అన్వేషించండి

Srisailam Maha Shivaratri 2026: శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. 4 రోజులపాటు టోల్ ఛార్జీలు రద్దు

Maha Shivaratri 2026: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. నాలుగు రోజులపాటు టోల్ ఛార్జీలు రద్దు చేయడంతో పాటు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతోంది.

శ్రీశైలం, నంద్యాల: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ ప్రభుత్వం భక్తులకు శుభవార్త చెప్పింది. నేటి (ఈ నెల 13) నుంచి 16 వరకు శ్రీశైలం దేవస్థానం, అటవీశాఖ టోల్‌గేట్ల వద్ద వాహనాలకు ఛార్జీల మినహాయింపు ఇస్తున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రకటించారు.

శ్రీశైలంలోని దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఎస్పీ సునీల్ షొరాణ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ నాలుగు రోజుల పాటు (ఈ 13 నుంచి 16 వరకు) రాత్రివేళల్లోనూ రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత స్థాయి సదుపాయాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 2,59,050 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, మహాశివరాత్రి రోజున సుమారు 1.50 లక్షల మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలా అదనపు చలువ పందిళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని నంద్యాల కలెక్టర్ రాజకుమారి తెలిపారు.

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..

ప్రయాణ సౌకర్యాల విషయంలో ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేసింది. నంద్యాల- శ్రీశైలం మార్గంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక బస్సు నడుస్తోందని, ఏపీఎస్‌ఆర్టీసీ నుంచి 1,800, తెలంగాణ నుంచి 1,000, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులతో కలిపి మొత్తం 3 వేల బస్సులను అందుబాటులో ఉంచినట్లు నంద్యాల కలెక్టర్ వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న భద్రతా ఏర్పాట్లు, నిబంధనలకు భక్తులు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆమె కోరారు.

కనీస సౌకర్యాలు లేవని భక్తుల ఆవేదన

మరోవైపు అటవీ, దేవాదాయ శాఖల మధ్య ఉన్న సమన్వయ లోపం పాదయాత్ర చేసే భక్తులకు ఇబ్బందులు కలిగిస్తోందని విమర్శలు వస్తున్నాయి. శ్రీశైలానికి నడక దారిలో వచ్చే భక్తులు నల్లమల అడవిలో దాదాపు 46 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే ఈ మార్గంలో భక్తులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడానికి అటవీశాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం అటవీశాఖే ఈ ఏర్పాట్లు చేయాల్సి ఉన్నప్పటికీ వారు చేయడం లేదని, జిల్లా అధికారులు ముందుకొచ్చినా అనుమతులు నిరాకరిస్తున్నారని ఆరోపణలున్నాయి. గతంలో ఏర్పాట్ల కోసం దేవాదాయ శాఖ ఏటా రూ.5 లక్షలు ఇస్తుండగా, ప్రస్తుతం అటవీశాఖ అధికారులు రూ.60 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల మధ్య నెలకొన్న ఈ వివాదం మహాశివరాత్రి, శ్రీశైలం బ్రహ్మోత్సవం భక్తులకు అసౌకర్యాన్ని కలిగిస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Stock Market Crash: దలాల్‌ స్ట్రీట్‌లో బ్లడ్‌ మండే: సెన్సెక్స్ 1100, నిఫ్టీ 330 పాయింట్లు పతనంతో స్టాక్ మార్కెట్ ఓపెన్
దలాల్‌ స్ట్రీట్‌లో బ్లడ్‌ మండే: సెన్సెక్స్ 1100, నిఫ్టీ 330 పాయింట్లు పతనంతో స్టాక్ మార్కెట్ ఓపెన్
Suzuki Burgman వేరియంట్లు, వాటి ఫీచర్లు, ఆన్‌-రోడ్‌ ధరలు - ఏ వేరియంట్‌ తీసుకోవాలి?
Suzuki Burgman స్టాండర్డ్‌, రైడ్‌కనెక్ట్‌, EX మధ్య తేడాలేంటి? దేని ధర ఎంత? ఫీచర్లపై పూర్తి గైడ్‌
2025లో సేల్స్‌లో అట్టడుగున ఉన్న కార్లు ఇవే - పేరు పెద్దది, అమ్మకాలు మాత్రం అతి తక్కువ!
ఈ కార్లకు ఏమైంది? జనం వీటిని కొనడమే మానేశారు, అలాగని ఇవి పిచ్చివేమీ కాదు!
Flights Cancel: యుఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్‌కు వెళ్లే అన్ని విమానాలు రద్దు చేస్తున్న ఎయిర్ లైన్స్
యుఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్‌కు వెళ్లే అన్ని విమానాలు రద్దు చేస్తున్న ఎయిర్ లైన్స్
Advertisement

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
T20 World Cup 2026: సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లు ఇవే.. భారత్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లాండ్‌
సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లు ఇవే.. భారత్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లాండ్‌
Telugu TV Movies Today: ఈ సోమవారం (మార్చి 02) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
ఈ సోమవారం (మార్చి 02) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
Embed widget