శాఖ పార్లమెంట్‌లో ఇచ్చిన సమాధానం ఇది. ఇంజనీరింగ్, ఐటీ కోసం ఎక్కువుగా యు.ఎస్. కెనడా, యుకె. ఆస్ట్రేలియా వెళుతున్నారు.

మెడికల్ కోసం అయితే మాత్రం అందరూ చూసేది.. ఎక్కువగా ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, చెనా.. యుక్రెయిన్‌లో 18వేల మంది ఉంటే.. చైనాలో 23వేలు, ఫిలిప్పీన్స్ లో 15వేల మంది భారతీయ విద్యార్థులున్నారు. వీళ్లంతా కూడా భారత్‌లో సీట్లు రాక.. వైద్య విద్యను అభ్యసించడం కోసం బయటకు వెళ్లిన వాళ్లే.. అయితే ఈ దేశాల్లో వైద్యం చదివిన వాళ్లు ...ఇండియాలో ప్రాక్టీస్‌ చేయడం అంత తేలిక కాదు. దానికోసం వాళ్లు అత్యంత కఠిన మైన ఫారిన్‌ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్‌ను -FMGE నెగ్గాల్సి ఉంటుంది. విదేశీ విద్యార్థుల్లో కేవలం నాలుగోవంతు మాత్రమే సక్సెస్‌ అవుతారు. అయినా దేశాలు దాటి వెళ్తున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి సమస్య రావటం వల్ల భారత్‌లో స్టడీస్‌ను కంటిన్యూ చేసేందుకు తంటాలు పడుతున్నారు. అటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ఈ విద్యార్థులకు అండగా ఉంటామని గతంలో ప్రకటించారు. 

Also Read: Attack on Vladimir Putin: పుతిన్‌పై హత్యాయత్నం, కారుపై బాంబు దాడి చేసిన దుండగులు

Published at : 15 Sep 2022 05:08 PM (IST) Tags: Supreme Court Ukraine Returned Students Ukraine Returned Medical Students Indian universities

ఇవి కూడా చూడండి

Top Headlines Today: నాగార్జున సాగర్ వద్ద హై టెన్షన్; ఏపీ చర్యలు కరెక్టేనన్న అంబటి - నేటి టాప్ న్యూస్

Top Headlines Today: నాగార్జున సాగర్ వద్ద హై టెన్షన్; ఏపీ చర్యలు కరెక్టేనన్న అంబటి - నేటి టాప్ న్యూస్

ABP Desam Top 10, 1 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 1 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Deadlines in December: ఈ నెలలో ముగిసే బ్యాంక్‌ స్పెషల్‌ ఆఫర్లు, పూర్తి చేయాల్సిన పనులు - వీటిని మిస్‌ కావద్దు

Deadlines in December: ఈ నెలలో ముగిసే బ్యాంక్‌ స్పెషల్‌ ఆఫర్లు, పూర్తి చేయాల్సిన పనులు - వీటిని మిస్‌ కావద్దు

భారత్, ఆస్ట్రేలియా T20 మ్యాచ్ జరిగే స్టేడియంలో పవర్ కట్, రూ.3 కోట్ల బిల్ పెండింగ్

భారత్, ఆస్ట్రేలియా T20 మ్యాచ్ జరిగే స్టేడియంలో పవర్ కట్, రూ.3 కోట్ల బిల్ పెండింగ్

Viral News: సంచలనం, తల్లి డెడ్ బాడీతో ఏడాది పాటు ఇంట్లో ఉన్న అక్కాచెల్లెల్లు

Viral News: సంచలనం, తల్లి డెడ్ బాడీతో ఏడాది పాటు ఇంట్లో ఉన్న అక్కాచెల్లెల్లు

టాప్ స్టోరీస్

Counting Centers in Telangana: ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం - ఓట్ల లెక్కింపునకు జిల్లాల వారీగా కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూంల వద్ద భారీ భద్రత

Counting Centers in Telangana: ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం - ఓట్ల లెక్కింపునకు జిల్లాల వారీగా కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూంల వద్ద భారీ భద్రత

YSRCP Leader Arrest in US : బానిసత్వం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు - అమెరికాలో వైసీపీ నేత సత్తారు వెంకటేష్ రెడ్డి అరెస్ట్ !

YSRCP Leader Arrest in US : బానిసత్వం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు - అమెరికాలో వైసీపీ  నేత సత్తారు వెంకటేష్ రెడ్డి అరెస్ట్ !

Animal Movie Review - యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?

Animal Movie Review - యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?

Rs 2000 Notes: రూ.2,000 నోట్లు ఇప్పటికీ చెల్లుతాయి, కీలక అప్‌డేట్‌ ఇచ్చిన ఆర్‌బీఐ

Rs 2000 Notes: రూ.2,000 నోట్లు ఇప్పటికీ చెల్లుతాయి, కీలక అప్‌డేట్‌ ఇచ్చిన ఆర్‌బీఐ