అన్వేషించండి

Morbi Bridge Collapse: మోర్బి బాధితులకు మీరిచ్చే పరిహారం ఏ మూలకూ రాదు - ప్రభుత్వంపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం

Morbi Bridge Collapse: మోర్బి ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు అందించే పరిహారం చాలదని గుజరాత్ హైకోర్టు వ్యాఖ్యానించింది.

Gujarat HC Slams Bhupendra Patel:

పరిహారం చాలదు: హైకోర్టు

గుజరాత్‌లో మోర్బి వంతెన కూలిన ఘటనలో 135 మంది మృతి చెందారు. వీరి కుటుంబాలకు పరిహారం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే...చాలా తక్కువ మొత్తం వారికి అందిందని తెలుస్తోంది. దీనిపై గుజరాత్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. భూపేంద్ర పటేల్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. "సరైన పరిహారం అందజేయడం అత్యవసరం" అని వ్యాఖ్యానించింది. "తీవ్రంగా గాయ పడిన వారికి ఇచ్చిన ఆ పరిహారం కూడా చాలనే చాలదు" అని స్పష్టం చేసింది. పరిహారం అందజేసే విషయంలో ప్రభుత్వం విధానమేంటో స్పష్టంగా ఓ అఫిడవిట్‌ రూపంలో కోర్టుకి సమర్పించాలని చెప్పింది. అక్టోబర్ 30న ఈ ప్రమాదం జరగ్గా..ఆ రోజే ప్రభుత్వం మృతుల కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు సీఎం భూపేంద్ర పటేల్. గాయపడిన వారికి వైద్యం ఖర్చుల కోసం రూ.50,000 అందజేస్తామని చెప్పారు. అయితే...ఈ పరిహారం ఎంత మాత్రం చాలదని గుజరాత్ హైకోర్ట్ వ్యాఖ్యానించింది.  అంతే కాదు. రాష్ట్రంలోని అన్ని బ్రిడ్జ్‌లు సరిగా ఉన్నాయో లేదో సర్వే చేపట్టాలని ఆదేశించింది. 

ఫోరెన్సిక్ ల్యాబ్‌ రిపోర్ట్‌..

ఇటీవల ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్‌లో ఈ ఘటనకు సంబంధించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదం జరిగిన రోజు...బ్రిడ్జ్‌ను మెయింటేన్ చేసే Oreva Group 3వేలకు పైగా టికెట్లు అమ్మినట్టు తేలింది. అక్టోబర్ 30వ తేదీనే దాదాపు 3,165 టికెట్లు విక్రయించినట్టు లెక్కలు చెబుతున్నాయి. టికెట్ బుకింగ్ ఆఫీస్‌కి, సిబ్బందికి ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. కేవలం 125 మందిని మాత్రమే మోయగలిగే బ్రిడ్జ్‌పైకి 250-300 మంది వెళ్లేందుకు అనుమతినిచ్చారు. ఆ బరువు తట్టుకోలేక కేబుల్స్ తెగిపోయాయి. ఉన్నట్టుండి జనమంతా నీళ్లలోకి పడిపోయారు. కొందరిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగినా...ప్రాణనష్టం మాత్రంబాగానే జరిగింది. 

సుప్రీం ఆదేశాలు..

గుజరాత్ మోర్బి కేసుపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ కేసులో విచారణ ఎలా జరుగుతోందో పరిశీలించాని గుజరాత్ హైకోర్టుకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన మిగతా అన్ని వివరాలపైనా దృష్టి సారించాలని తేల్చి చెప్పింది. అడ్వకేట్ విశాల్ తివారీ వేసిన పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం...ఈ వ్యాఖ్యలు చేసింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌, జస్టిస్ హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం...పూర్తి బాధ్యతను గుజరాత్ హైకోర్టుకే అప్పగించింది. ఇలాంటి ప్రమాదాలు ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు అడ్వకేట్ విశాల్. నవంబర్ 1న అత్యవసర పిటిషన్‌ల జాబితాలో దీన్ని చేర్చారు. త్వరలోనే విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు అప్పుడే హామీ ఇచ్చింది. "దాదాపు దశాబ్ద కాలంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం, పనిపై శ్రద్ధ లేకపోవడం లాంటి కారణాల వల్ల పెద్ద ఎత్తున ప్రాణనష్టం వాటిల్లుతోంది. వీటిని తప్పకుండా అరికట్టాల్సిందే" అని పిటిషన్‌లో ప్రస్తావించారు. 

Also Read: Watch Video: ఇయర్ ఫోన్స్ ఆర్డర్ చేస్తే అంతా "బిస్కెట్" అయింది - వైరల్ వీడియో

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
Kaantha OTT : ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
iPhone 16 Discount: ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. iPhone 16 పై బిగ్ డిస్కౌంట్, 27,000 కంటే ఎక్కువ తగ్గింపు
ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. iPhone 16 పై బిగ్ డిస్కౌంట్, 27,000 కంటే ఎక్కువ తగ్గింపు
Rammohan Naidu: ఇండిగో తరహా సంక్షోభాలు భవిష్యత్ లో రాకుండా కఠినచర్యలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
ఇండిగో తరహా సంక్షోభాలు భవిష్యత్ లో రాకుండా కఠినచర్యలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
Embed widget