అన్వేషించండి

Lok Sabha Elections 2024: ఎగ్జిట్ పోల్ డిబేట్ లకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయం, కారణం ఇదే !

Lok Sabha Elections 2024: ఎగ్జిట్ పోల్ డిబేట్లలో పాల్గొనకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ పార్టీ నేత పవన్ ఖేడా ట్విట్టర్లో కాంగ్రెస్ పెద్ద ల నిర్ణయాన్ని ప్రకటించారు.

Lok Sabha Elections 2024 : 2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశకు జూన్ 1న ఓటింగ్ జరగనుంది. అంతకుముందు దేశవ్యాప్తంగా ఆరు దశల్లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరిగింది. ఏడవ  దశ ఓటింగ్ తర్వాత శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. దీనికి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పెద్ద ప్రకటన చేసింది. ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించి టీవీ ఛానళ్లలో చర్చలో పాల్గొనకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. జూన్ 1న ఎగ్జిట్ పోల్‌కు సంబంధించిన టెలివిజన్ ఛానెళ్లలో చర్చల్లో పాల్గొనబోమని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ శుక్రవారం తెలిపింది. జూన్ 4 నుంచి జరిగే చర్చల్లో కాంగ్రెస్ పాల్గొంటుందని పార్టీ మీడియా విభాగం అధినేత పవన్ ఖేడా ప్రకటించారు.  ఫలితాలకు ముందు (జూన్ 4) ఊహాగానాలలో మునిగిపోవాలని కాంగ్రెస్ కోరుకోవడం లేదని, పవన్ ఖేడా ట్విట్టర్ లో రాబోయే ఎగ్జిట్ పోల్ డిబేట్లలో పాల్గొనకూడదనే పార్టీ నిర్ణయంపై పార్టీ ప్రకటనను రాసుకొచ్చారు.

ఈ సందర్భంగా పవన్ ఖేడా మాట్లాడుతూ, 'ఓటర్లు తమ ఓటు వేశారు. ఓటింగ్ ఫలితాలను మిషన్ లలో లాక్ చేశారు. జూన్ 4న ఫలితాలు అందరి ముందుకు రానున్నాయి.  ఫలితాలు వెలువడకముందే డిబేట్లలో పాల్గొని టీఆర్‌పీ గేమ్‌ ఆడడం కాంగ్రెస్‌ దృష్టిలో సమర్థనీయం కాదు. జూన్ 4 నుంచి మళ్లీ చర్చలో కాంగ్రెస్ పార్టీ సంతోషంగా పాల్గొంటుంది’ అన్నారు. శనివారం నాటికి చివరి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ పూర్తికానున్న సంగతి తెలిసిందే. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఎగ్జిట్ పోల్‌కు సంబంధించి ఈసీ  సూచనలు
ఎలక్ట్రానిక్, ప్రింట్, ఇతర అన్ని రకాల ప్రచార మాధ్యమాలకు ఎన్నికల సంఘం ప్రత్యేక సూచనలు చేసింది. శనివారం లోక్‌సభ ఎన్నికల చివరి దశ ఓటింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే వారు ఎగ్జిట్ పోల్‌లను ప్రసారం చేయవచ్చు. 18వ లోక్‌సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గత మార్చిలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను కమిషన్ ఉదహరించింది. ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుండి జూన్ 1 సాయంత్రం 6.30 గంటల వరకు అన్ని మీడియా ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రచారం చేయకుండా నిషేధం ఉంటుందని తెలిపింది. శనివారం సాయంత్రం 6:30 గంటల వరకు అన్ని రకాల ఎగ్జిట్ పోల్స్ ప్రచారంపై నిషేధం ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది.  

57లోక్ సభ స్థానాలకు ఎన్నికలు
 లోక్‌సభ ఎన్నికల చివరి దశ, ఏడు రాష్ట్రాలు,  ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 57 లోక్‌సభ స్థానాలకు జూన్ 1న ఓటింగ్ జరగనుంది. ఈ దశలో బీహార్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో పోలింగ్ జరుగుతోంది. ఈ దశ ఓటింగ్‌తో ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమైన అన్ని దశల ఎన్నికల ఓటింగ్ పూర్తవుతుంది.  ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అన్ని స్థానాలకు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇప్పటికే 486 లోక్‌సభ స్థానాలకు 6 దశల్లో ఓటింగ్ జరిగింది.

టాప్ హెడ్ లైన్స్

West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Breaking News:
"విద్యార్థులపై కాల్పులు జరిపించింది హోంమంత్రే" లోక్‌సభలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Anti Paper Leak Amendment Bill 2026 Passed : పేపర్ లీకులకు ఇక చెక్ - లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు–2026 ఆమోదం - కేంద్ర మంత్రి కీలక ప్రకటన
పేపర్ లీకులకు ఇక చెక్ - లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు–2026 ఆమోదం - కేంద్ర మంత్రి కీలక ప్రకటన
IPL Brand Value: క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Embed widget