అన్వేషించండి

Maharashtra News: అండర్‌గ్రౌండ్ నుంచి వింత శబ్దాలు, భూకంప భయంతో పరుగులు పెట్టిన స్థానికులు

Maharashtra News: మహారాష్ట్రలోని లతూర్ జిల్లాలో అండర్‌గ్రౌండ్ నుంచి వింత శబ్దాలు వినిపించాయి.

 Maharashtra News:

మహారాష్ట్రలో ఘటన..

భూకంప ధాటికి టర్కీ, సిరియా వణికిపోయాయి. ఇప్పటికీ అక్కడక్కడా భూమి కంపిస్తూనే ఉంది. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో లెక్కే లేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయినా ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంగానే గడుపుతున్నారంతా. ఇండియాలోనూ పలు చోట్ల స్వల్ప భూకంపం నమోదైన నేపథ్యంలో ఇక్కడా ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో లతూర్ సిటీలో వింత శబ్దాలు వినిపించడం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. భూగర్భం నుంచి వింత శబ్దాలు వినిపించాయి. ఫలితంగా...అందరూ భూకంపం వస్తుందేమోనని వణికిపోయారు. అదృష్టవశాత్తూ భూకంపం నమోదు కాలేదు. బుధవారం వివేకానంద చౌక్ వద్ద ఉదయం 10.30 - 10.45 మధ్య ఈ శబ్దాలు వినిపించాయి. భూకంపం వస్తుందేమోనని అంతా పరుగులు పెట్టారు. వెంటనే స్థానిక అధికారులను అలెర్ట్ చేశారు. డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం అప్రమత్తమైంది. అయితే...ఎలాంటి భూకంపం నమోదు కాలేదని వెల్లడించింది. ఇక్కడి ప్రజలు అంతగా భయపడిపోవడానికి ఓ కారణముంది. 1993లో  ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న కిల్లారి గ్రామంలో భారీ భూకంపం వచ్చింది. ఆ ప్రమాదంలో దాదాపు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ ఈ నెల 4వ తేదీన అలాంటి శబ్దాలు వినిపించడం వల్ల భయపడ్డారు. 
 
భారత్ సేఫేనా..? 

ఈ క్రమంలోనే భూకంపాల విషయంలో భారత్ ఎంత వరకూ సేఫ్ అనే డిబేట్ మొదలైంది. అయితే ప్రభుత్వాలు ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే..భారత్‌లో 59% మేర భూమి కంపించే ప్రమాదం ఉందని తేలింది. 8 రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలూ "రిస్క్ జోన్‌"లో ఉన్నట్టు వెల్లడైంది. వీటిని ప్రభుత్వం హై రిస్క్ కింద "Zone-5"లో చేర్చింది. ఢిల్లీలోని NCR ప్రాంతం Zone-4లో ఉంది. 2021లో లోక్‌సభలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్‌ ఈ విషయం వెల్లడించారు. 59% మేర భూమి ప్రమాదకర స్థితిలో ఉందని వివరించారు. సెసిమిక్ జోన్ ఆధారంగా, తీవ్రతను బట్టి జోన్‌లుగా విభజించినట్టు చెప్పారు. Zone-5 "అత్యంత ప్రమాదకర స్థితి"గా పరిగణిస్తారు. అంటే...ఈ జోన్‌లో ఉన్న ప్రాంతాలకు భూకంప ముప్పు ఎక్కువగా ఉంటుంది. Zone-2లో ఉన్న ప్రాంతాల్లో భూకంపాలు వచ్చే అవకాశం తక్కువ. అయితే...భారత్‌లోని 11% మేర నేల Zone-5లోనే ఉంది. 18% Zone-4, Zone 3 లో 30% అవకాశాలున్నట్టు కేంద్రం వివరించింది. 

హై రిస్క్‌లో హిమాలయా ప్రాంతం..

అత్యంత ఎక్కువగా రిస్క్ ఉంది హిమాలయా ప్రాంతంలోనే. 1905లో కంగ్రా ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఆ తరవాత 1934లో బిహార్-నేపాల్‌లోనూ ఇదే జరిగింది. ఆ సమయంలో రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 8.2గా నమోదైంది. దాదాపు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 1991లో ఉత్తరకాశీలో సంభవించిన భూకంపానికి 800 మంది చనిపోయారు. ఆ తరవాత 2005లో కశ్మీర్‌లో భూకంపం రాగా...ఈ ప్రమాదంలో 80 వేల మంది మృతి చెందారు. కేంద్రం వివరించిన సెసిమిక్‌ జోన్స్‌లో సోహ్‌నా, మధుర, ఢిల్లీ, మొరాదాబాద్ ప్రాంతాలున్నాయి. గుర్‌గామ్‌ మరీ ప్రమాదకర స్థితిలో ఉందని హెచ్చరించింది. 

Also Read: Cheetahs in India: సౌతాఫ్రికా నుంచి భారత్‌కు మరో 12 చీతాలు, ఇకపై ఏటా దిగుమతి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రజలకు శుభవార్త- రైతుబజార్లలో తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం విక్రయం: నాదెండ్ల మనోహర్
ఏపీ ప్రజలకు శుభవార్త- రైతుబజార్లలో తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం విక్రయం: నాదెండ్ల మనోహర్
Siddharth: ఆ కండోమ్ యాడ్ నాదే, మాకు అలా చేయమని ఏ సీఎం చెప్పలేదు - హీరో సిద్ధార్థ్ సీరియస్
ఆ కండోమ్ యాడ్ నాదే, మాకు అలా చేయమని ఏ సీఎం చెప్పలేదు - హీరో సిద్ధార్థ్ సీరియస్
TGPSC JL Results: టీజీపీఎస్సీ 'జేఎల్' పరీక్ష ఫలితాలు విడుదల, సబ్జెక్టులవారీగా జనరల్ ర్యాంకింగ్ జాబితాలు ఇలా
టీజీపీఎస్సీ 'జేఎల్' పరీక్ష ఫలితాలు విడుదల, సబ్జెక్టులవారీగా జనరల్ ర్యాంకింగ్ జాబితాలు ఇలా
Pawan Kalyan: పిఠాపురం నుంచే ప్రయోగాత్మకంగా అమలు - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
పిఠాపురం నుంచే ప్రయోగాత్మకంగా అమలు - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Korean Actor Ma Dong-seok with Prabhas in Spirit Movie |Sandeep Reddy vanga ఏం ప్లాన్ చేస్తున్నాడో.!Abhishek Sharma's Maiden T20I Century | మ్యాచ్ ఏదైనా కొట్టుడు ఆపని అభిషేక్ శర్మ | ABP DesamBobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రజలకు శుభవార్త- రైతుబజార్లలో తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం విక్రయం: నాదెండ్ల మనోహర్
ఏపీ ప్రజలకు శుభవార్త- రైతుబజార్లలో తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం విక్రయం: నాదెండ్ల మనోహర్
Siddharth: ఆ కండోమ్ యాడ్ నాదే, మాకు అలా చేయమని ఏ సీఎం చెప్పలేదు - హీరో సిద్ధార్థ్ సీరియస్
ఆ కండోమ్ యాడ్ నాదే, మాకు అలా చేయమని ఏ సీఎం చెప్పలేదు - హీరో సిద్ధార్థ్ సీరియస్
TGPSC JL Results: టీజీపీఎస్సీ 'జేఎల్' పరీక్ష ఫలితాలు విడుదల, సబ్జెక్టులవారీగా జనరల్ ర్యాంకింగ్ జాబితాలు ఇలా
టీజీపీఎస్సీ 'జేఎల్' పరీక్ష ఫలితాలు విడుదల, సబ్జెక్టులవారీగా జనరల్ ర్యాంకింగ్ జాబితాలు ఇలా
Pawan Kalyan: పిఠాపురం నుంచే ప్రయోగాత్మకంగా అమలు - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
పిఠాపురం నుంచే ప్రయోగాత్మకంగా అమలు - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Terrorist Attack: జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రదాడి, నలుగురు జవాన్లు మృతి
జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రదాడి, నలుగురు జవాన్లు మృతి
Anakapally Police: అనకాపల్లి బాలిక హత్య నిందితుడిపై పోలీసుల రివార్డ్! ఆచూకీ చెప్తే నగదు బహుమతి
అనకాపల్లి బాలిక హత్య నిందితుడిపై పోలీసుల రివార్డ్! ఆచూకీ చెప్తే నగదు బహుమతి
Spirit Movie: ‘స్పిరిట్’లో విలన్‌ ఫిక్స్ - ప్రభాస్‌తో తలపడనున్న కొరియన్ స్టార్ హీరో
‘స్పిరిట్’లో విలన్‌ ఫిక్స్ - ప్రభాస్‌తో తలపడనున్న కొరియన్ స్టార్ హీరో
Trains Diverted: ప్రయాణికులకు బిగ్ అలర్ట్ - ఆ తేదీల్లో ఈ రైళ్లు విజయవాడకు రాకుండా దారి మళ్లింపు
ప్రయాణికులకు బిగ్ అలర్ట్ - ఆ తేదీల్లో ఈ రైళ్లు విజయవాడకు రాకుండా దారి మళ్లింపు
Embed widget