అన్వేషించండి

Nigeria Blasts: నైజీరియాలో వరుస ఆత్మాహుతి దాడులు, 18 మంది మృతి - పలువురికి తీవ్ర గాయాలు

Blasts in Nigeria: నైజీరియాలో వరుస ఆత్మాహుతి దాడులు అలజడి సృష్టించాయి. ఈ దాడుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోగా 48 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది.

Suicide Bombings in Nigeria: నైజీరియాలో ఆత్మాహుతి దాడి అలజడి సృష్టించింది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా 48 మంది తీవ్రంగా గాయపడ్డారు. బోర్నో స్టేట్‌లో ఈ దాడి జరిగిందని CNN వెల్లడించింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో తొలి పేలుడు సంభవించింది. ఓ పెళ్లి వేడుకలో ఈ దాడి జరిగింది. ఆ తరవాత ఓ హాస్పిటల్‌లో ఆ వెంటనే మరో ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయి. ఇలా వరుసగా మూడు చోట్ల దాడులు జరగడం వల్ల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ దాడుల్లో మహిళలతో పాటు చిన్నారులూ పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు. బార్నో State Emergency Management డైరెక్టర్ జనరల్ బర్కిండో మహమ్మద్ సైదు వెంటనే అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్వోజా నగరంలోనే వరుసగా మూడు చోట్ల ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఇప్పటి వరకూ ఓ ఉగ్రసంస్థ కూడా తామే ఈ దాడి చేసినట్టు ప్రకటించలేదు. అయితే...ఓ సెక్యూరిటీ పోస్ట్‌పైనా దాడి జరిగినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కూడా దీనిపై ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

బోకో హరామ్ ఉగ్రవాదుల అరాచకాలు..

నిజానికి బోర్నో ప్రాంతం చాలా రోజులుగా వివాదాలకు (Bombings in Borno) కేంద్ర బిందువుగా మారిపోయింది. Boko Haram మిలిటెంట్‌లు ఇక్కడ ఒక్కసారిగా తిరుగుబాటు చేశారు. ఇస్లామిక్‌ స్టేట్‌తో కలిసి ఇక్కడ అలజడి సృష్టిస్తోంది. ఈ కారణంగానే ఇప్పటి వరకూ బోర్నో నుంచి 20 లక్షల మంది వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు. ఈ ఉగ్రవాదులు దాదాపు 40 వేల మందిని దారుణంగా హత్య చేశారు. 2014లో తొలిసారి ఈ గ్రూప్‌ గురించి ప్రపంచానికి తెలిసింది. ఒకేసారి 270 మందికిపైగా అమ్మాయిలను కిడ్నాప్ చేసింది. అప్పటి నుంచి వరుస పెట్టి కిడ్నాప్‌లు, హత్యలతో భయాందోళనలకు గురి చేస్తున్నారు బోహో హరమ్ ఉగ్రవాదులు. ప్రస్తుతానికి 18 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తున్నప్పటికీ...కనీసం 30 మంది మృతి చెందినట్టు స్థానిక మీడియా చెబుతోంది. బాంబు దాడులు జరిగిన వెంటనే నైజీరియా మిలిటరీ కర్ఫ్యూ విధించింది. గ్వోజా నగరాన్ని బోకో హరమ్ ఉగ్రవాదులు చాలా రోజులుగా టార్గెట్ చేస్తున్నారు. 2014లో పూర్తిగా ఈ సిటీని తమ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు. ఆ తరవాత 2015లో నైజీరియా సేనలు పోరాటం చేసి తిరిగి ఆ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయినా ఇప్పటికి వాళ్ల ఆగడాలు ఆగడం లేదు. 

Also Read: Joe Biden: సాయంత్రం 4 దాటితే అంతా అయోమయమే, బైడెన్ ప్రవర్తనపై సంచలన రిపోర్ట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ
TGPSC Group1 Recruitment: తగ్గేదేలే అంటున్న టీజీపీఎస్సీ, 1:50 నిష్పత్తిలోనే 'గ్రూప్‌-1' మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక
తగ్గేదేలే అంటున్న టీజీపీఎస్సీ, 1:50 నిష్పత్తిలోనే 'గ్రూప్‌-1' మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక
Andhra Pradesh: కలకలం రేపుతున్న దస్త్రాలు దహనం ఘటన- కీలకంగా మారుతున్న డ్రైవర్‌ వాంగ్మూలం
కలకలం రేపుతున్న దస్త్రాలు దహనం ఘటన- కీలకంగా మారుతున్న డ్రైవర్‌ వాంగ్మూలం
Etvwin Web Series: ఈటీవీ విన్ ఓటీటీ కోసం... చంద్రశేఖర్ యేలేటి వెబ్ సిరీస్!
ఈటీవీ విన్ ఓటీటీ కోసం... చంద్రశేఖర్ యేలేటి వెబ్ సిరీస్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ
TGPSC Group1 Recruitment: తగ్గేదేలే అంటున్న టీజీపీఎస్సీ, 1:50 నిష్పత్తిలోనే 'గ్రూప్‌-1' మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక
తగ్గేదేలే అంటున్న టీజీపీఎస్సీ, 1:50 నిష్పత్తిలోనే 'గ్రూప్‌-1' మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక
Andhra Pradesh: కలకలం రేపుతున్న దస్త్రాలు దహనం ఘటన- కీలకంగా మారుతున్న డ్రైవర్‌ వాంగ్మూలం
కలకలం రేపుతున్న దస్త్రాలు దహనం ఘటన- కీలకంగా మారుతున్న డ్రైవర్‌ వాంగ్మూలం
Etvwin Web Series: ఈటీవీ విన్ ఓటీటీ కోసం... చంద్రశేఖర్ యేలేటి వెబ్ సిరీస్!
ఈటీవీ విన్ ఓటీటీ కోసం... చంద్రశేఖర్ యేలేటి వెబ్ సిరీస్!
Bigg Boss 8 Telugu: తెలుగు బిగ్ బాస్ 8లో వేణు స్వామి - భారీ పారితోషికం డిమాండ్
తెలుగు బిగ్ బాస్ 8లో వేణు స్వామి - భారీ పారితోషికం డిమాండ్
Team India: 16 గంటల విమాన ప్రయాణంలో భారత క్రికెటర్లు ఏం చేశారంటే?
16 గంటల విమాన ప్రయాణంలో భారత క్రికెటర్లు ఏం చేశారంటే?
Anant Ambani: అనంత్ అంబానీ వాచ్ విలువ తెలిస్తే కళ్లు తేలేస్తారు, ప్రపంచం మొత్తం మీద 30 మాత్రమే ఉన్నాయట
అనంత్ అంబానీ వాచ్ విలువ తెలిస్తే కళ్లు తేలేస్తారు, ప్రపంచం మొత్తం మీద 30 మాత్రమే ఉన్నాయట
Bonalu in Hyderabad 2024: అమ్మకు బోనం.. ఆధ్యాత్మిక సంబురం మాత్రమే కాదు అంటు వ్యాధులు తరిమేసే ఆయుధం!
అమ్మకు బోనం.. ఆధ్యాత్మిక సంబురం మాత్రమే కాదు అంటు వ్యాధులు తరిమేసే ఆయుధం!
Embed widget