అన్వేషించండి

Parliament Monsoon Session: సస్పెండ్ అయిన ఎంపీల్లో దక్షిణాది వారే ఎక్కువ? తెరపైకి కొత్త వాదన

Parliament Monsoon Session: పార్లమెంట్‌లో సస్పెండ్‌ అయిన ఎంపీల్లో ఎక్కువ మంది సౌత్ నుంచే ఉన్నారన్న వాదన వినిపిస్తోంది. కావాలనే ఇలా చేస్తున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు.

Parliament Monsoon Session: 

సౌత్‌ ఎంపీలే ఎక్కువ..! 

జులై 18 వ తేదీన పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి దాదాపు 27 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. అయితే వీరిలో ఎక్కువ మంది దక్షిణాదికి చెందిన వాళ్లే ఉన్నారన్న కొత్త వాదన తెరపైకి వస్తోంది. వీరిలో దాదాపు 7గురు బెంగాల్ నుంచి, 8 మంది తమిళనాడు నుంచి ఉన్నారు. కేరళ నుంచి ఐదుగురు, తెలంగాణ నుంచి ముగ్గురు ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ లెక్కల్ని కాస్త గమనిస్తే...కేరళ, తమిళనాడు, తెలంగాణలో భాజపా అధికారంలోకి రావాలని చూస్తోంది. అందుకే టార్గెట్ చేసి మరీ సస్పెండ్ చేశారన్న వాదన వినిపిస్తోంది. వీరిలో తెరాస, డీఎమ్‌కే, ఎల్‌డీఎఫ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎంపీలున్నారు. ఉత్తర భారత్‌ సహా, ఈశాన్య భారత్‌లో పాగా వేసిన భాజపా ఇప్పుడు దక్షిణాదిపై దృష్టి సారించింది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చినప్పటికీ ఇంకా పూర్తిస్థాయి పట్టు సాధించలేకపోయింది. బెంగాల్‌లో అయితే పెద్ద ఆపరేషన్‌నే చేపడుతోంది భాజపా. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ టీఎమ్‌సీ బలంగా ఉండటం వల్ల వెనకబడిపోయింది కాషాయ పార్టీ. భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా, ప్రధాని మోదీ కూడా బెంగాల్‌లో ప్రచారాల్లో పాల్గొన్నారు. అంతకు ముందుతో పోల్చి చూస్తే సీట్ల సంఖ్య కాస్త పెంచుకోగలిగినప్పటికీ విజయం సాధించాలన్న కల మాత్రం కలగానే మిగిలిపోయింది. తరవాత క్రమంగా కొందరు భాజపా ఎమ్మెల్యేలు..తృణమూల్‌కు వరుస కట్టారు. 

అక్కడ ప్లాన్ బెడిసికొట్టింది...

ఇక తమిళనాడు భాజపాకు కొరకరాని కొయ్యగా మారింది. AIDMKతో కలిసి అడుగులు వేసినప్పటికీ...పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. డీఎమ్‌కే ఘన విజయం సాధించింది. AIDMKలో అంతర్గత పోరు మొదలవటమూ ఆ పార్టీని దెబ్బ తీసింది. కేరళ విషయానికొస్తే...2021లో జరిగిన ఎన్నికల్లో అంతకు ముందు పార్టీకే పట్టం కట్టారు అక్కడి ప్రజలు. నాలుగు దశాబ్దాల్లో ఇలా రెండోసారి ఒకే పార్టీ అధికారంలోకి రావటం ఇదే తొలిసారి. వామపక్షాలకు కంచుకోటగా ఉన్న కేరళలో..భాజపా ఉనికి చాటుకోవటం కష్టతరమవుతోంది. ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. అయితే తెలంగాణలో మాత్రం జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికలతో క్యాడర్‌లో కాస్తంత జోష్ వచ్చింది. తెరాస తరవాత రెండో  స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు చేస్తోంది. ఇవన్నీ చూస్తుంటే...ఇప్పుడు పార్లమెంట్‌లో సస్పెండ్ అవుతున్న ఎంపీలు ఎక్కువ మంది దక్షిణాదికే చెందిన వారు కావటం కాకతాళీయమా..? లేక కావాలనే ఇలా చేస్తున్నారా అన్నది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే మాత్రం...కావాలనే దక్షిణాదికి చెందిన ఎంపీలపై వివక్ష చూపుతున్నారన్న విశ్లేషణ నడుస్తోంది. 


 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pahalgam Tourist Attack: పహల్గాం ఉగ్రదాడి ఘటన, కాల్పులు జరిపిన ఓ టెర్రరిస్ట్ ఫస్ట్ ఫొటో వైరల్
పహల్గాం ఉగ్రదాడి ఘటన, కాల్పులు జరిపిన ఓ టెర్రరిస్ట్ ఫస్ట్ ఫొటో వైరల్
Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
PM Modi : ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
AP Liquor Scam: రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KL Rahul Ignored LSG Owner Goenka | రాహుల్ కి ఇంకా కోపం లేదు..తిట్టారనే కసి మీదే ఉన్నట్లున్నాడుLSG vs DC Match Highlights IPL 2025 | లక్నో సూపర్ జెయింట్స్ పై 8వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం | ABP DesamGujarat Titans Winning Strategy IPL 2025 | టాప్ లో ఉంటే చాలు..ఇంకేం అవసరం లేదంటున్న గుజరాత్ టైటాన్స్Trolling on Ajinkya Rahane vs GT IPL 2025 | బ్యాటర్ గా సక్సెస్..కెప్టెన్ గా ఫెయిల్..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pahalgam Tourist Attack: పహల్గాం ఉగ్రదాడి ఘటన, కాల్పులు జరిపిన ఓ టెర్రరిస్ట్ ఫస్ట్ ఫొటో వైరల్
పహల్గాం ఉగ్రదాడి ఘటన, కాల్పులు జరిపిన ఓ టెర్రరిస్ట్ ఫస్ట్ ఫొటో వైరల్
Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
PM Modi : ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
AP Liquor Scam: రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
AP SSC Results 2025 on Whatsapp : వాట్సాప్‌లో ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు ఇలా చూసుకోండి 
వాట్సాప్‌లో ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు ఇలా చూసుకోండి 
Allu Arjun: అల్లు అర్జున్ కోసం లుక్ టెస్ట్... 'పుష్ప' నుంచి బయటకు రావాలని... అట్లీ ఏం చేస్తాడో?
అల్లు అర్జున్ కోసం లుక్ టెస్ట్... 'పుష్ప' నుంచి బయటకు రావాలని... అట్లీ ఏం చేస్తాడో?
Pahalgam Terror Attack: కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
Embed widget