అన్వేషించండి

IRCTC: రైలు ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ భారీషాక్ - తత్కాల్ టిక్కెట్ల బుకింగ్‌లో కీలక మార్పులు - ఆ ఓటీపీనే కీలకం !

Tatkal tickets: తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ లో రైల్వే కీలక మార్పులు చేసింది. ఆధార్ ఓటీపీలు అందుకునేవారు మాత్రమే ఇక టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Aadhaar authenticated user can book Tatkal tickets : రైళ్లలో తత్కాల్ కోటా టిక్కెట్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది.  అయితే ఆ టిక్కెట్ల బుకింగ్ లో చాలా అక్రమాలు  జరుగుతాయన్న ఆరోపణలు ఉన్నాయి. వాటికి చెక్ పెట్టేందుకు ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్ టికెట్ బుకింగ్ కొత్త నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించుకుంది. 

భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ జూలై 1, 2025 నుండి తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనలు అక్రమ బుకింగ్‌లను అరికట్టడం, పారదర్శకతను పెంచడం, సామాన్య ప్రయాణికులకు టికెట్లు సులభంగా అందుబాటులో ఉండేలా చేయడం లక్ష్యంగా  తీసుకొొస్తున్నారు. 

జూలై 1, 2025 నుండి, IRCTC వెబ్‌సైట్ (www.irctc.co.in) ,  మొబైల్ యాప్ ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేయడానికి  ఆధార్  ఓటీపీ తప్పనిసరి చేశారు.  ఆధార్‌తో లింక్ చేసిన IRCTC ఖాతాలతో మాత్రమే తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.  ఈ నిబంధన ద్వారా, నిజమైన ప్రయాణికులకు టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఇప్పటి వరకూ అక్రమార్కులు  బాట్‌లు లేదా ఆటోమేటెడ్ టూల్స్ ద్వారా బుకింగ్‌లు చేసుకుంటూ సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి రాకుండా చేస్తున్నారు. 

ఆధార్ ధృవీకరించిన  ఖాతాలు తత్కాల్ బుకింగ్ విండో ఓపెన్ అయిన మొదటి 10 నిమిషాల్లో ప్రాధాన్యత పొందుతాయి. ఈ సమయంలో ఏజెంట్లకు బుకింగ్ చేయడానికి అనుమతి ఉండదు.  IRCTC అధీకృత ఏజెంట్లు తత్కాల్ బుకింగ్ విండో ఓపెన్ అయిన మొదటి 30 నిమిషాల్లో టికెట్లు బుక్ చేయలేరు. ఏజెంట్లు AC క్లాస్‌లకు ఉదయం 10:00 నుండి 10:30 వరకు ఏజెంట్లు బుకింగ్ చేయలేరు. నాన్-AC క్లాస్‌లకు ఉదయం 11:00 నుండి 11:30 వరకు ఏజెంట్లు బుకింగ్ చేయలేరు.

బల్క్ బుకింగ్‌లను నిరోధించడం ,  సామాన్య ప్రయాణికులకు టికెట్లు అందుబాటులో ఉండేలా చేయడం కోసం ఐఆర్‌సీటీసీ ఈ మార్పులు చేస్తోంది.  గత డేటా ప్రకారం, AC క్లాస్‌లలో 62.5% మరియు నాన్-AC క్లాస్‌లలో 66.4% తత్కాల్ టికెట్లు మొదటి 10 నిమిషాల్లోనే బుక్ అవుతున్నాయి. ఇందులో బాట్‌ల ద్వారా బుకింగ్‌లు ఉన్నట్లుగా గుర్తించారు.                

కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) కౌంటర్లు , అధీకృత ఏజెంట్ల ద్వారా బుక్ చేసే తత్కాల్ టికెట్లకు కూడా  సిస్టమ్-జనరేటెడ్ OTP ధృవీకరణ అవసరమని నిబంధనలు మార్చారు.  బుకింగ్ సమయంలో ప్రయాణికుడు అందించిన మొబైల్ నంబర్‌కు OTP  వస్తుంది. ఈ నిబంధన జూలై 15, 2025 నుండి అమలులోకి వస్తుంది. ప్రతిరోజూ సుమారు 2,25,000 ప్రయాణికులు IRCTC ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేస్తున్నారు. 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget