అన్వేషించండి

Afghanistan Crisis: ఉత్కంఠగా అఫ్గానిస్తాన్ నుంచి అధికారుల తరలింపు... ఐటీబీపీ సాహసం... కమాండోలలో తెలుగు వ్యక్తి రాజశేఖర్

అఫ్గానిస్థాన్ నుంచి భారతీయ అధికారుల తరలింపునకు అడుగడుగునా అడ్డంకులే. ఈ అడ్డంకులన్నింటినీ ఎదుర్కొని దౌత్య అధికారులను దేశానికి తరలించిన ఐటీబీపీ కమాండోలలో మన తెలుగు వాడు రాజశేఖర్ కూడా ఒకరు.

అఫ్గానిస్థాన్ లో తాలిబన్ల తుపాకీ రాజ్యమేలుతోంది. ఎక్కడికక్కడ ఆంక్షలు.. మహిళల పరిస్థితి మరింత దయనీయం. దేశం విడిచి వెళ్లే దారిలేక.. తాలిబన్ల పాలనలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఎక్కడ చూసిన తుపాకులతో తాలిబన్లు గుంపులు గుంపుగా కనిపిస్తున్నారు. అంతటి ఉద్రిక్త పరిస్థితుల నుంచి భారతీయులను దేశానికి తీసుకురావడం సామాన్య విషయం కాదు. ప్రాణాలతో బయటపడతామో లేదో తెలియని పరిస్థితుల్లో తీవ్ర ఆందోళనలో ఉన్న భారతీయుల్లో మనో ధైర్యం నింపి వారిని దేశానికి తీసుకొచ్చారు ఐటీబీపీ కమాండోల బృందం. ఈ బృందంలో ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన రాజశేఖర్ కూడా ఉన్నారు.

రెండు బృందాలుగా తరలింపు

గత రెండేళ్లుగా అఫ్గానిస్థాన్ లోని భారత రాయబార కార్యాలయంలో ఐటీబీపీ కమాండర్ గా రాజశేఖర్ విధులు నిర్వహిస్తున్నారు.  కాబుల్‌లోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న వారిని దేశానికి తరలించేదుకు చేపట్టిన ఆపరేషన్‌ లో రాజశేఖర్‌ పాల్గొన్నారు. తాలిబన్లు అఫ్గానిస్థాన్‌లోని ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమిస్తూ కాబుల్‌లోకి ప్రవేశించారు. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ దేశం పారిపోవడంతో  భద్రతా దళాలు చేతులెత్తేశాయి. దీంతో ఆగస్టు 14కి తాలిబన్లు కాబుల్‌ని హస్తగతం చేసుకున్నారు. ఈ సమాచారంతో భారత రాయబార కార్యాలయ సిబ్బందిని తరలించాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం సిబ్బందిని రెండు బృందాలుగా విభజించి తరలించాలని నిర్ణయించారు. మొదటి బృందంలో విదేశాంగశాఖ అధికారులు 20 మంది, రక్షణగా 25 మంది భద్రతా సిబ్బందిని తరలించాలని నిర్ణయించారు. 

Viral Video: కటౌట్‌ చూసి అన్నీ నమ్మేయొద్దు డ్యూడ్... ఈ బామ్మ ఇంగ్లీష్ వింటే మీరు కూడా నిజమే అంటారు

రెండు సార్లు అడ్డగింత

15న రాత్రి 8.30 గంటలకు 45 మంది బృందంతో భారత రాయబార కార్యాలయం నుంచి బయలుదేరి టర్కీస్‌ ఎయిర్‌బేస్‌ చేరుకున్నామని ఐటీబీపీ సీనియర్ కమాండర్ రాజశేఖర్ తెలిపారు. రోడ్డు పొడవునా జనాలున్నారన్నారు. వారిలో తాలిబన్లు  వారిలో తాలిబన్లు ఉన్నారేమో చూసుకుంటూ ముందుకెళ్లామని తెలిపారు. మొదటి బృందాన్ని 16వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు భారత్ కు తరలించారు. రెండో బృందంలో తరలింపు సమయానికి కాబుల్ తాలిబన్ల వశమైపోయింది. రాత్రి కర్ఫ్యూ ఉందని, వెళ్లడానికి వీల్లేదని తాలిబన్లు అడ్డుకున్నారని రాజశేఖర్ తెలిపారు. రాత్రి 11 గంటల సమయంలో మరో మార్గంలో టర్కీస్ ఎయిర్‌బేస్‌ వద్దకు బయలుదేరితే దారి మధ్యలో తాలిబన్లు అడ్డగించడంతో రెండోసారీ వెనుదిరిగామని ఆయన తెలిపారు. 

Also Read: Afghanistan Crisis: మహిళా న్యూస్ యాంకర్లపై తాలిబన్ల నిషేధం

తాలిబన్ల భద్రత మధ్యే...

పరిస్థితి తీవ్రత పెరుగుతుండటంతో 16వ తేదీ ఉదయం భారత రాయబార కార్యాలయం అధికారులు తాలిబన్లతో చర్చించారు. సంప్రదింపుల తర్వాత అధికారుల తరలింపునకు అనుమతిచ్చారు. తాలిబన్లు ఎస్కార్ట్‌గా వచ్చి 17వ తేదీ వేకువజామున టర్కీస్‌ ఎయిర్‌బేస్‌కు చేర్చారు. ఉదయం 7 గంటలకు బయల్దేరి జామ్‌నగర్‌ మీదుగా సాయంత్రానికి ఢిల్లీ చేరుకున్నామని రాజశేఖర్ తెలిపారు.

Also Read: Afghanistan Taliban Crisis: ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్ల కసరత్తు.. మాజీ అధ్యక్షుడితో భేటీ

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget