అన్వేషించండి

Maharashtra News: అసలైన శివసైనికుడు సీఎం అయ్యాడని, ప్రజలు హ్యాపీగా ఉన్నారు-సీఎం షిండే కామెంట్స్

బాలాసాహెబ్‌ విజన్‌కు అనుగుణంగా అన్ని వర్గాలకూ న్యాయం చేస్తానని సీఎం షిండే హామీ ఇచ్చారు. సీఎం అవుతానని షిండే కూడా ఊహించి ఉండడని శరద్ పవార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

సీఎంగా షిండే...ఎవరూ ఊహించని ట్విస్ట్..

మహారాష్ట్రలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో సీఎం సీటు దక్కించుకున్నారు ఏక్‌నాథ్ షిండే. అసలైన శివసేన ఇదేనని ప్రచారం చేసుకుంటున్నారు. భాజపా ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్‌ ముఖ్యమంత్రి అవుతారని అంతా ఊహించినా అనుకోకుండా చివర్లో ట్విస్ట్ ఇచ్చింది కాషాయ పార్టీ. ఏక్‌నాథ్ షిండేని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఫడణవీస్ డిప్యుటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే గోవా వెళ్లారు షిండే. తనకు మద్దతు తెలిపిన వారందరితోనూ సమావేశమయ్యారు. సీఎంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టిన తొలిరోజే షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "బాలాసాబెబ్ థాక్రే సిద్ధాంతాలు నమ్మే శివసైనిక్‌" ముఖ్యమంత్రి 
అవటం పట్ల మహారాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని అన్నారు. తనకు మద్దతు తెలిపిన ఆ 50 మంది ఎమ్మెల్యేల వల్లే ఇదంతా సాధ్యమైందని వెల్లడించారు. 
 
షిండే కూడా ఊహించి ఉండడు: శరద్ పవార్

ఈ పరిణామాలు జరుగుతుండగానే ప్రతిపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి. ఉపముఖ్యమంత్రి పదవికే పరిమితం చేయటాన్ని దేవేంద్ర ఫడణవీస్ జీర్ణించుకోలేకపోతున్నారని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. "నెంబర్ 2 పొజిషన్‌లో ఉండటం ఫడణవీస్‌కు ఇష్టం లేదు. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ చూస్తేనే అర్థమవుతోంది ఎంత అసంతృప్తితో ఉన్నారో" అంటూ కామెంట్ చేశారు పవార్. ఫడణవీస్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా పని చేశారని, అధిష్ఠానం ఎలా చేయమంటే అలా చేయటం ఆయన పని అని వ్యాఖ్యానించారు. "ఇది నిజంగా సర్‌ప్రైజ్. నాకు తెలిసి రెబల్ ఎమ్మెల్యేలు కూడా తమ లీడర్ సీఎం అవుతారని ఊహించి ఉండరు. మరో సర్‌ప్రైజ్ ఏంటంటే..ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగాపని చేసిన ఫడణవీస్‌కు డిప్యుటీ సీఎం ఇవ్వటం" అని అన్నారు శరద్ పవార్. 

బాలాసాహెబ్ బాటలోనే..

అటు మాజీ ముఖ్యంత్రి ఉద్దవ్ థాక్రే కూడా కొత్త ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. "కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న ఏక్‌నాథ్ షిండేకి, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు అభినందనలు. మహారాష్ట్రకు మంచి చేస్తారని ఆశిస్తున్నాను" అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక సీఎం ఏక్‌నాథ్ షిండే బాధ్యతలు చేపట్టిన వెంటనే క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. రెండ్రోజుల స్పెషల్ సెషన్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటి రోజునే అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నుకోనున్నారు. మహారాష్ట్ర ప్రజలు ఏవైతే ఆశించారో, ఆ పనులన్నింటినీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే షిండే ప్రకటించారు. బాలాసాహెబ్ థాక్రే విజన్‌కు అనుగుణంగా, అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఎలాంటి కామెంట్స్ చేయట్లేదు షిండే. అందరితో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని దాట వేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Indian Railways: అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
Top Selling Hatchback: నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Embed widget