అన్వేషించండి

Prabhas : అయోధ్యకు ప్రభాస్ - స్పెషల్ ఇన్విటేషన్ పంపిన ట్రస్ట్

Prabhas to Ayodhya : అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ప్రభాస్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది.


Prabhas received a special invitation to Ayodhya :   ‘ఆదిపురుష్‌’ సినిమాలో శ్రీరాముడి పాత్రను పోషించిన దక్షిణాది పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభా్‌సతో పాటు కన్నడ నటుడు యశ్‌కు వచ్చే నెల 22న అయోధ్యలో నిర్వహించే రామమందిర ప్రతిష్ఠాపన వేడుకకు ఆహ్వానం అందింది. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులకు కూడా ఆహ్వానం అందినట్లు తెలిసింది. బాలీవుడ్‌ నటులు రణ్‌బీర్‌కపూర్‌-ఆలియా భట్‌, అజయ్‌ దేవగన్‌, సన్నీ డియోల్‌, టైగర్‌ ష్రాప్‌, ఆయుష్మాన్‌ ఖురానా కూడా అతిథుల జాబితాలో ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇటు అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌ కుమార్‌, చిరంజీవి, రజినీకాంత్‌, మోహన్‌లాల్‌, సంజయ్‌ లీలా బన్సాలీ, మాధురి దీక్షిత్‌, అనుపమ్‌ ఖేర్‌, ధనుశ్‌, రిషభ్‌ శెట్టిని కూడా ఇప్పటికే వేడుకలో పాల్గొనాలని ఆహ్వానించారు.                        

దేశంలో జనవరి మొత్తం అయోధ్య రామాలయం సందడి ఉండనుంది. ఇందు కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.  తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి వీఐపీ ఆహ్వానాలు వచ్చాయన్నదానిపై స్పష్టత లేదు.  కానీ మొదటి సారిగా హీరో ప్రభాస్‌కు ఆహ్వానం అందింది. టాలీవుడ్‌లో ఇంకెవరికీ ఇలాంటి చాన్స్ రాలేదు.    ప్రభాస్ బాహు బలి సినిమాతో  పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఆయన ఏ సినిమా చేసినా హిందీలో సైతం మంచి మార్కెట్ వచ్చింది. అదే సమయంలో ప్రభాస్‌కు బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు బీజేపీ నేతగా ఉంటూ చనిపోయారు. గతంలో ప్రభాస్ రెండు, మూడు సార్లు ప్రధానితో భేటీ అయ్యారు కూడా.  ఇటీవల ఆదిపురుష్‌లో రాముడి క్యారెక్టర్ కూడా పోషించారు. అందుకే ప్రభాస్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపినట్లుగా తెలుస్తోంది.

అయోధ్య రామాలయాన్ని జాతీయ  పండుగలాగా నిర్వహిస్తున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఓ ట్రైన్ ఏర్పాటు చేస్తున్నారు.   ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత చివరకు నవంబర్‌ 9, 2019న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. వివాదాస్పద స్థలంలో రామాలయం నిర్మాణానికి సమ్మతించింది.. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని తీర్పునిచ్చింది. ఆ తర్వాత ఆలయ నిర్మాణానికి పునాది రాయి వేయగా.. జనవరి 22న ఆలయంలో ప్రాణ ప్రతిష్ట  కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 16న వేడుకలు మొదలై.. అదే నెల 22న ముగియనున్నాయి.                           

జనవరి 15 నాటికి వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ పేర్కొన్నారు. 22న  గర్భాలయంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరుగనుండగా.. ప్రధాని మోదీ హాజరవనున్నారు. ఈ వేడుకకు రాజకీయ నాయకులతోపాటు బౌద్ధ మత గురువు దలైలామా, ముఖేష్ అంబానీతో పాటు నటీనటులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరవనున్నారు. మరో వైపు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ నేపథ్యంలో దేశమంతా వేడుకలు నిర్వహించనున్నారు.

టాప్ హెడ్ లైన్స్

PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
Embed widget