అన్వేషించండి

Elections 2024: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్‌ జోస్యం- నితీశ్‌ అవుటని కామెంట్

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌స్విప్‌ చేసే అవకాశం ఉందని ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు.

ముచ్చటగా మూడోసారి దిల్లీపీఠం కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్న బీజేపీకి అన్ని అంశాలు సానుకూలంగా మారుతున్నాయి. ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యం కనబరిచిన బీజేపీ....రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో క్లీన్‌స్వీప్ చేయనున్నట్లు పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ తెలిపారు. అయితే ఇటీవలే నితీశ్‌తో జతకట్టి బీజేపీ తప్పు చేసిందని...ఆయనతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే మరిన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. నితీశ్‌కు ఇవే చివరి ఎన్నికలన్న పీకే... రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 20 సీట్లకు మించి గెలిస్తే గొప్పేనన్నారు...

బిహార్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్

లోక్ సభ ఎన్నికల్లో బీహార్‌లో బీజేపీ హవా కొనసాగనుందని ప్రముఖ పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్ వెల్లడించారు. మొత్తం సీట్లను క్లీన్‌స్వీప్ చేసినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదన్నారు. మోదీ ఇమేజ్ బీజేపీకి కలిసిరానుండగా....ఇండియా కూటమిలో చీలికలు కమలదళానికి ప్లస్‌ కానుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలతోపాటు...ఇటీవలే అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో మంచి జోష్‌మీద ఉన్న బీజీపీకి కచ్చితంగా ఇది సానుకూలంశమే. లోక్‌సభ సీట్ల సంఖ్యాపరంగా దేశంలోనే నాలుగో అతిపెద్ద రాష్ట్రమైన బిహార్‌లో అత్యధిక స్థానాలు బీజేపీ కైవసం చేసుకున్నట్లయితే... దిల్లీ పీఠమెక్కడం ఆ పార్టీకి నల్లేరు మీద నడకే.

అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో ఉత్తరప్రదేశ్‌లోనూ బీజేపీ దాదాపు క్లీన్‌స్వీప్ చేస్తుందన్న ఊహాగానాలు నేపథ్యంలో.....ఇప్పుడు బిహార్‌లోనూ మెరుగైన స్థానాలు దక్కించుకోనుందన్న వార్తలు కమలదళంలో నూతనోత్సాహం నింపుతున్నాయి. రాజకీయ వ్యూహాకర్తగా ప్రశాంత్‌ కిశోర్‌కు దేశంలోనే మంచి పేరు ఉంది. ఆయన చెప్పాడంటే జరిగి తీరుతుందన్న నానుడి ఉంది. గతంలోనూ NDA కూటమి తొలసారి విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ప్రశాంత్‌ కిశోర్‌... ఆ తర్వాత ఏపీలో జగన్ ను అధికారంలోకి తీసుకురావడంలోనూ ఎంతో కృషి చేశారు. ఇప్పుడు బీహార్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని ఆయన చెప్పడం కాషాయ వర్గాల్లో జోష్‌ నింపుతోంది..

నీతీష్‌కు చివరి ఎన్నికలే

బిహార్‌లో బీజేపీ జోష్‌ కొనసాగుతుందని అంచనా వేసిన ప్రశాంత్‌ కిశోర్‌...ఇటీవలే ఆ పార్టీతో జట్టు కట్టిన నితీశ్‌కుమార్‌పై మాత్రం విరుచుకుపడ్డారు. నితీశ్‌కు ఇవే చివరి ఎన్నికలన్న పీకే...ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో కనపడరని జోస్యం చెప్పారు. 2025లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకి 20కి మించి సీట్లు రావని తేల్చి చెప్పారు. నితీశ్ ఏ కూటమిలో ఉన్నా ఇంతకు మించి సీట్లను సాధించలేరన్నారు. ఒక వేళ 20 స్థానాల కంటే ఎక్కువ గెలుచుకుంటే తాను తన వృత్తిని వదులుకుంటానని ప్రశాంత్ కిశోర్ సవాల్ విసిరారు. నితీశ్‌ను బిహార్ ప్రజలు తిరస్కరిస్తున్నారన్న పీకే.. అందుకే ఆయన కుర్చీ కాపాడుకునేందుకు కూటములు మారుతుంటారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు బీజేపీకి దగ్గరైన నితీశ్‌....2025లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి బయటకు రావడం ఖాయమన్నారు. ఏ ఒక్క కూటమిపై సంపూర్ణ విశ్వాసం ఉంచని నితీశ్ కుమార్ ను ఈసారి బిహార్ ప్రజలు విశ్వసించరని ప్రశాంత్ కిశోర్ మండిపడ్డారు. నితీశ్ కు కుర్చీమీద తాపత్రయం తప్ప....ప్రజల బాగోగులు పట్టవని పీకే అన్నారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు
అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
TTD Latest News: ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు
ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తప్పిన ముప్పు, ముందుగానే ముంబైలో కాలుపెట్టిన ఆరెంజ్ టీమ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తప్పిన ముప్పు, ముందుగానే ముంబైలో కాలుపెట్టిన ఆరెంజ్ టీమ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli Heart Beat Checking | RR vs RCB మ్యాచులో గుండె పట్టుకున్న కొహ్లీRohit Sharma Karn Sharma Strategy | DC vs MI మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదేKarun Nair vs Bumrah Fight | Dc vs MI IPL 2025 మ్యాచ్ లో బుమ్రా వర్సెస్ కరుణ్ | ABP DesamKarun Nair Historic Comeback vs MI | ఓటమి ఒప్పుకోని వాడి కథ..గెలుపు కాళ్ల దగ్గరకు రావాల్సిందే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు
అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
TTD Latest News: ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు
ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తప్పిన ముప్పు, ముందుగానే ముంబైలో కాలుపెట్టిన ఆరెంజ్ టీమ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తప్పిన ముప్పు, ముందుగానే ముంబైలో కాలుపెట్టిన ఆరెంజ్ టీమ్
ABV VS YSRCP:  రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ వయా కోడికత్తి కేసు - రాజకీయం  మారుతోందిగా !
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ వయా కోడికత్తి కేసు - రాజకీయం మారుతోందిగా !
Mass Jathara TuMera Full Song: 'మాస్ జాతర' సాంగ్ మోత మోగించేసిందిగా - సూపర్ హిట్ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది
'మాస్ జాతర' సాంగ్ మోత మోగించేసిందిగా - సూపర్ హిట్ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది
TG SC Classification GO: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
Amaravati Breaking News: అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ  2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ 2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
Embed widget