అన్వేషించండి

Parliament Monsoon Session: సస్పెండ్ అయిన ఎంపీల్లో దక్షిణాది వారే ఎక్కువ? తెరపైకి కొత్త వాదన

Parliament Monsoon Session: పార్లమెంట్‌లో సస్పెండ్‌ అయిన ఎంపీల్లో ఎక్కువ మంది సౌత్ నుంచే ఉన్నారన్న వాదన వినిపిస్తోంది. కావాలనే ఇలా చేస్తున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు.

Parliament Monsoon Session: 

సౌత్‌ ఎంపీలే ఎక్కువ..! 

జులై 18 వ తేదీన పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి దాదాపు 27 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. అయితే వీరిలో ఎక్కువ మంది దక్షిణాదికి చెందిన వాళ్లే ఉన్నారన్న కొత్త వాదన తెరపైకి వస్తోంది. వీరిలో దాదాపు 7గురు బెంగాల్ నుంచి, 8 మంది తమిళనాడు నుంచి ఉన్నారు. కేరళ నుంచి ఐదుగురు, తెలంగాణ నుంచి ముగ్గురు ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ లెక్కల్ని కాస్త గమనిస్తే...కేరళ, తమిళనాడు, తెలంగాణలో భాజపా అధికారంలోకి రావాలని చూస్తోంది. అందుకే టార్గెట్ చేసి మరీ సస్పెండ్ చేశారన్న వాదన వినిపిస్తోంది. వీరిలో తెరాస, డీఎమ్‌కే, ఎల్‌డీఎఫ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎంపీలున్నారు. ఉత్తర భారత్‌ సహా, ఈశాన్య భారత్‌లో పాగా వేసిన భాజపా ఇప్పుడు దక్షిణాదిపై దృష్టి సారించింది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చినప్పటికీ ఇంకా పూర్తిస్థాయి పట్టు సాధించలేకపోయింది. బెంగాల్‌లో అయితే పెద్ద ఆపరేషన్‌నే చేపడుతోంది భాజపా. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ టీఎమ్‌సీ బలంగా ఉండటం వల్ల వెనకబడిపోయింది కాషాయ పార్టీ. భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా, ప్రధాని మోదీ కూడా బెంగాల్‌లో ప్రచారాల్లో పాల్గొన్నారు. అంతకు ముందుతో పోల్చి చూస్తే సీట్ల సంఖ్య కాస్త పెంచుకోగలిగినప్పటికీ విజయం సాధించాలన్న కల మాత్రం కలగానే మిగిలిపోయింది. తరవాత క్రమంగా కొందరు భాజపా ఎమ్మెల్యేలు..తృణమూల్‌కు వరుస కట్టారు. 

అక్కడ ప్లాన్ బెడిసికొట్టింది...

ఇక తమిళనాడు భాజపాకు కొరకరాని కొయ్యగా మారింది. AIDMKతో కలిసి అడుగులు వేసినప్పటికీ...పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. డీఎమ్‌కే ఘన విజయం సాధించింది. AIDMKలో అంతర్గత పోరు మొదలవటమూ ఆ పార్టీని దెబ్బ తీసింది. కేరళ విషయానికొస్తే...2021లో జరిగిన ఎన్నికల్లో అంతకు ముందు పార్టీకే పట్టం కట్టారు అక్కడి ప్రజలు. నాలుగు దశాబ్దాల్లో ఇలా రెండోసారి ఒకే పార్టీ అధికారంలోకి రావటం ఇదే తొలిసారి. వామపక్షాలకు కంచుకోటగా ఉన్న కేరళలో..భాజపా ఉనికి చాటుకోవటం కష్టతరమవుతోంది. ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. అయితే తెలంగాణలో మాత్రం జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికలతో క్యాడర్‌లో కాస్తంత జోష్ వచ్చింది. తెరాస తరవాత రెండో  స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు చేస్తోంది. ఇవన్నీ చూస్తుంటే...ఇప్పుడు పార్లమెంట్‌లో సస్పెండ్ అవుతున్న ఎంపీలు ఎక్కువ మంది దక్షిణాదికే చెందిన వారు కావటం కాకతాళీయమా..? లేక కావాలనే ఇలా చేస్తున్నారా అన్నది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే మాత్రం...కావాలనే దక్షిణాదికి చెందిన ఎంపీలపై వివక్ష చూపుతున్నారన్న విశ్లేషణ నడుస్తోంది. 


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CBSE 12th Result 2026: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల.. 85.20 శాతం మంది ఉత్తీర్ణత.. రిజల్ట్స్ లింక్
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల.. 85.20 శాతం మంది ఉత్తీర్ణత.. రిజల్ట్స్ లింక్
Mahabharat: ఉచిత పథకాలు ప్రకటించడం కాదు ఆ అవసరం లేకుండా చేయడమే రాజధర్మం! ఈ కథ మీకోసమే!
ఉచిత పథకాలు ప్రకటించడం కాదు ఆ అవసరం లేకుండా చేయడమే రాజధర్మం! ఈ కథ మీకోసమే!
CM Vijay: ఓఎస్డీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ నియామకాన్ని రద్దు చేసిన సీఎం విజయ్.. విమర్శలతో వెనక్కి తగ్గిన దళపతి
ఓఎస్డీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ నియామకాన్ని రద్దు చేసిన సీఎం విజయ్.. విమర్శలతో వెనక్కి తగ్గిన దళపతి
PM Modi Convoy Size: ప్రధాని మోదీ కాన్వాయ్ వాహనాలు తగ్గింపు.. వాటికి ఎంత ఫ్యూయల్ వాడేవారు, ఎంత ఆదా అవుతుంది
ప్రధాని మోదీ కాన్వాయ్ వాహనాలు తగ్గింపు.. వాటికి ఎంత ఫ్యూయల్ వాడేవారు, ఎంత ఆదా అవుతుంది

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBSE 12th Result 2026: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల.. 85.20 శాతం మంది ఉత్తీర్ణత.. రిజల్ట్స్ లింక్
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల.. 85.20 శాతం మంది ఉత్తీర్ణత.. రిజల్ట్స్ లింక్
PM Modi Convoy Size: ప్రధాని మోదీ కాన్వాయ్ వాహనాలు తగ్గింపు.. వాటికి ఎంత ఫ్యూయల్ వాడేవారు, ఎంత ఆదా అవుతుంది
ప్రధాని మోదీ కాన్వాయ్ వాహనాలు తగ్గింపు.. వాటికి ఎంత ఫ్యూయల్ వాడేవారు, ఎంత ఆదా అవుతుంది
Hyderabad Crime News: హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. ఓ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీ
హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. ఓ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీ
Vijay Trisha: సూర్య కోసమా? త్రిష కోసమా? సీఎం విజయ్ బంపరాఫర్ బాగుందమ్మా
సూర్య కోసమా? త్రిష కోసమా? సీఎం విజయ్ బంపరాఫర్ బాగుందమ్మా
Gold Import Duty: బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
Heat Wave Alert : రోజు రోజుకి పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. వేడి వల్ల శరీరానికి, మనసుకు పొంచి ఉన్న ప్రమాదాలు ఇవే
రోజు రోజుకి పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. వేడి వల్ల శరీరానికి, మనసుకు పొంచి ఉన్న ప్రమాదాలు ఇవే
Peddi Tickets Rate: తెలంగాణలో 'పెద్ది'కి పెద్ద దెబ్బ... మైత్రి వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఇష్యూలో చరణ్ సినిమాకు భారీ లాస్
తెలంగాణలో 'పెద్ది'కి పెద్ద దెబ్బ... మైత్రి వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఇష్యూలో చరణ్ సినిమాకు భారీ లాస్
AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
Embed widget