Turkey Earthquake: టర్కీలోని ఇండియన్స్ అంతా సేఫ్! ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాం - ఇండియన్ అంబాసిడర్
Turkey Earthquake: టర్కీలోని భారతీయులంతా సేఫ్గా ఉన్నట్టు తెలుస్తోంది.
Turkey Earthquake:
3 వేల మంది ఇండియన్స్
టర్కీలో మృతుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో భారత్లోనూ టెన్షన్ పెరుగుతోంది. దాదాపు 3 వేల మంది భారతీయులు టర్కీలో ఉన్నట్టు సమాచారం. అయితే వీరెవరూ భూకంపం వచ్చిన ప్రాంతాల్లో లేరని అక్కడి టర్కీలోని ఇండియన్ అంబాసిడర్ వెల్లడించారు.
"టర్కీలో 3 వేల మంది భారతీయులున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో వాళ్లు లేరు. చాలా మంది అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. వాళ్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. భారతీయులు ఇబ్బందుల్లో ఉన్నారన్న సమాచారమైతే ఇప్పటి వరకూ మాకు రాలేదు"
- వీరందర్ పాల్, టర్కీలోని ఇండియన్ అంబాసిడర్
ఇండియన్ ఆర్మీ టర్కీలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగిస్తోందని చెప్పారు వీరందర్ పాల్. మెడికల్ టీమ్ కూడా అందుబాటులో ఉందని వివరించారు.
"హటాయ్ ప్రావిన్స్లో ఇండియన్ ఆర్మీ ఓ ఫీల్డ్ హాస్పిటల్ ఏర్పాటు చేసింది. రెండు C-17 ఎయిర్ క్రాఫ్ట్లలో మెడికల్ టీంతో పాటు మందులూ వచ్చాయి. 30 పడకలతో ఓ ఆసుపత్రి ఏర్పాటు చేశారు"
- వీరందర్ పాల్, టర్కీలోని ఇండియన్ అంబాసిడర్
ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయని, ప్రజలకు అవసరమైనవి అందించేందుకు అన్ని విధాలుగా భారత్ సహకరిస్తోందని చెప్పారు వీరందర్ పాల్. భారత్కు చెందిన NDRF టర్కీ సహాయక చర్యల్లో చాలా యాక్టివ్గా ఉంది. 8 ఏళ్ల చిన్నారిని రక్షించేందుకు టర్కీ ఆర్మీతో పాటు గంటల పాటు శ్రమించింది. శిథిలాల చిక్కుకున్న చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
#OperationDost
— NDRF 🇮🇳 (@NDRFHQ) February 10, 2023
Hard work & motivation pays;
NDRF team in co-ordination with Turkish Army successfully rescued another live victim (Girl aged 8Yrs) @ 1545hrs at Loc:Bahceli Evler Mahallesi, Nurdagi, Gaziantep, Turkiye@PMOIndia @HMOIndia @MEAIndia @BhallaAjay26 @PIB_India pic.twitter.com/wU8mePmewW
#OperationDost#SavingLivesAndBeyond#TurkeyQuake #TurkeySyriaEarthquake#Rescue #Relief #Update https://t.co/T5Q0SJAH3R
— NDRF 🇮🇳 (@NDRFHQ) February 10, 2023
ఇప్పటికే పెద్ద ఎత్తున వైద్య సాయం అందిస్తున్న ఇండియా...NDRF బృందాలనూ అక్కడికి పంపించి బాధితులకు అండగా నిలబడుతోంది. ఈ క్రమంలోనే ఓ డాగ్స్క్వాడ్నూ పంపింది. ఈ స్క్వాడ్లో మొత్తం నాలుగు శునకాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. వాటి పేర్లు రోమియో, జూలీ, హనీ, రాంబో. రెండు NDRF బృందాలతో పాటు ఈ డాగ్ స్వ్కాడ్ కూడా టర్కీకి చేరుకుంది. ఇలాంటి భారీ విపత్తులు జరిగినప్పుడు శిథిలాల కింద వారిని గుర్తించి NDRF బృందాలకు సాయ పడుతుంటాయి ఈ శునకాలు. NDRF కమాండర్ గురుమీందర్ సింగ్ ఈ స్క్వాడ్ గురించి మరి కొన్ని వివరాలు అందించారు. సహాయక చర్యల్లో శునకాలు ఎంతో సహకరిస్తున్నట్టు చెప్పారు. జూలీ అనే శునకం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని గుర్తించిందని, వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడగలిగామని తెలిపారు. భారత్తో పాటు మరి కొన్ని దేశాలూ డాగ్ స్క్వాడ్లను టర్కీకి పంపాయి.
NDRF Urban Search & Rescue medium team along with Rescue dogs and other necessary equipment lands at Adana Türkiye 🇹🇷 for #USAR #HADR Ops. #SavingLivesAndBeyond 🇮🇳@PMOIndia @HMOIndia @BhallaAjay26 @AtulKarwal @PIBHomeAffairs@IndianEmbassyTR pic.twitter.com/yGtkTV3rl0
— NDRF 🇮🇳 (@NDRFHQ) February 7, 2023
Also Read: Viral News: ఆన్లైన్లో బ్రెడ్ ప్యాకెట్ ఆర్డర్ చేశాడు, బ్రెడ్తో పాటు ఎలుక కూడా వచ్చింది
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets