అన్వేషించండి

Prashant Kishor: ఆ ఫోటోలు పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేసిన పీకే, ఏం జరిగింది?

Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, బిహార్ సీఎం నితీష్ కుమార్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

Prashant Kishor On Nitish Kumar: 

నితీష్‌ వర్సెస్ పీకే 

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై...బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ విమర్శలు చేశారు. జేడీయూ మాజీ నేత...ప్రశాంత్ కిషోర్...భాజపాకు సహకరించే పనిలో ఉన్నారని ఆరోపించారు. దీనిపై...పీకే స్పందించారు. ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. నితీష్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ పక్కపక్కనే ఉన్న ఫోటోలను ఎలాంటి క్యాప్షన్ ఇవ్వకుండానే షేర్ చేశారు. ఆ ఫోటోల్లో నితీష్ ప్రధాని మోదీకి చేతులు జోడిస్తూ అభివాదం చేస్తున్నారు. ఏమైందో తెలియదు కానీ...ఈ ఫోటోలను పోస్ట్ చేసిన కాసేపటికే మళ్లీ డిలీట్ చేశారు  పీకే. దీనంతటికీ కారణం ఏంటి అని ఆరా తీస్తే...ఢిల్లీలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ అని తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా...బిహార్ సీఎం మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా...కొందరు ప్రశాంత్ కిషోర్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన జేడీయూలో చేరి మళ్లీ ఎందుకు వెళ్లిపోయారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగానే...నితీష్...పీకేపై విమర్శలు చేశారు. ఆయన భాజపాకు సహకరించే పనిలో పడ్డారని ఆరోపించారు. నితీష్ కామెంట్స్‌ని సీరియస్‌గా తీసుకున్నారు పీకే. నితీష్ పేరు ప్రస్తావించకుండానే...ఈ వ్యాఖ్యలకు ఎలాంటి అర్థం లేదని, 2005 నుంచి రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని సవాల్ చేశారు. "పీకే మా పార్టీలో చేరినప్పుడే...మిగతా పనులన్నీ పక్కన పెట్టేయాలని చెప్పాను. కానీ...ఆయన పట్టించు కోలేదు. మిగతా పార్టీలకూ పని చేయటం మొదలు పెట్టారు. బహుశా ఆయన తీరే అదేమో. బిహార్‌కు ఏం చేయాలనుకుంటున్నాడో చేయని వ్వండి. 2005 నుంచి ఏం జరిగిందో కనీస అవగాహనైనా పీకేకి ఉందా..? ఇవన్నీ పబ్లిసిటీ కోసం చేసే కామెంట్స్ మాత్రమే. ఇలాంటివి చేయటంలో ఆయనో ఎక్స్‌పర్ట్. ఆయన మనసులో ఇంకేదో ఉంది. భాజపాతో నేరుగా పని చేస్తారు. లేదంటే కోవర్ట్‌గా మారిపోతారు" అని నితీష్ అంతకు ముందు ఆరోపించారు.  


Prashant Kishor: ఆ ఫోటోలు పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేసిన పీకే, ఏం జరిగింది?

ప్రధాని అభ్యర్థిగా..? 

గత నెల భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ...పాతమిత్రుడు ఆర్‌జేడీతో కలిసి మహాఘట్‌బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా నితీష్ కుమార్, డిప్యుటీ సీఎంగా తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే...సీఎం కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి
నితీష్...జాతీయ రాజకీయాలపైనా దృష్టి సారించారు. 2024లో ప్రధాని పదవికి నితీష్ కుమార్ పోటీ పడతారన్న వార్తలు చక్కర్లు కొడుతు న్నాయి. దీనిపై భాజపా కాస్త గట్టిగానే స్పందిస్తోంది. భాజపా నేత అమిత్ మాల్వియా సెటైర్లు వేశారు. "సీఎంగానే విఫలమైన వ్యక్తి ప్రధాని పదవి కోసం చూస్తుండటమేంటో. రాష్ట్రంలో ఆయన పార్టీ ఎప్పుడో అప్పుడో కుప్ప కూలిపోక తప్పదు" అని విమర్శించారు. ట్విటర్ వేదికగా కౌంటర్‌లు వేశారు. "పశ్చిమ బెంగాల్‌ను దాటి ప్రజల నమ్మకాన్ని పొందాలని ప్రయత్నించిన మమతా బెనర్జీ విఫలమయ్యారు. ఇప్పుడు నితీష్ కుమార్ కూడా అదే చేస్తున్నారు. సీఎంగానే విఫలమైన వ్యక్తి...సొంత పార్టీ మునిగిపోతుంటే...ప్రధాని పదవి కోసం ఆరాటపడుతున్నారు" అని ట్వీట్ చేశారు. ఇటీవలే నితీష్ కుమార్ భాజపా నేతృత్వంలోని NDA నుంచి బయటకు వచ్చేశారు.ఆర్‌జేడీతో జోడీ కట్టి కొత్త ప్రభుత్వం  ఏర్పాటు చేయటమే కాకుండా...ముఖ్యమంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. మహాఘట్‌బంధన్ ప్రభుత్వం ఏర్పడ్డాకే... నితీష్ 2024లో ప్రధాని పదవికి పోటీ చేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వార్తల్ని నితీష్ కొట్టి పారేస్తున్నప్పటికీ...ఆ చర్చ మాత్రం జోరుగానే సాగుతోంది. 

Also Read: Viral Video: ఇదేం గోకుడు సామీ! తుక్కుతుక్కు చేసేశావ్ కదా గణేశా!

Also Read: Bengaluru Floods: విప్రో ఛైర్మన్ విల్లా మునిగిపోయిందట, బెంగళూరు వరదల ఎఫెక్ట్‌ అలా ఉంది మరి!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Virat Kohli , MS Dhoni News: ఐపీఎల్ 2026 క్రేజ్.. టాప్-5 మోస్ట్ టాక్డ్ ప్లేయ‌ర్స్ లిస్ట్.. కోహ్లీ హవా మామూలుగా లేదుగా.. మిగతా ప్లేయర్లు ఎవరంటే!
ఐపీఎల్ 2026 క్రేజ్.. టాప్-5 మోస్ట్ టాక్డ్ ప్లేయ‌ర్స్ లిస్ట్.. కోహ్లీ హవా మామూలుగా లేదుగా.. మిగతా ప్లేయర్లు ఎవరంటే!
IPL 2026 GT vs SRH Result Update: బ్యాటింగ్ వైఫ‌ల్యంతో SRH ఘోర ప‌రాజ‌యం.. అన్ని రంగాల్లో రాణించిన జీటీ, టాప్ ప్లేస్ కు గిల్ సేన‌, స‌త్తా చాటిన సుద‌ర్శ‌న్, ర‌బాడ‌, హోల్డ‌ర్
బ్యాటింగ్ వైఫ‌ల్యంతో SRH ఘోర ప‌రాజ‌యం.. అన్ని రంగాల్లో రాణించిన జీటీ, టాప్ ప్లేస్ కు గిల్ సేన‌
NEET-UG Paper Leak: నాసిక్‌ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సీకర్ హాస్టల్ వరకు! నీట్‌ పేపర్ లీకేజీలో షాకింగ్‌ నిజాలు ఇవే!
నాసిక్‌ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సీకర్ హాస్టల్ వరకు! నీట్‌ పేపర్ లీకేజీలో షాకింగ్‌ నిజాలు ఇవే!
ABP Desam Top 10, 12 May 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 12 May 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget