అన్వేషించండి

Nitish Kumar: నీతి ఆయోగ్ సమావేశానికి నితీశ్ డుమ్మా, ప్రత్యేక హోదాపై అలిగారా?

Niti Aayog Meeting: ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి నితీశ్ కుమార్ హాజరు కాకపోవడం కీలకంగా మారింది. ఆయనకు బదులుగా డిప్యుటీ సీఎంలు హాజరయ్యారు.

Nitish Kumar Skips Niti Aayog Meeting: ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ సమావేశంపై పొలిటికల్ వార్ జరుగుతోంది. ప్రతిపక్షాలు పూర్తిగా బైకాట్‌ చేశాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కరే ప్రతిపక్షాల ప్రతినిధిగా హాజరయ్యారు. కానీ..ఆమె కూడా కాసేపటికే వాకౌట్ చేశారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైక్ ఆఫ్ చేశారని ఆరోపించారు. సమావేశం జరుగుతుండగానే బయటకు వచ్చేశారు. అయితే...అన్నింటి కన్నా ఆసక్తి కలిగించిన విషయం ఏంటంటే...NDA మిత్రపక్షమైన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఆయనకు బదులుగా ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదిరి, విజయ్ కుమార్ సిన్హా ఈ మీటింగ్‌కి వెళ్లారు. ఆయన ఎందుకు రాలేదన్న కారణమైతే పార్టీ ఏమీ వెల్లడించలేదు. దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. పైగా బిహార్ ప్రత్యేక హోదాపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మిత్రపక్షమే అయినా బిహార్‌ని కేంద్రం పట్టించుకోలేదని కొందరు నేతలు తీవ్రంగా విమర్శించారు. కేవలం కొంత నిధులు కేటాయించి చేతులు దులుపుకుందని బిహార్‌లోని ప్రతిపక్ష నేతలు మండి పడుతున్నారు. కానీ దీన్ని రాజకీయం చేయొద్దని జేడీయూ నేతలు తేల్చి చెబుతున్నారు. గతంలోనూ నితీశ్ కుమార్‌ నీతి ఆయోగ్ సమావేశాలకు రాలేదని గుర్తు చేశారు. 

"నీతి ఆయోగ్ సమావేశానికి నితీశ్ కుమార్ రాకపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆయన హాజరు కాలేదు. అప్పటి ఉప ముఖ్యమంత్రి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సారి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు వెళ్లారు. నీతి ఆయోగ్‌లో సభ్యులుగా ఉన్న నలుగురు కేంద్ర మంత్రులూ బిహార్‌కి చెందిన వాళ్లే. దీనిపై అనవసరపు వాదనలు చేయొద్దు"

- నీరజ్ కుమార్, జేడీయూ ప్రతినిధి

వికసిత్ భారత్ @ 2047 అజెండాతో ఈ సమావేశాన్ని నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. ఇంత కీలకమైన భేటీకి నితీశ్ వెళ్లకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేక హోదా విషయంలో ఆయన కాస్త అసహనంగా ఉన్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే..ఇటీవల ఆయనను మీడియా ఇదే అంశంపై ప్రశ్నించింది. "ప్రత్యేక హోదా సంగతేంటి" అని ప్రశ్నించగా అందుకు నితీశ్ ఆసక్తికర సమాధానమిచ్చారు. "మెల్లగా అన్నీ మీకే అర్థమవుతాయి" అని వెల్లడించారు. అంటే...బిహార్‌కి కేంద్రం ఇంకేదో చేయబోతోందన్న హింట్ ఇచ్చారు. అప్పటి నుంచి నితీశ్ మళ్లీ NDA నుంచి జంప్ అవుతారన్న వార్తలూ వస్తున్నాయి. ఓ కూటమి నుంచి మరో కూటమిలోకి జంప్ కావడం నితీశ్‌కి కొత్తేమీ కాదు. లోక్‌సభ ఎన్నికల ముందు ఇండీ అలియన్స్‌ని వీడి NDAలో చేరారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అందుకే ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రత్యేక హోదా డిమాండ్‌ ఈ సారి కచ్చితంగా నెరవేరుతుందని అంతా భావించారు. కానీ కేంద్రం ఆ ఆలోచనే లేదని తేల్చి చెప్పింది. అందుకు బదులుగా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. 

Also Read: Viral Video: ఇలా చేస్తే మీరు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు - ఈయన సలహా విన్నారా?

 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pahalgam Tourist Attack: పహల్గాం ఉగ్రదాడి ఘటన, కాల్పులు జరిపిన ఓ టెర్రరిస్ట్ ఫస్ట్ ఫొటో వైరల్- మొత్తం నలుగురు పాక్ టెర్రరిస్టులు
పహల్గాం ఉగ్రదాడి ఘటన, కాల్పులు జరిపిన ఓ టెర్రరిస్ట్ ఫస్ట్ ఫొటో వైరల్- మొత్తం నలుగురు పాక్ టెర్రరిస్టులు
Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
Pahalgam Terror Attack: కశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన టాలీవుడ్... చిరు, మహేష్ నుంచి బన్నీ, ఎన్టీఆర్, చరణ్ వరకు
కశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన టాలీవుడ్... చిరు, మహేష్ నుంచి బన్నీ, ఎన్టీఆర్, చరణ్ వరకు
PM Modi : ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KL Rahul vs Rishabh Pant | సంజీవ్ Goenka అనుకున్నది ఒకటి..అయినది ఒకటిKL Rahul Ignored LSG Owner Goenka | రాహుల్ కి ఇంకా కోపం లేదు..తిట్టారనే కసి మీదే ఉన్నట్లున్నాడుLSG vs DC Match Highlights IPL 2025 | లక్నో సూపర్ జెయింట్స్ పై 8వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం | ABP DesamGujarat Titans Winning Strategy IPL 2025 | టాప్ లో ఉంటే చాలు..ఇంకేం అవసరం లేదంటున్న గుజరాత్ టైటాన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pahalgam Tourist Attack: పహల్గాం ఉగ్రదాడి ఘటన, కాల్పులు జరిపిన ఓ టెర్రరిస్ట్ ఫస్ట్ ఫొటో వైరల్- మొత్తం నలుగురు పాక్ టెర్రరిస్టులు
పహల్గాం ఉగ్రదాడి ఘటన, కాల్పులు జరిపిన ఓ టెర్రరిస్ట్ ఫస్ట్ ఫొటో వైరల్- మొత్తం నలుగురు పాక్ టెర్రరిస్టులు
Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
Pahalgam Terror Attack: కశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన టాలీవుడ్... చిరు, మహేష్ నుంచి బన్నీ, ఎన్టీఆర్, చరణ్ వరకు
కశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన టాలీవుడ్... చిరు, మహేష్ నుంచి బన్నీ, ఎన్టీఆర్, చరణ్ వరకు
PM Modi : ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
AP Liquor Scam: రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
AP SSC Results 2025 on Whatsapp : వాట్సాప్‌లో ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు ఇలా చూసుకోండి 
వాట్సాప్‌లో ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు ఇలా చూసుకోండి 
Allu Arjun: అల్లు అర్జున్ కోసం లుక్ టెస్ట్... 'పుష్ప' నుంచి బయటకు రావాలని... అట్లీ ఏం చేస్తాడో?
అల్లు అర్జున్ కోసం లుక్ టెస్ట్... 'పుష్ప' నుంచి బయటకు రావాలని... అట్లీ ఏం చేస్తాడో?
Pahalgam Terror Attack: కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
Embed widget