అన్వేషించండి

Supreme Court: పొట్టను చీరతో కట్టుకుని ఆకలి చంపుకుంటారు, వలస కార్మికుల దుస్థితిపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

Supreme Court: దేశంలో అభివృద్ధి జరుగుతున్నా, ఆకలి చావులు ఆగటం లేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. వలస కార్మికులకు రేషన్ అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

రేషన్ కార్డుల వివరాలు నమోదు చేయండి: సుప్రీం కోర్టు 

దేశం ఇంత అభివృద్ధి చెందుతున్నా, ఇంకా కొంత మంది ఆకలితో మాడిపోతున్నారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. వలస కార్మికులకు రేషన్ అందించే విషయమై విచారణ జరిపిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాల తీరుని ఈ సందర్భంగా ప్రస్తావించింది. వలస కార్మికులకు సరైన విధంగా రేషన్ అందించేందుకు అవసరమైన "మోడల్‌"ను సిద్ధం చేయాలని ఆదేశించింది. జస్టిస్ ఎమ్‌ ఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ జరిపింది. ప్రతి రాష్ట్రంలోని ఆహార, పౌర సరఫరాల విభాగాలు ఎంత మందికి రేషన్ కార్డులు ఇస్తున్నామన్న వివరాలు కచ్చితంగా నమోదు చేయాలని స్పష్టం చేసింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏదో ఓ పద్ధతిని అనుసరించి ఈ ప్రక్రియ చేపట్టాలని తేల్చి చెప్పింది. ఈ మొత్తానికి తప్పనిసరిగా ఓ క్రైటేరియాను ఫాలో అవ్వాలని వ్యాఖ్యానించింది. 

ఆకలి చావులు ఉండకూడదు..

"దేశంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో ప్రాణాలు కోల్పోకుండా చేయటమే అంతిమ లక్ష్యం. కానీ...దురదృష్టవశాత్తూ భారత్‌లో ఇది జరుగుతోంది. అభివృద్ధి జరుగుతున్నప్పటికీ ఆకలి చావులు ఆగటం లేదు. కొన్ని గ్రామాల్లో ప్రజలు తమ కడుపుని గట్టిగా కట్టేసుకుంటున్నారు. అలా చేస్తే ఆకలి వేయదని చీరతోనే, తాడుతోనే కట్టేసుకుంటారు. నీళ్లు తాగి పడుకుంటారు. ఆహారం వారికి అందుబాటులో ఉండకపోవటం వల్ల ఇలా చేస్తున్నారు" అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. రెండు వారాల్లో హియరింగ్ పూర్తి చేసి ఇందుకు సంబంధించిన అధికారిక ఆదేశాలు జారీ చేస్తామని చెప్పింది. ఓ  ముగ్గురు సామాజిక కార్యకర్తలు వేసిన పిటిషన్‌పై ఈ విచారణ జరిపింది సుప్రీం కోర్టు. కొవిడ్‌ కారణంగా ఆహార భద్రత కోల్పోయిన వారికి అండగా నిలిచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

చెప్పుల్లేకుండా రోడ్లపై నడిచిన వలస కార్మికులు 

కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో వలస కార్మికులు రోడ్లపై చెప్పులు కూడా లేకుండా సొంతూళ్లకు వెళ్లిపోయిన దృశ్యాలు ఎప్పటికీ మరిచి పోలేం. మార్గ మధ్యలో వాళ్ల పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి వాళ్లకు ఆహార పొట్లాలు అందించాయి. కొన్ని చోట్ల కొవిడ్ టెస్ట్‌లు చేశారు. ఇలా నెలల పాటు వీరి పాదయాత్ర కొనసాగింది. ఇప్పటికీ నగరాలకు వచ్చి పని చేసుకోవాలంటే వాళ్లు భయ పడుతున్నారు. ఆ సమయంలో ఓ పూట తిండికి కూడా ఇబ్బందులు పడ్డారు. కేంద్ర ప్రభుత్వం రేషన్ అందించినా ఇది పూర్తి స్థాయిలో అందరికీ చేరువ కాలేదు. ఇప్పటికీ ఎంత మంది వలస కార్మికులు ఉన్నారన్న లెక్క తేల్చటంతోనే కాలం గడిచిపోతోంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget