అన్వేషించండి

NEET Issue: సభలో నీట్‌పై మాట్లాడుతుండగా రాహుల్ మైక్ కట్ - కాంగ్రెస్ సంచలన ఆరోపణలు

Rahul Gandhi: లోక్‌సభలో రాహుల్ గాంధీ నీట్ వివాదంపై ప్రసంగిస్తుండగా మైక్ ఆఫ్ చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణల్ని స్పీకర్ కొట్టి పారేశారు.

NEET Controversy 2024: పార్లమెంట్‌లో నీట్ వ్యవహారంపై పెద్ద ఎత్తున రగడ జరిగింది. తక్షణమే చర్చ జరగాలని విపక్షాలు పట్టుపట్టడం వల్ల గందరగోళం నెలకొంది. ఫలితంగా లోక్‌సభ సోమవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. నీట్ వివాదంపై తాను మాట్లాడుతుండగా మైక్ ఆఫ్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. మైక్రోఫోన్‌కి యాక్సెస్ ఇవ్వాలంటూ రాహుల్ గాంధీ స్పీకర్ ఓం బిర్లాని రిక్వెస్ట్ చేశారు. నీట్ వివాదంపై చర్చ జరగాల్సిందే అని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తరపున ఓ ప్రకటన ఇవ్వాలని అన్నారు. ఈ సమయంలోనే రాహుల్‌ మైక్రోఫోన్‌ పని చేయలేదు. దీనిపైనే కాంగ్రెస్ తీవ్రంగా మండి పడుతోంది. గతంలోనూ రాహుల్ గాంధీ అదానీ వ్యవహారంపై మాట్లాడినప్పుడు ఇలాగే జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇప్పుడు మరోసారి ఇదే రిపీట్ అయింది. అయితే...ఈ ఆరోపణల్ని స్పీకర్ ఓం బిర్లా కొట్టిపారేశారు. ఎంపీల మైక్‌లు ఆఫ్ చేయలేదని, అసలు ఆ కంట్రోల్ తన వద్ద ఉండదని తేల్చి చెప్పారు. రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం గురించి మాత్రమే చర్చ జరగాలని, మిగతా వ్యవహారాలు రికార్డు అవ్వవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మాత్రం మోదీ సర్కార్‌పై మండి పడుతోంది. 

"నీట్‌ వివాదంపై ప్రధాని మోదీ నోరు మెదపడం లేదు. రాహుల్ గాంధీ దేశ యువత తరపున సభలో ప్రస్తావించేందుకు ప్రయత్నించారు. అంత కీలకమైన విషయం మాట్లాడుతుంటే ఆయన గొంతుని అణిచివేయాలని చూస్తున్నారు. మైక్రోఫోన్ ఆఫ్ చేస్తున్నారు. ఇంత కన్నా దారుణం ఇంకేముంటుంది"

- కాంగ్రెస్ 

NEET-UG 2024 ఎగ్జామ్‌ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పేపర్ లీక్‌తో విద్యార్థులు పలు చోట్ల ఆందోళనలకు దిగారు. మళ్లీ ఎగ్జామ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలైతే ఏకంగా నీట్‌ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థుల విశ్వాసాన్ని కోల్పోయిందని తేల్చి చెబుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. నీట్‌ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా నీట్‌ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. అటు కేంద్ర ప్రభుత్వం ఓ ఉన్నత స్థాయి కమిటీ వేసి ఈ వ్యవహారంపై విచారణ జరుపుతోంది. నిందితులను వదిలి పెట్టే ప్రసక్తే లేదని ప్రకటించింది. 

Also Read: US Presidential Debate: ట్రంప్ ఆన్ ఫైర్, బైడెన్‌పై డైలాగ్ వార్ - అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్‌తో పెరిగిన ఉత్కంఠ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Narendra Modi Longest Serving Elected Prime Minister: చారిత్రాత్మక రికార్డుకు అడుగు దూరంలో మోదీ - జూన్ 9న నెహ్రూ రికార్డు బ్రేక్.. సుదీర్ఘకాలం ఎన్నికైన’ ప్రధానిగా సరికొత్త చరిత్ర!
చారిత్రాత్మక రికార్డుకు అడుగు దూరంలో మోదీ - జూన్ 9న నెహ్రూ రికార్డు బ్రేక్.. సుదీర్ఘకాలం ఎన్నికైన’ ప్రధానిగా సరికొత్త చరిత్ర!
Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ABP India at 2047 Conclave: పశ్చిమాసియా అనిశ్చితితో భారత్‌లో ఆర్థిక ముప్పు.. దిగుమతులపై నిషేధం సరికాదు: మాంటెక్ సింగ్ అహ్లూవాలియా
పశ్చిమాసియా అనిశ్చితితో భారత్‌లో ఆర్థిక ముప్పు.. దిగుమతులపై నిషేధం సరికాదు: మాంటెక్ సింగ్ అహ్లూవాలియా

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది పెద్ద రికార్డు - ఓవర్సీస్ To తెలుగు స్టేట్స్... ఇప్పటివరకూ...
పెద్ది పెద్ద రికార్డు - ఓవర్సీస్ To తెలుగు స్టేట్స్... ఇప్పటివరకూ...
Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
Foods for Healthy Joints : కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
Early Symptoms of Type 2 Diabetes : టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
Embed widget