అన్వేషించండి

PM Modi Message: హిందూయేతర వర్గాలపైనా దృష్టి సారించండి, నేతలకు ప్రధాని మోదీ సూచనలు

హిందూయేత వర్గాలకూ భాజపాను చేరువ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ సీనియర్ నేతలకు సూచించారు.

అన్ని వర్గాలకూ చేరువ కావాలి: ప్రధాని మోదీ

అన్ని వర్గాల వారికీ భాజపాను చేరువ చేయాలని పార్టీ నేతలకు సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇప్పటి వరకూ భాజపాకు దూరంగా ఉంటున్న ఓటు బ్యాంకునీ తమ వైపు తిప్పుకునేలా వ్యూహ రచన చేయాలని పిలుపునిచ్చారు. హిందూయేతర వర్గాల్లోని ప్రజలనూ ఆకట్టుకునేలా ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. హిందూయేతర వర్గాల్లోనూ వెనకబడిన వాళ్లుంటారని, కేవలం హిందువులకే పరిమితం కాకుండా ఇతర వర్గాల వారికీ చేరవవటం ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారని కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు. యూపీలోని అజంగర్, రామ్‌పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన తరవాత మోదీ ఈ సూచనలు చేశారట. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఎస్‌పీ ప్రాబల్యం ఎప్పటి నుంచో ఉంది. పైగా ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ. ఇలాంటి చోట కూడా భాజపా పట్టు సాధించటం పార్టీ వర్గాల్లో విశ్వాసం నింపింది. అందుకే...హిందూయేతర వర్గాలకూ ప్రాధాన్యతనిస్తామన్న బలమైన సంకేతాలు భాజపా ఇవ్వాల్సిన అవసరముందని ప్రధాని మోదీ భావిస్తున్నారు.

హిందూయేతర వర్గాలూ ముఖ్యమే..

యూపీ, బిహార్‌లోని పస్‌మంద ముస్లింలు సహా ఇతర వర్గాల ఓటు బ్యాంకుని ఆకర్షించటానికి ఇదే సరైన సమయమని భావిస్తోంది భాజపా. పైగా ఇప్పుడు వచ్చిన ఫలితాలూ అందుకు బలమైన సంకేతాలే ఇస్తున్నాయి. రెండోసారి యూపీలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక యోగీ ఆదిత్యనాథ్ దనిష్ ఆజాద్‌ను ప్రాధాన్యతనిచ్చారు. మైనార్టీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆయనకే అందించారు. ఈయన పస్‌మంద కమ్యూనిటీకి చెందిన వాడే కావటం వల్ల ఈ విధంగా ఆ వర్గ మద్దతును కూడగట్టుకోగలిగింది భాజపా. ఎప్పటి నుంచో ఈ వర్గానికి చేరువ కావాలని చూస్తోంది కాషాయ పార్టీ. ఇన్నాళ్లకు అది నెరవేరింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ...పలు సూచనలు చేశారట ప్రధాని మోదీ. ఇప్పుడే కాదు. గతేడాది కూడా ప్రధాని, పార్టీ కార్యకర్తలకు ఇలాంటి సూచనలే చేశారు. కేరళలో క్రిస్టియన్ కమ్యూనిటీకి చేరువయ్యేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటి వరకూ అక్కడ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది భాజపా. ఈసారి కచ్చితంగా ఎంతో కొంత ఉనికి చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. 

భారత్ విశ్వగురుగా నిలబడాలి..

ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా పార్టీ సీనియర్ నేతలతో చర్చించారు. ప్రపంచానికి భారత్ విశ్వగురుగా మారేందుకు కృషి చేయాలని, రాజకీయాల్లో వారసత్వానికి స్వస్తి పలకాలని తీర్మానం ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ తీర్మానాన్ని పాస్ చేసారు అమిత్‌షా. ఆ తరవాత ప్రధాని మోదీని ఏమైనా సూచనలు చేయాలని కోరగా, ఆయన ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి గురించి మాట్లాడారట. అలాగే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సమర్థత, నేపథ్యం గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని, ఆమె గెలుపునకు కృషి చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. 

Also Read: Himachal Pradesh Bus accident: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 16 మంది మృతి!

 

 

 

 

టాప్ హెడ్ లైన్స్

Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
MP Jhabua Man Builds Underground House: తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !
తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget