అన్వేషించండి

Punganur Violence: పుంగనూరు హింసాత్మక ఘటనలో మరో 9 మంది అరెస్టు- 72కు చేరిన సంఖ్య

Punganur Violence: ఇటీవల పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి మరో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మొత్తం అరెస్టు అయిన వారి సంఖ్య 72కి చేరింది.

Punganur Violence: ఇటీవల పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి మరో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మొత్తం అనుమానితుల సంఖ్య 72కి చేరింది. పుంగనూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లాబాబు, ప్రధాన అనుమానితుడిగా పేర్కొన్న పోలీసులు ఆయన్ని ఇంకా అదుపులోకి తీసుకోలేదు.

పుంగనూరులో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు నిందితులు కుట్ర పన్నారని, చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులపై దాడలు చేసేందుకు రాళ్లు, కర్రలు, ఖాళీ బీరు బాటిళ్లతో వచ్చారని, ఈ ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరి హింసాత్మక దాడులకు దారితీశాయని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) శ్రీలక్ష్మి తెలిపారు. పోలీసు సిబ్బందిపై దాడి చేయడమే కాకుండా ఆందోళనకారులు రెండు పోలీసు వాహనాలను కూడా తగులబెట్టారని పేర్కొన్నారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా పుంగనూరులో జరిగిన ఘర్షణల్లో చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ లీడర్లపై కేసులు నమోదు అయ్యాయి. అమర్‌ నాథ్‌ రెడ్డి, నల్లారి కిషోర్‌ కుమార్ రెడ్డి, గంటా నరహరి, చిన్నబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నరహరి వాహనంలో తనిఖీలు చేసినట్టు గన్, 1.5 లక్షల రూపాయల డబ్బు, 3 మద్యం సీసాలు, పార్టీ కండువాలు గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. గొడవల్లో వీళ్ల ప్రమేయం ఉందని అనుమానంతో ఐపీసీ 120B, 307, 341, 352, 336, 506 రెడ్‌విత్ 34 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 72 మందిని అరెస్టు చేసినట్టు అడిషనల్ ఎస్పీ కె.లక్ష్మీ.పేర్కొన్నారు. 

200 మందికిపైగా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు: టీడీపీ

సాగునీటి విధ్వంసంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పుంగనూరు మీదుగా తిరుపతి వెళ్తున్న టైంలో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. దీనిపై కేసులు రిజిస్టర్ చేసిన పోలీసులు అదే రోజు 62 మంది టీడీపీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేశారు. రిమాండ్ కు తరలించారు. ముందుగా చెప్పిన ప్లాన్‌లో లేకున్నప్పటికీ చంద్రబాబు రోడ్ షో ను పుంగనూరు టౌన్ కు మళ్లించడానికి ముందుగా రొంపిచర్లలో 4వ తేదీన పుంగనూరు టీడీపీ ఇంఛార్జ్ చల్లా బాబు(చల్లా రామచంద్రారెడ్డి) సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌లో టీడీపీ కార్యకర్తలను ప్రేరేపించినట్టు పిఏ గోవర్ధన్ రెడ్డి చెప్పారని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పుంగనూరు టీడీపీ ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డిని ఏ1 గా పోలీసులపై దాడికి పాల్పడి రాళ్లు, బీరు బాటిళ్లు విసిరి గాయపరిచారని, ఒక పోలీసు వాహనం, మరొక టీయర్ గ్యాస్ వాహనానికి నిప్పు పెట్టిన వారిపై వివిధ సెక్షన్లతో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. త్వరలోనే పుంగనూరు టీడీపీ ఇంఛార్జ్ చల్లా బాబును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తాంమని. ఈ కేసులో మరికొంత మంది నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని అడిషనల్ ఎస్పీ కే.లక్ష్మీ స్పష్టం చేశారు..

టీడీపీ నేతలపైనే ఎస్పీ ఆరోపణలు 
పుంగనూరులో చంద్రబాబు ప్రాజెక్టుల యాత్ర సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి  కూడా చంద్రబాబుదే తప్పని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రెచ్చగొట్టడం వల్లే దాడులు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారించామని ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లాలో ములకలచెరువు గ్రామంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబునాయుడు తంబళ్లపల్లె ఎమ్మెల్యేను రావణ అని సంబోధించారని తెలిపారు. దీంతో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు నిరసన తెలిపేందుకు నిర్ణయించుకున్నారన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Hero Vida VX2 Plus KKR Edition: కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
Center statement on fuel issue: కావాల్సినంత ఇంధనం ఉంది..కొరత రానే రాదు - పెట్రోల్ రష్‌పై కేంద్రం కీలక ప్రకటన
కావాల్సినంత ఇంధనం ఉంది..కొరత రానే రాదు - పెట్రోల్ రష్‌పై కేంద్రం కీలక ప్రకటన
Best Affordable Bikes: 4 వేల కంటే తక్కువ EMI తో బైక్ కొనేయండి.. బడ్జెట్ ధరలో టూవీలర్స్ ఇవీ
4 వేల కంటే తక్కువ EMI తో బైక్ కొనేయండి.. బడ్జెట్ ధరలో టూవీలర్స్ ఇవీ

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Steel Plant Credit Game: మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Hero Vida VX2 Plus KKR Edition: కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
Hyundai India : హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
Embed widget