Republic Day 2022 Live Updates: పూంఛ్ లోని నియంత్రణ రేఖ వద్ద త్రివర్ణ పతాకం రెపరెపలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేడుకలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
మరికొద్దిసేపట్లో దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ పరేడ్కు అంతా పటిష్ఠంగా ఏర్పాట్లు చేశారు. రాజ్ పథ్లో కవాతుపై ఉగ్ర ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, విజయ్ చౌక్ నుండి ఎర్రకోట వరకు, కవాతు మొత్తం మార్గాన్ని కంటోన్మెంట్గా మార్చారు. 71 మంది డీసీపీలు, 213 మంది ఏసీపీలు, 753 మంది ఇన్స్పెక్టర్లు ఆఫ్ ఢిల్లీ పోలీస్లకు పరేడ్ భద్రతను అప్పగించారు. పరేడ్ భద్రత కోసం 27 వేల 723 మంది జవాన్లు, కమాండోలు, ఢిల్లీ పోలీసుల షార్ప్ షూటర్లను మోహరించారు.
Also Read: కన్నార్పకుండా చూసేలా గణతంత్ర వేడుకలు.. ఈ సారి ఎన్నెన్ని విశేషాలో తెలుసా..?
ఈ జవాన్లకు సహాయం చేయడానికి, 65 కంపెనీ పర్మిట్రీ ఫోర్స్ను కూడా మోహరించారు. ఉగ్రవాదులు, దుండగులను అదుపు చేసేందుకు 200 విధ్వంస నిరోధక బృందాలను మోహరించారు. ఎలాంటి ముప్పు కలగకుండా భద్రత కోసం ఎన్ఎస్జి ప్రత్యేక బృందాలను కూడా పరేడ్ వేదిక చుట్టూ మోహరించారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెచ్చరికతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. భూమి నుంచి ఆకాశం వరకు పర్యవేక్షణ జరుగుతోంది.
దాదాపు 2,700 మంది బలగాలను మోహరించారు. పోలీసులు ఉగ్రవాదుల పోస్టర్లను అతికించారు. యాంటీడ్రోన్ వ్యవస్థలు కూడా అమర్చారు. ఉగ్రవాదుల ముప్పు దృష్ట్యా ఢిల్లీని ఆనుకుని ఉన్న పొరుగు రాష్ట్రాల ఏజెన్సీలను కూడా అప్రమత్తం చేశారు. ఢిల్లీ పోలీసులు కూడా నిఘా సంస్థలతో నిరంతరం టచ్లో ఉన్నారు. అంతే కాదు హోటళ్లు, లాంజ్లు, ధర్మశాలల్లో నివసించే వారి వెరిఫికేషన్ కూడా జరిగింది.
దీనితో పాటు, ఢిల్లీలో కొత్తగా అద్దెకు దిగిన వారిపై కూడా పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. ఢిల్లీలోని ఘాజీపూర్ మండిలో పేలుడు పదార్థాలు లభ్యం కావడంతో భద్రతా సంస్థలు భద్రత విషయంలో గతంలో కంటే మరింత అప్రమత్తమయ్యాయి.
Also Read: Gold-Silver Price: రిపబ్లిక్ డే నాడు ఎగబాకిన బంగారం.. వెండి నేల చూపులు, నేటి ధరలు ఇవే..
Also Read: Garikapati: ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుకు పద్మశ్రీ
Also Read: Darshanam Mogilaiah: ఒక్క పాటతో విపరీత క్రేజ్ తెచ్చుకున్న వ్యక్తికి పద్మశ్రీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
పూంఛ్ లోని నియంత్రణ రేఖ వద్ద త్రివర్ణ పతాకం రెపరెపలు
భారత ఆర్మీ జవాన్లు పూంఛ్ లోని నియంత్రణ రేఖ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి రిపబ్లిక్ వేడుకల్లో భాగస్వాములు అయ్యారు.
J&K: Indian Army jawans, deployed at LoC in Poonch, unfurled the national flag on #RepublicDay pic.twitter.com/UY8UHL8phF
— ANI (@ANI) January 26, 2022
ఘనంగా రాష్ట్రపతి బాడీ గార్డ్ గుర్రం విరాట్ రిటైర్మెంట్ ఈవెంట్
రాష్ట్రపతి రామ్నాథ్ కోవిండ్ బాడీ గార్డ్ గుర్రం విరాట్ నేడు రిటైర్ అయింది. ఈ ఏడాది విరాట్కు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ మెడల్ దక్కింది. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రధాని మోదీలు విరాట్ రిటైర్మెంట్ కార్యక్రమానికి హాజరయ్యారు.





















