By: ABP Desam | Updated at : 26 Apr 2023 07:50 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూత
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూశారు. శిరోమణి అకాలీదళ్ అధినేత ప్రకాష్ సింగ్ బాదల్ మంగళవారం రాత్రి 8.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 95. వయసురీత్యా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ప్రకాష్ సింగ్ బాదల్.. ఆదివారం మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఐసీయూలోనే చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి పంజాబ్ మాజీ సీఎం బాదల్ తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు, ఎస్ఏడీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ వెల్లడించారు. బుధవారం బాదల్ భౌతికకాయాన్ని స్వగ్రామానికి తరలించనున్నారు. ఇంకా చదవండి
సునీత భర్త ఫోన్ చేస్తేనే వెళ్లా, సునీతక్క మాట మార్చింది - ఎంపీ అవినాష్ రెడ్డి
కడప జిల్లా పులివెందుల క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఎంపీ అవినాష్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఎంపీ స్థాయి వ్యక్తికే నిజాయితీ నిరూపించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తోందన్నారు. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సునీతమ్మ స్టేట్మెంట్ లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపించారు. మొదట సునీతమ్మ ఇచ్చిన స్టేట్మెంట్ లో మా ప్రస్తావనే లేదన్నారు. మొదట లెటర్ దాచిన విషయంలో కూడా మా కుటుంబానికి సంబంధం లేదు అన్నారు. సీబీఐ దర్యాప్తు కుట్ర కోణంలో ఉందన్నారు. తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇంకా చదవండి
జగన్ కు ఓటేస్తే కట్టుబట్టలు కూడా మిగలవు - చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు.. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. పెదకూరపాడు బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు... వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్టంలో జగన్ విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అభివృద్ధిని కొనసాగిస్తే... ఏపీలో వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేస్తుందని ఆరోపించారు. అమరావతి పేరు వింటేనే ఒళ్లు పులకరిస్తుందన్నారు. జగన్ బ్యాచ్ ఎవ్వరిని వదలనని చంద్రబాబు హెచ్చరించారు. అన్ని రాష్ట్రాలలో కన్నా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయన్నారు. వైసీపీ పాలనలో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. యర్రగొండపాలెంలో ఓ మంత్రి నాపై రాళ్లదాడి చేయించారని ఆరోపించారు. ఎస్సీలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి జస్టిన్ పున్నయ్య కమిషన్ నియమించామన్నారు. ఎస్సీ వర్గాలు సమానంగా అభివృద్ధి చెందాలని వర్గీకరణ తెచ్చామన్నారు. గూగుల్ లో 693 కొడితే జగన్ వ్యవహారం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. డ్వాక్రా సంఘాలు నా మానస పుత్రిక అన్న చంద్రబాబు... మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చానన్నారు. ఇంకా చదవండి
Manufacturing: తయారీ రంగంలో భారత్ భళా, డ్రాగన్ కంట్రీ డీలా
TTD News: శ్రీనివాసుడి సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?
UPSC Civils Exam: వెబ్సైట్లో యూపీఎస్సీ సివిల్స్-2023 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం!
Rains in Telangana: మరో మూడ్రోజులు తెలంగాణలో ఎండావాన - ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
కాంగ్రెస్లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?
Samantha Chappal Cost : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!
Empty Stomach: ఖాళీ పొట్టతో ఈ ఆహారాలను తినకూడదు, అయినా చాలామంది తినేస్తున్నారు
NBK 108 Movie Title : బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ 'బ్రో' కాదు - బర్త్ డే గిఫ్ట్ రెడీ!