అన్వేషించండి

Kishan Reddy : కేసీఆర్, జగన్ సై అంటే జల వివాదాలపై కిషన్ రెడ్డి మధ్యవర్తిత్వం !

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి కీలక బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జల వివాదాల్ని పరిష్కరిస్తానన్నారు.


తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రులు ఇద్దరూ సిద్ధమైతే తన సహకారం అందిస్తానని ప్రకటించారు.  వివాదాలన్నింటినీ పరిష్కరించేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉందని అందుకే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఏకైకే కేబినెట్ హోదా కలిగిన మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు. కేంద్రం తరపున ఆయన రెండు తెలుగు రాష్ట్రాల మంచి చెడ్డలు చూస్తారు. అందుకే బాధ్యత తీసుకుని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ముందుకు వస్తే పరిష్కరించేందుకు సిద్ధమని ప్రకటించినట్లుగా తెలుస్తోంది. Also Read : నవరంధ్రాలుగా నవరత్నాలు

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఇటీవలి కాలంలో తీవ్ర స్థాయిలో పెరిగిపోయాయి. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను నిర్మించాలని తలపెట్టడం దాన్ని తెలంగాణ వ్యతిరేకించడంతో సమస్య ప్రారంభమయింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం ప్రారంభించారు. దాదాపుగా ప్రతీ అంశంపైనా రెండు తెలుగు రాష్ట్రాలు వరుసగా కృష్ణా బోర్డుకు లేఖలు రాస్తున్నాయి. దీనిపై ఆయా రాష్ట్రాలను కృష్ణాబోర్డు వివరణ కోరుతోంది. ఇది కూడా వివాదాస్పతమవుతోంది. చివరికి గతంలో నీటి పంపకాలపై జరిగిన ఒప్పందాలను కూడా అంగీకరించడానికి తెలంగాణ సిద్ధపడలేదు. కొత్తగా కేటాయింపులు చేయాలని కోరుతోంది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం పాత కేటాయింపులే కొనసాగించాలని కోరుతోంది. ఇటీవల జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలో దీనిపై ఏమి తేల్చారో స్పష్టత లేదు. తమ వాదన వినిపించుకోలేదన్న కారణంగా తెలంగాణ అధికారులు సమావేశాన్ని బాయ్ కాట్ చేసివెళ్లిపోయారు. Also Read : డ్రోన్‌తో మందుల డెలివరీ

కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి రెండు నదీ బోర్డులపై నోటిఫై చేసి గెజిట్ జారీ చేసినప్పటికీ అమలు విషయంలో రెండు ప్రభుత్వాలకూ అభ్యంతరాలు ఉన్నాయి. అన్ని ప్రాజెక్టులనూ బోర్డుల కిందకు తేవడం సరి కాదని వాదిస్తున్నాయి. వివాదం ఉన్న ప్రాజెక్టులను మాత్రమే నోటిఫై చేయాలని కోరుతున్నాయి. కేంద్రం మాత్రం దాదాపుగా అన్ని ప్రాజెక్టుల్ని నోటిఫై చేసింది. నోటిఫై చేయలేదని కొన్ని ప్రాజెక్టులపై వివాదం కూడా ప్రారంభమయింది. ఈ సమస్య రాను రాను జఠిలంగా మారుతోంది. కానీ తగ్గడం లేదు. Also Read : కోర్టుల్లో పోర్టుల అమ్మకం డీల్స్ ! అదానీకి చిక్కులు తప్పవా ?

ఈ కారణంగానే కిషన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించేలా పెద్ద పదవిలో ఉన్నందుకు చొరవ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కిషన్ రెడ్డి మధ్యవర్తిత్వానికి అంగీకరిస్తారా అన్నదే సమస్య. ఎందుకంటే కేసీఆర్, జగన్ మధ్య రాజకీయంగా మంచి స్నేహ సంబంధాలే ఉన్నాయని చెబుతారు. వారిద్దరూ మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఎందుకు మాట్లాడుకోవడం లేదని షర్మిల వరకూ అందరూ విమర్శించారు. మరి ఇప్పుడు కిషన్ రెడ్డి ఆఫర్ ఇస్తే మాత్రం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ముందుకు వస్తారా.? Also Read : గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా.. అదే కారణమా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral News:కోమాలోని మహిళకు పునర్జన్మ ప్రసాదించిన రోడ్డు గుంత! ఇది నిజంగానే మెడికల్‌ మిరాకిల్‌!
కోమాలోని మహిళకు పునర్జన్మ ప్రసాదించిన రోడ్డు గుంత! ఇది నిజంగానే మెడికల్‌ మిరాకిల్‌!
LPG Crisis: గ్యాస్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్! భారత్ వస్తున్న రెండు PNG కార్గోలు, ప్రభుత్వం ఏం చెప్పింది?
గ్యాస్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్! భారత్ వస్తున్న రెండు PNG కార్గోలు, ప్రభుత్వం ఏం చెప్పింది?
Iran War Updates: ఇరాన్ సైన్యం పూర్తిగా నాశనం - యుద్ధం త్వరలోనే ముగుస్తుంది - ట్రంప్ సంచలన ప్రకటన
ఇరాన్ సైన్యం పూర్తిగా నాశనం - యుద్ధం త్వరలోనే ముగుస్తుంది - ట్రంప్ సంచలన ప్రకటన
సర్వం కోల్పోయి కొడుకు మరణం కోరుకున్న తండ్రి.. కన్నీళ్లు పెట్టించే హరీష్ రాణా యూతనేషియా కథ
సర్వం కోల్పోయి కొడుకు మరణం కోరుకున్న తండ్రి.. కన్నీళ్లు పెట్టించే హరీష్ రాణా యూతనేషియా కథ

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
Harish Rana Case : 13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Hansika Divorce : భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Embed widget