అన్వేషించండి

ఐసిస్‌-కే ఉగ్రసంస్థ రష్యాని ఎందుకు టార్గెట్ చేసింది? పుతిన్‌పై అంత కోపమెందుకు?

Moscow Concert Hall Attack: ఐసిస్‌ కే సంస్థ రష్యాని టార్గెట్ చేయడంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.

Moscow Concert Hall Attack News: రష్యాలోని మాస్కోలో కాన్సర్ట్ హాల్‌లో జరిగిన ఉగ్రదాడి అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. మిలిటరీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే..ఈ దాడి చేసింది తామేనని ISIS-K ప్రకటించడమే మరింత అలజడి పెంచింది. అఫ్గనిస్థాన్‌లోని ఐసిస్‌కి అనుబంధ సంస్థే ఈ ఐసిస్‌-కే. సిరియా, ఇరాక్‌ నుంచి ఈ గ్రూప్‌ని ఆపరేట్ చేస్తున్నారు. అమెరికాతో పాటు సౌత్, సెంట్రల్ ఏసియా దేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటుంది ఈ ఉగ్రసంస్థ. అఫ్గాన్‌లోని ఐసిస్ బ్రాంచ్‌నే ఐసిస్‌-కే గా పిలుస్తారు. ఇరాన్, తుర్క్‌మెనిస్థాన్, అఫ్గనిస్థాన్ ప్రాంతాన్ని కలిపి ఒకప్పుడు Khorasan గా పిలిచేవాళ్లు. అదే పేరుతో ప్రత్యేకంగా ఇక్కడ యూనిట్‌ని ఏర్పాటు చేసుకుంది ఐసిస్.

తూర్పు అఫ్గనిస్థాన్‌లో 2014లో మొదలై నరమేధం సృష్టిస్తోంది. పాకిస్థాన్, అఫ్గనిస్థాన్‌ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలకు ప్లాన్ చేసుకుంటోంది. 2015 లో ఐసిస్‌ డామినేషన్ విపరీతంగా ఉండేది. ఆ సమయంలోనే అఫ్గనిస్థాన్, పాకిస్థాన్ నుంచి ISIS-K పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకుంది. ఐసిస్ సిద్ధాంతాల్ని తు.చ. తప్పకుండా పాటించడమే కాకుండా...అంత కన్నా దారుణంగా తయారైందీ సంస్థ. అఫ్గనిస్థాన్‌లో నెట్‌వర్క్‌ని పెంచుకుంది. 2019లో తమకు ప్రత్యేక పాకిస్థాన్‌ ఉందని ప్రకటించుకుంది. వాళ్ల ఆధిపత్యం ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా తమకే సొంతం అని తేల్చి చెప్పింది. మొత్తం 3 వేల మంది సైన్యాన్ని తయారు చేసుకుంది. అటు అమెరికాతో పాటు అఫ్గాన్ మిలిటరీ బలగాల దాడుల్ని తట్టుకుని నిలబడగలిగింది. ఈ దాడుల్లో కొంతమంది సభ్యుల్ని కోల్పోయినా రక్తపాతాన్ని మాత్రం ఆపలేదు. 

స్కూళ్లు, హాస్పిటల్స్‌పై దాడులు..

అఫ్గన్ భద్రతా బలగాలు, రాజకీయ నాయకులు, షియా ముస్లింలు, సిక్కులతో పాటు నాటో దళాలనూ లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది ఐసిస్‌-కే. ముఖ్యంగా స్కూళ్లు, హాస్పిటల్స్‌పై దాడులు చేస్తూ వస్తోంది. హాస్పిటల్స్‌లోని మెటర్నరీ వార్డ్‌లోకి దూసుకెళ్లి అత్యంత కిరాతకంగా అక్కడి వాళ్లందరినీ కాల్చి చంపిన ఘటనలు చాలానే ఉన్నాయి. 2017 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 100 దాడులు చేసిందీ సంస్థ. అఫ్గనిస్థాన్, పాకిస్థాన్‌లోని సాధారన ప్రజల్నే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. అటు అమెరికా, అఫ్గాన్, పాకిస్థాన్ భద్రతా బలగాలతోనూ తరచూ తలపడుతోంది. 2018 నాటికి ప్రపంచంలోనే అత్యంత కిరాతకమైన ఉగ్ర సంస్థల్లో ఒకటిగా నిలిచింది. 100 మిలియన్ డాలర్లకు పైగా నిధుల్ని రాబట్టుకోగలిగింది. గతేడాది ఇరాన్‌లో బాంబు దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 100 మంది చనిపోయారు. అంతకు ముందు 2022 సెప్టెంబర్‌లో కాబూల్‌లోని రష్యా ఎంబసీ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడి వెనక ఉన్నదీ ఈ సంస్థే. 2021లో కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో 13 మంది అమెరికా సైనికులు మృతి చెందారు. 

రష్యాపై దాడి ఎందుకు..? 

ఈ ఉగ్రసంస్థ పతనం 2021 నుంచి మొదలైంది. అమెరికా బలగాల చేతిలో ఐసిస్‌-కే కి చెందిన కీలక వ్యక్తి హతమయ్యాడు. 2019,2020 నాటికి ఈ సంస్థ కాస్త బలహీనపడింది. సరైన నాయకత్వం లేక ఉగ్రకార్యకలాపాల్ని తగ్గించింది. అటు తాలిబన్లతోనూ సైద్ధాంతిక విభేదాలొచ్చాయి. తాలిబన్ల ఆధిపత్యాన్ని ఐసిస్‌-కే అంగీకరించలేదు. అయితే..అప్పటికే నాయకత్వం లేక నీరుగారిపోయిన ఐసిస్‌-కేని అమెరికా బలగాలు మరింత అణిచివేశాయి. ఫలితంగా దాదాపు 1,400 మంది ఉగ్రవాదులు అఫ్గాన్ ప్రభుత్వానికి లొంగిపోయారు. ఇప్పుడు మళ్లీ తమ ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే రష్యాలోని మాస్కోలో దాడి చేసింది. రష్యానే టార్గెట్‌గా చేసుకోడానికీ కారణముంది. ఎన్నో ఏళ్లుగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తీవ్ర అసహనంతో ఉందీ సంస్థ. ముస్లింలను అణిచివేసేందుకు పుతిన్ సహకరిస్తున్నారని భావిస్తోంది ఐసిస్‌-కే. మధ్యాసియా మిలిటెంట్స్‌ సహకారంతో ముస్లింలను పూర్తిగా అణగదొక్కుతున్నారన్న అసహనంతోనే ఈ దాడి చేసినట్టు సమాచారం. అంతే కాదు. అఫ్గనిస్థాన్‌కే పరిమితం కాకుండా అంతర్జాతీయంగా తమ ఉనికి ఉందని చెప్పుకోడానికి ఈ దాడి చేసినట్టుగా కూడా తెలుస్తోంది.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Petrol Manufacturing Process:పెట్రోల్ బంక్ వరకు చేరే ఇంధనం వెనుక రహస్యాలేంటి? ముడి చమురు నుంచి పెట్రోల్ తయారీ ప్రక్రియ ఏంటీ?
భూమిలోంచి మీ బైక్‌ ట్యాంక్ వరకు... ఆ నల్ల బంగారం పెట్రోల్‌గా ఎలా మారుతుందో తెలుసా?
IPL 2026: ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
Uttam Kumar Reddy: తగినంత స్టాక్ అందుబాటులో.. LPG సిలిండర్లకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
తగినంత స్టాక్ అందుబాటులో.. LPG సిలిండర్లకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
Tamil Nadu Assembly Elections 2026: కొత్త పార్టీతో వచ్చేసిన శశికళ - తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు
కొత్త పార్టీతో వచ్చేసిన శశికళ - తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు

వీడియోలు

Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Josh Hazlewood to Miss IPL 2026 | ఐపీఎల్ 2026కు స్టార్ పేసర్ దూరం? | ABP Desam
Surya Kumar Yadav Apologizes to Axar Patel | అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య | ABP Desam
Did Dhoni Ruin Yuvraj Singh’s Career? | యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడా? | ABP Desam
IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Formation Day: గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
Womens History Month.. తీర్మానంపై ట్రంప్ సంతకాలు
Womens History Month.. తీర్మానంపై ట్రంప్ సంతకాలు
Ustaad Bhagat Singh Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
Farmer admired by CM Chandrababu: ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
Aaya Sher Song: ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
KTR Letter to Amit Shah: రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
Embed widget