Breaking News: రెండేళ్ల కన్న కొడుకును గొంతు కోసి హత్య చేసిన తండ్రి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
ఎవరికి భయపడుతున్నారు?: అమిత్ షా
తెలంగాణ విమోచన దినం ఎందుకు జరపరు. అటు మహారాష్ట్ర అధికారికంగా జరుపుకుంటోంది. కర్ణాటక కూడా జరుపుతోంది. కానీ తెలంగాణలో మాత్రం విమోచన దినం జరపడం లేదు. మీరు ఎవరికి భయపడుతున్నారు చెప్పండి? ముఖ్యమంత్రి గారూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన ఆదివాసీలు మీకు గుర్తు లేరా? వారి త్యాగం ఒట్టిగా పోదు. మేం 2024లో అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినం జరిపి తీరుతాం’’ అని అమిత్ షా ప్రసంగిస్తున్నారు.
బీజేపీ ప్రభుత్వం వచ్చాక అధికారికంగా విమోచన దినం: అమిత్ షా
‘‘తెలంగాణ ప్రజలందరికీ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ ప్రధాని మోదీ పుట్టిన రోజు కూడా. మన నినాదం నిర్మల్ నుంచి హైదరాబాద్ వరకూ వినిపించాలి. ఆపరేషన్ పోలో కూడా ఇవాళే సమాప్తమైంది. 13 నెలల తర్వాత ఆలస్యంగా తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చింది. 2021 తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ వెంటనే అధికారికంగా హైదరాబాద్ సంస్థానం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతాం. మజ్లిస్ పార్టీకి బీజేపీ పార్టీ భయపడదు. ఈరోజు సర్దార్ పటేల్ పరాక్రమం కారణంగా విమోచనం జరిగింది.’’ అని అమిత్ షా ప్రసంగించారు.
ఈటల రాజేందర్పై ప్రత్యేక మక్కువ చూపిన అమిత్ షా
నిర్మల్ బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగం మొదలైంది. తొలుత రాష్ట్ర బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ సహా అందరి పేర్లను ప్రస్తావించిన అమిత్ షా.. ఈటల రాజేందర్ విషయంలో కాస్త ప్రత్యేకత చూపారు. ఆయన పేరు పలికే క్రమంలో ‘‘ఇలా రండి.. రాజేందర్ జీ.. రండి.. రండి.. మేరా భాయ్’’ అని అన్నారు.
నా వయసు మోదీ, అమిత్ షాకు ట్రాన్స్ఫర్ చేయాలని అమ్మవారికి మొక్కుకున్నా: బండి సంజయ్
‘‘మోదీ, అమిత్ షా లేని భారత దేశాన్ని ఎవరూ ఊహించలేరు. వారు నిర్మల్కు రావడం చాలా సంతోషం. నాకు ఒక్కసారి అమిత్ షాను ముట్టుకోవాలని అనిపిస్తుంది. ఆయన ధైర్యం నాకు రావాలని అనిపిస్తుంది. నాకు 55 సంవత్సరాలు. ఒకవేళ వయసు ట్రాన్స్ఫర్ చేసే ఛాన్స్ ఉంటే నా వయసును కూడా మోదీ, అమిత్ షాకే ఇవ్వాలని నేను అమ్మవారికి మొక్కుకున్నా’’ అని బండి సంజయ్ ప్రసంగించారు.
కేసీఆర్ అవినీతి చరిత్ర పాఠ్యాంశాల్లో చేరుస్తాం
‘‘సర్దార్ పటేల్ లేకుండా హైదరాబాద్ పాకిస్థాన్లో కలిసేది. ఆయనే లేకుంటే తెలంగాణ ఏర్పడేదే కాదు. కేసీఆర్కు ముఖ్యమంత్రి పదవే వచ్చేది కాదు. నా సర్దార్ పటేల్ చరిత్రను నువ్వు మరుగున పడేలా చేస్తాడా? వీరుల చరిత్రను తెరమరుగు చేయడమే సీఎం లక్ష్యం. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం. నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తాం. ముఖ్యమంత్రి నీచమైన చరిత్రను కూడా పాఠ్యాంశాల్లో చేరుస్తాం. ఇలాంటివాళ్లు ఉంటే తీవ్రమైన నష్టం. రాబోయేది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం. అమిత్ షా నాయకత్వంలో తెలంగాణలో కాషాయ జెండాను ఎగరవేసే బాధ్యత మాది.’’ అని బండి సంజయ్ ప్రసంగించారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చండి
తెలంగాణ విమోచన దినం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఎగరేయకపోవడం ఏంటి? ఫాం హౌస్లో పడుకుంటారా? ఇదే అసెంబ్లీలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ను కేసీఆర్ అవమానించాడు. తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవాన్ని సీఎం ఎందుకు జరిపించడం లేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లారా? మీ ఒంట్లో నెత్తురు ప్రవహిస్తే ముందుకొచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చండి. కర్ణాటక, మహారాష్ట్రలో విమోచన దినాన్ని చక్కగా జరుపుకుంటారు. కానీ, కేసీఆర్ తెలంగాణను మూడు ముక్కలు చేసి ఒవైసీకి, కొడుకుకు, అల్లుడికి ఇచ్చాడు’’ అని బండి సంజయ్ ఆవేశంతో మాట్లాడారు.
నిర్మల్లో అమిత్ షా
నిర్మల్లో జరుగుతున్న బీజేపీ బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నేతలు ప్రసంగిస్తున్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించకపోవడాన్ని తప్పుబట్టారు.
పాఠశాల పైకప్పు పెచ్చులూడి విద్యార్థికి గాయాలు
నాడు- నేడు కింద బడులను అభివృద్ధి చేసి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని జెడ్పీ సెంట్రల్ హైస్కూల్ స్కూల్ పైకప్పు పెచ్చులుడి 10వ తరగతి చదువుతున్న జి. సాయి జశ్వంత్ తల మీద పడింది. దీంతో విద్యార్థి తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడున్న ఉపాధ్యాయులు విద్యార్థిని హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలుగు రాష్ట్రాలకు కొత్త సీజేలు
తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు నూతన సీజేలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు పంపింది. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను నియమించాలని సూచించింది. తెలంగాణ హైకోర్టు సీజేగా పనిచేసిన జస్టిస్ హిమా కోహ్లీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు. ఆమె స్థానంలో తాత్కాలిక సీజేగా జస్టిస్ ఎం.ఎస్ రామచంద్రరావు బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక సీజే ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి సీజేగా జస్టిస్ సతీశ్చంద్ర శర్మను నియమించేందుకు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఏకే గోస్వామిని ఛత్తీస్గఢ్ హైకోర్టుకు బదిలీ చేసి ఆయన స్థానంలో ఛత్తీస్గఢ్ సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను ఏపీకి నియమించాలని కొలీజియం సూచించింది.
చంద్రబాబుపై హత్యాయత్నం చేశారు : పట్టాభి
టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడిపై టీడీపీ నేతల తీవ్రంగా స్పందించారు. టీడీపీ నేత పట్టాభి మాట్లాడుతూ చంద్రబాబుపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై కేసు పెడతామని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పెట్టిన పోస్టుపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దాడి జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. టీడీపీ నేతల ధర్నాలు చేస్తుంటే ముందస్తు అరెస్టులు చేసే పోలీసులు... దాడి జరుగుతుంటే ఎందుకు రాలేదని పట్టాభి ప్రశ్నించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets