అన్వేషించండి

PM Modi Oath Ceremony: 1947లో నెహ్రూ ఎక్కడ ప్రమాణ స్వీకారం చేశారు? అప్పటి నుంచి ఈ వేడుకలో వచ్చిన మార్పులివే!

PM Modi Oath Ceremony: 1947లో తొలిసారి నెహ్రూ రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.

PM Modi Swearing In: ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత కీలకమైంది. ఓ నేతను ఎన్నుకున్న తరవాత రాజ్యాంగ బద్ధంగా ఆయన ఆ పదవిని చేపట్టాలంటే అందరి ముందు ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి స్థాయి అయితే ఆ రాష్ట్ర గవర్నర్‌ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తారు. ప్రధాన మంత్రి స్థాయి అయితే రాష్ట్రపతి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. అయితే...ఈ ప్రమాణ స్వీకార ఉత్సవానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. బ్రిటీష్‌ వాళ్లు భారత్‌లో పరిపాలించినప్పటి నుంచే ఈ ప్రక్రియ మొదలైంది. అప్పట్లో అధికారులు తమ బాధ్యతలు తీసుకునే ముందు రాజుపై విశ్వాసం చూపించుకునేందుకు ఈ ప్రమాణ స్వీకారాన్ని మొదలు పెట్టారు. స్వాతంత్య్రం వచ్చిన (history of oath taking ceremonies) తరవాత కూడా ఇది కొనసాగుతూ వస్తోంది. కాకపోతే ఇప్పుడు మన దేశ రాజ్యాంగం సాక్షిగా ఈ ప్రక్రియ జరుగుతుంది. 1947లో ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర భారత తొలి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరవాత ఈ దర్బార్‌ హాల్‌లోనే ప్రమాణ స్వీకారం చేయడం ఆనవాయితీగా వచ్చింది. భారత తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ కూడా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశారు. 

PM Modi Oath Ceremony: 1947లో నెహ్రూ ఎక్కడ ప్రమాణ స్వీకారం చేశారు? అప్పటి నుంచి ఈ వేడుకలో వచ్చిన మార్పులివే!

1990 తరవాత ఈ ప్రక్రియలో కొన్ని మార్పులు జరిగాయి. అప్పటి రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ ఈ మార్పులకు శ్రీకారం చుట్టారు. 1990లో ప్రధానిగా చంద్రశేఖర్ బాధ్యతలు తీసుకున్నప్పుడు దర్బార్‌ హాల్‌లో కాకుండా రాష్ట్రపతి భవన్‌ ముందున్న ఖాళీ స్థలంలో ప్రమాణ స్వీకారం చేయించారు. దర్బార్‌ హాల్‌ ఇరుకవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు. ఎక్కువ మంది అతిథులను పిలిచినప్పుడు అందరికీ కనిపించేలా ప్రధాని ఉండాలన్న ఉద్దేశంతో ఈ మార్పు చేశారు. 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇలాగే రాష్ట్రపతి భవన్ ముందున్న ఖాళీ స్థలంలోనే ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇదే పద్ధతి కొనసాగింది. 2014,2019లో నరేంద్ర మోదీ కూడా ఈ విధానాన్నే అనుసరించారు. వేలాది మంది అతిథులను పిలిచారు. 2014లో 4 వేల మంది, 2019లో 6 వేల మంది అతిథులు రాగా ఈ సారి ఆ సంఖ్య 8 వేలకు పెరిగింది. 1984లో తొలిసారి ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని దూరదర్శన్‌లో  ప్రత్యక్ష ప్రసారం చేశారు. కానీ ఇప్పుడు మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని 100 కెమెరాలతో బ్రాడ్‌కాస్ట్ చేయనున్నారు. 8 వేల మంది అతిథులకు తగ్గట్టుగానే రాష్ట్రపతి భవన్ వద్ద ఏర్పాట్లు చేశారు. ఆ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 1,100 వందల మంది ట్రాఫిక్ పోలీసులు నగరాన్ని మొహరించారు. 7 దేశాల అధినేతలు వస్తుండడం వల్ల పలు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 

Also Read: PM Modi Salary: ప్రధాని నరేంద్ర మోదీ ఎంత జీతం తీసుకుంటారో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ఈ బైక్‌ మీ దగ్గర ఉంటే సేఫ్టీ మీ చుట్టూ ఉన్నట్లే! - అత్యంత చవకైన Dual Channel ABS బైకులు
డ్యూయల్ ఛానల్ ABS ఉన్న చవకైన బైకులు ఇవే - రూ.1.05 లక్షల నుంచే అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్
First Passive Euthanasia: హరీష్ రాణా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి.. తీర్పు వెల్లడిస్తూ జడ్జి కన్నీళ్లు.. భారత్‌లో తొలి కేసు
హరీష్ రాణా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు పర్మిషన్.. తీర్పు వెల్లడిస్తూ జడ్జి కన్నీళ్లు.. భారత్‌లో తొలి కేసు
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
కొత్త ఫీచర్లతో 2026 Hyundai Verna అప్‌డేట్.. HX6+ వేరియంట్ ఎందుకు బెస్ట్?
2026 హ్యుందాయ్ వెర్నా ఏ వేరియంట్ కొనాలి? ధరలు, ఫీచర్లు, బెస్ట్ ఆప్షన్ ఇదే

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Embed widget