అన్వేషించండి

Road Accident: రోడ్డు ప్రమాదంలో ఎంపీటీసీ దంపతుల మృతి..

అబ్దుల్లాపూర్‌మెట్ ఓఆర్ఆర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఎంపీటీసీ దొంతం కవిత, ఆమె భర్త వేణు గోపాల్ రెడ్డిగా గుర్తించారు.

అబ్దుల్లాపూర్‌మెట్ ఓఆర్ఆర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ సడెన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న స్కార్పియో వాహనం బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ దాటాక యూ టర్న్ వద్ద మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం తానేదార్ పల్లికి చెందిన ఎంపీటీసీ దొంతం కవిత, ఆమె భర్త వేణు గోపాల్ రెడ్డిగా గుర్తించారు.

బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కవిత దంపతులు రాత్రి 8 గంటల సమయంలో నల్లగొండ నుండి హైదరాబాద్ బయల్దేరారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై వెళ్తుండగా.. ముందు వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో వీరి కారు టిప్పర్ ను బలంగా ఢీకొంది. ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

వారం కిందటే కూతురు వివాహం..
ఎంపీటీసీ కవిత దంపతులు వారం రోజుల కిందటే నల్లగొండలో తమ కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. అంతలోనే రోడ్డు ప్రమాదంలో దంపతులిద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. వీరు నివాసం ఉండే నల్లగొండలోని స్వర్ణ ప్యాలెస్ తో పాటు స్వగ్రామం అనిశెట్టి దుప్పలపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కవిత దంపతుల మృతి పట్ల స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

బోటి కూర కోసం మందుబాబు రచ్చ..

మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు రచ్చ రచ్చ చేశాడు. బోటి కూర కావాలని వైన్ షాప్ నిర్వాహకుడిని అడిగాడు. అతడు కూర తెచ్చి ఇవ్వగా... వేడిగా లేదు, వేడి చేసి మళ్లీ తీసుకురమ్మని చెప్పాడు. మద్యం మత్తులో గట్టిగా అరుస్తూ కేకలు పెట్టాడు. కూర తీసుకురానుందుకు వేడి వేడి నూనెను నిర్వాహకుడిపై పోశాడు. ఈ ఘటన నాచారం ఠాణా పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్‌లోని ఓ వైన్స్‌ పర్మిట్‌ రూంలో మీర్‌పేట్‌ హెచ్‌బీ కాలనీకి చెందిన ధర్మేందర్‌ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. 

Read More: Hyderabad News: బోటి కూర కోసం మందుబాబు రచ్చరచ్చ.. వేడి వేడిగా ఇవ్వలేదంటూ కాగుతున్న నూనె పోసి దాడి..

Also Read: Warangal Crime: వరంగల్‌లో దారుణం.. సొంత అన్న ఫ్యామిలీపై కత్తులతో దాడి.. ముగ్గురు అక్కడికక్కడే మృతి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Womens World Cup 2025: భారత్‌ను కట్టడి చేసిన పాక్.. 247 పరుగులకు ఆలౌట్.. చివర్లో రీచా ఘోష్ మెరుపులు
భారత్‌ను కట్టడి చేసిన పాక్.. 247 పరుగులకు ఆలౌట్.. చివర్లో రీచా ఘోష్ మెరుపులు
Tirumala Darshan Update: తిరుమలలో వృద్ధుల దర్శనంపై వదంతులు నమ్మొద్దు.. శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
తిరుమలలో వృద్ధుల దర్శనంపై వదంతులు నమ్మొద్దు.. శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
KTR Fires on RTC Charges Hike: కాంగ్రెస్‌ను ఓడించారనే కక్షతో హైదరాబాద్‌లో ఆర్టీసీ ఛార్జీలు పెంపు, పండుగ పూట దుర్మార్గం: కేటీఆర్
కాంగ్రెస్‌ను ఓడించారనే కక్షతో హైదరాబాద్‌లో ఆర్టీసీ ఛార్జీలు పెంపు: కేటీఆర్
Vijay Deverakonda: రష్మికతో ఎంగేజ్మెంట్ వార్తలు! - ఫస్ట్ టైం ఆ ఆలయానికి విజయ్ దేవరకొండ
రష్మికతో ఎంగేజ్మెంట్ వార్తలు! - ఫస్ట్ టైం ఆ ఆలయానికి విజయ్ దేవరకొండ
Advertisement

వీడియోలు

Surya Kumar Yadav as T20 Captain | టీ20 కెప్టెన్ గా కొనసాగనున్న సూర్య కుమార్ యాదవ్
Rohit Sharma Virat Kohli 2027 ODI World Cup | చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కీలక ప్రకటన
India vs West Indies Test Match Day 3 | విండీస్‌పై ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో భారత్ విజయం
Perplexity AI CEO Aravind Srinivas Biography | 30ఏళ్ల వయస్సుకే AI ప్రపంచాన్ని శాసిస్తున్న ఇండియన్ | ABP Desam
India vs West Indies Test Match Record Breaking Centuries | ఆహ్మదాబాద్‌ టెస్ట్‌పై పట్టుబిగించిన భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Womens World Cup 2025: భారత్‌ను కట్టడి చేసిన పాక్.. 247 పరుగులకు ఆలౌట్.. చివర్లో రీచా ఘోష్ మెరుపులు
భారత్‌ను కట్టడి చేసిన పాక్.. 247 పరుగులకు ఆలౌట్.. చివర్లో రీచా ఘోష్ మెరుపులు
Tirumala Darshan Update: తిరుమలలో వృద్ధుల దర్శనంపై వదంతులు నమ్మొద్దు.. శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
తిరుమలలో వృద్ధుల దర్శనంపై వదంతులు నమ్మొద్దు.. శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
KTR Fires on RTC Charges Hike: కాంగ్రెస్‌ను ఓడించారనే కక్షతో హైదరాబాద్‌లో ఆర్టీసీ ఛార్జీలు పెంపు, పండుగ పూట దుర్మార్గం: కేటీఆర్
కాంగ్రెస్‌ను ఓడించారనే కక్షతో హైదరాబాద్‌లో ఆర్టీసీ ఛార్జీలు పెంపు: కేటీఆర్
Vijay Deverakonda: రష్మికతో ఎంగేజ్మెంట్ వార్తలు! - ఫస్ట్ టైం ఆ ఆలయానికి విజయ్ దేవరకొండ
రష్మికతో ఎంగేజ్మెంట్ వార్తలు! - ఫస్ట్ టైం ఆ ఆలయానికి విజయ్ దేవరకొండ
New Challan Rules: ట్రాఫిక్‌ చలాన్లను లైట్‌గా తీసుకోవద్దు మామా - 5 దాటితే లైసెన్సు రద్దు, వాహనం స్వాధీనం!
5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే లైసెన్స్‌ రద్దు - రోడ్డు రూల్స్‌లో సీరియస్‌ మార్పులు
Visakhapatnam Beach: విశాఖపట్నంలో విషాదం, యారాడ బీచ్‌లో ఇటలీ పర్యాటకుడు మృతి
విశాఖపట్నంలో విషాదం, యారాడ బీచ్‌లో ఇటలీ పర్యాటకుడు మృతి
FASTag లేకుంటే డబుల్‌ టోల్‌ ఫీజు - UPI ఉంటే మీ డబ్బు సేవ్‌, నవంబర్‌ 15 నుంచి
FASTag లేకుండా టోల్‌ కట్టాలంటే డబుల్‌ ఫీజు - UPI తో సగం ఖర్చే!
Air India: ఎయిరిండియా విమానంలో తెరుచుకున్న ‘ర్యాట్’.. బర్మింగ్‌హామ్– న్యూఢిల్లీ విమానం రద్దు
ఎయిరిండియా విమానంలో తెరుచుకున్న ‘ర్యాట్’.. బర్మింగ్‌హామ్– న్యూఢిల్లీ విమానం రద్దు
Embed widget