అన్వేషించండి

Tamil Nadu Assembly elections: తమిళనాడు ఎన్నికల్లో రికార్డు స్థాయి ఓటింగ్ ఖాయం - ఎవరికి ప్లస్ అవుతుంది?

Tamil Nadu elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళి ఈ సారి గత రికార్డులు తిరగరాసేలా భారీ ఓటింగ్ నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా 80 శాతం ఓట్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

Massive polling in Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళి ఈ సారి గత రికార్డులు తిరగరాసేలా భారీ ఓటింగ్ నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడం, ముఖ్యంగా యువత ,  మహిళా ఓటర్లలో కనిపిస్తున్న ఉత్సాహం దీనికి ప్రధాన కారణం. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

గత ఎన్నికల పోలింగ్ రికార్డులు 

తమిళనాడు ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు  72.81 శాతం  పోలింగ్ నమోదైంది. అంతకుముందు 2016లో 74.26 శాతం , 2011లో అత్యధికంగా 78.12 శాతం  ఓటింగ్ జరిగింది. గత కొన్ని దశాబ్దాలుగా తమిళనాడులో సగటున 70 శాతానికి పైగా ఓటింగ్ నమోదవుతూ వస్తోంది. అయితే, ఈసారి ఆ పాత రికార్డులన్నింటినీ దాటి పోలింగ్ శాతం 80 శాతానికి చేరువయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

పోలింగ్ పెరగడానికి ప్రధాన కారణాలు

ఈసారి పోలింగ్ భారీగా పెరగడానికి రాజకీయ ముఖచిత్రంలో వచ్చిన మార్పులే ముఖ్య కారణం. ద్రవిడ దిగ్గజాలు లేని రెండో అసెంబ్లీ ఎన్నికలు కావడంతో పాటు, నటుడు విజయ్ నేతృత్వంలోని  తమిళగ వెట్రి కళగం రాకతో త్రిముఖ,  చతుర్ముఖ పోటీ నెలకొంది. ఇది యువ ఓటర్లను భారీగా ఆకర్షించింది. ముఖ్యంగా మొదటిసారి ఓటు వేస్తున్న యువత ఈసారి నిర్ణయాత్మక శక్తిగా మారడం పోలింగ్ శాతాన్ని పెంచేలా ఉంది.

 ఓటర్ల జాబితా ప్రక్షాళన - కీలక మలుపు 

ఈ భారీ పోలింగ్ అంచనాల్లో అత్యంత కీలకమైన అంశం ఓటర్ల జాబితా ప్రక్షాళన . ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక తనిఖీల ద్వారా దాదాపు  97 లక్షల అనవసర ఓట్లను  జాబితా నుండి తొలగించారు. ఇందులో మరణించిన వారు, వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు , డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. ఓటర్ల జాబితాలో డెడ్ వుడ్  తగ్గిపోవడం వల్ల, వాస్తవంగా ఓటు వేసే వారి సంఖ్య శాతం పరంగా పెరిగి కనిపిస్తుంది. ఇది ఎన్నికల ఫలితాలను మరింత స్పష్టంగా ఉంచడానికి దోహదపడుతుంది. 

 ప్రజా సమస్యలు ,  ప్రచార హోరు 

రాష్ట్రంలో అధికార పక్షం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు  ఒకవైపు, నిరుద్యోగం మరియు ధరల పెరుగుదల వంటి సమస్యలపై ప్రతిపక్షాల పోరాటం మరోవైపు ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రప్పిస్తున్నాయి.  గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఓటర్లు ఉదయం 7 గంటలకే భారీగా తరలివచ్చారు. వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నీడ కోసం పందిళ్లు, తాగునీరు,  అత్యవసర వైద్య సదుపాయాలు కల్పించడం వల్ల వృద్ధులు, మహిళలు అసౌకర్యం కలగకుండా ఓటు వేయగలుగుతున్నారు. దీనికి తోడు సెలబ్రిటీలు, సామాజిక మాధ్యమాల ద్వారా ఓటు హక్కు వినియోగంపై జరిగిన ప్రచారం కూడా సామాన్యుల్లో చైతన్యం నింపింది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Rawalakot Protest PoJK: పాకిస్తాన్‌కు పీఓకే షాక్.. భారత్‌లో కలుస్తామంటూ రావాలాకోట్‌లో వేలాది మంది నిరసనకారుల ర్యాలీ!
పాకిస్తాన్‌కు పీఓకే షాక్.. భారత్‌లో కలుస్తామంటూ రావాలాకోట్‌లో వేలాది మంది నిరసనకారుల ర్యాలీ!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Advertisement

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
Embed widget