అన్వేషించండి

Kerala Train Fire: కేరళలో దారుణం, రైలు ప్రయాణికులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి, చిన్నారి సహా ముగ్గురు మృతి

Kerala Train Fire: రైలు ప్ర‌యాణంలో వివాదం తలెత్తడంతో ఆగ్ర‌హించిన‌ ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కేరళలో జరిగిన ఈ ఘ‌ట‌న‌లో మహిళ సహా ముగ్గురు మరణించారు.

Kerala Train Fire: కేరళలో దారుణ ఘ‌ట‌న జ‌రిగింది. రైలు ప్ర‌యాణంలో వివాదం తలెత్తడంతో ఆగ్ర‌హించిన‌ ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘ‌ట‌న‌లో మహిళ సహా ముగ్గురు మరణించారు. రైలు బోగీకికూడా మంటలు వ్యాపించడంలో ప్రయాణికులు భయభ్రాంతులకు గురై చైన్ లాగి ట్రైన్‌ను నిలిపివేశారు. ఈ క్రమంలో నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిని చికిత్సనిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఆదివారం రాత్రి 9.50 గంటల ప్రాంతంలో కోజికోడ్ రైల్వే స్టేషన్ (ఉత్తరం) నుంచి అలపుజా-కన్నూరు ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరింది. ఎలత్తూరు, కోయిలాండి రైల్వే స్టేషన్ల మధ్య కోరాపుజ రైల్వే వంతెన వద్దకు చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు బ‌య‌లుదేరిన‌ కొద్దిసేప‌టికే డి-1 కోచ్‌లో వివాదం త‌లెత్తి ఆగ్ర‌హానికి గురైన‌ గుర్తు తెలియని వ్యక్తి సహ ప్రయాణికులపై పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో ముగ్గురు మరణించార‌ని ప‌లువురికి గాయాలయ్యాయ‌ని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘ‌ట‌న‌లో ఉగ్ర‌వాద దాడికి సంబంధించిన ఆధారాలేవీ లేవ‌ని వెల్ల‌డించారు.

రైలు ఎక్కే సమయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. సీటు విషయంలో మహిళతో వ్యక్తి గొడవ పడ్డాడు. అయితే బోగీలోని కొందరు ప్రయాణికులు ఆమెకు మద్దతుగా నిల‌వ‌డంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన నిందితుడు.. తన వద్దఉన్న పెట్రోల్ బాటిల్‌ తీసుకొని మహిళా ప్రయాణికురాలిపై పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఓ చిన్నారి, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ముగ్గురూ మరణించారు. రైలు పట్టాలపై నుంచి పసిపాపతో సహా మూడు మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మృతుల్లో ఇద్దరిని తౌఫిక్‌, రెహానాగా గుర్తించారు. మంట‌లు వ్యాపించ‌డంతో కదులుతున్న రైలులో నుంచి వారు భయంతో దూకి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టాల నుంచి మరో బాటిల్ పెట్రోల్, రెండు మొబైల్ ఫోన్‌లు ఉన్న బ్యాగ్‌ని స్వాధీనం చేసుకున్నారు.

మంటలు బోగీకి వ్యాపించడంతో తీవ్ర ఆందోళ‌న‌కు గురైన‌ ప్రయాణీకులు చైన్ లాగి రైలును నిలిపివేశారు. ఈ క్రమంలో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో బోగీలోని తొమ్మిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ స‌మాచారం అందుకున్న రైల్వే ర‌క్ష‌క ద‌ళం (ఆర్పీఎఫ్) బృందం ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని మంటలను అదుపు చేసింది. ఘటనపై ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని రైల్వే పోలీసులు తెలిపారు.

ఘ‌ట‌న అనంత‌రం కోరాపుజా నది వెంబడి ఉన్న వంతెనపై రైలు ఆగిన వెంటనే, ముప్పై ఏళ్ల వయస్సు గల వ్యక్తి దాని నుంచి దూకి తన కోసం వేచి ఉన్న బైక్‌పై పారిపోయాడ‌ని ప్ర‌త్య‌క్ష సాక్షి తెలిపాడు.  ప‌రారైన నిందితుడు ఇత‌ర‌ వ్యక్తుల సహాయంతో బైక్‌పై వెళుతున్న‌ట్టు సీసీ టీవీల్లో గుర్తించిన పోలీసులు ఆ పుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పక్కా ప్రణాళికతో జరిగిన దాడిగా అనుమానిస్తున్నారు.

గుర్తుతెలియని వ్యక్తి మండే స్వ‌భావ‌మున్న ద్రావ‌ణంతో ఉన్న‌ బాటిల్‌ను తీసి సహ ప్రయాణికులపై చ‌ల్లాడ‌ని, వారు స్పందించేలోపే నిప్పంటించి పారిపోయాడని గాయపడిన వారిలో ఒకరు పోలీసులకు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రమాద సమయంలో మహిళ, ఓ చిన్నారి కనిపించకుండా పోయినట్లు గాయపడిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మహిళ ఫోన్, చెప్పుల‌ను పోలీసులు గుర్తించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Petrol Manufacturing Process:పెట్రోల్ బంక్ వరకు చేరే ఇంధనం వెనుక రహస్యాలేంటి? ముడి చమురు నుంచి పెట్రోల్ తయారీ ప్రక్రియ ఏంటీ?
భూమిలోంచి మీ బైక్‌ ట్యాంక్ వరకు... ఆ నల్ల బంగారం పెట్రోల్‌గా ఎలా మారుతుందో తెలుసా?
IPL 2026: ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
Uttam Kumar Reddy: తగినంత స్టాక్ అందుబాటులో.. LPG సిలిండర్లకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
తగినంత స్టాక్ అందుబాటులో.. LPG సిలిండర్లకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
Tamil Nadu Assembly Elections 2026: కొత్త పార్టీతో వచ్చేసిన శశికళ - తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు
కొత్త పార్టీతో వచ్చేసిన శశికళ - తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uttam Kumar Reddy: తగినంత స్టాక్ అందుబాటులో.. LPG సిలిండర్లకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
తగినంత స్టాక్ అందుబాటులో.. LPG సిలిండర్లకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
Madhavi Latha Iftar Flexis: MIM ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను చించివేసిన మాధవీలత, హైదరాబాద్‌లో అగ్గి రాజేశారా !
MIM ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను చించివేసిన మాధవీలత, హైదరాబాద్‌లో అగ్గి రాజేశారా !
AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
CNG Shortage In Hyderabad: హైదరాబాద్‌లో పెరిగిన సీఎన్జీ కష్టాలు, కిలోమీటర్ల మేర భారీ క్యూ లైన్లలో వాహనాలు
హైదరాబాద్‌లో పెరిగిన సీఎన్జీ కష్టాలు, కిలోమీటర్ల మేర భారీ క్యూ లైన్లలో వాహనాలు
Kadapa Crime News: ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
LPG Gas Booking : గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలా? HP, Indane, Bharat గ్యాస్ వినియోగదారులు WhatsApp, SMS, కాల్ ద్వారా ఇలా బుక్ చేయండి
గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలా? HP, Indane, Bharat గ్యాస్ వినియోగదారులు WhatsApp, SMS, కాల్ ద్వారా ఇలా బుక్ చేయండి
Dating App Scams : డేటింగ్ యాప్ స్కామ్స్​తో జాగ్రత్త.. ఆన్‌లైన్ డేటింగ్ చేస్తే ఈ విషయాలు గుర్తుంచుకోండి
డేటింగ్ యాప్ స్కామ్స్​తో జాగ్రత్త.. ఆన్‌లైన్ డేటింగ్ చేస్తే ఈ విషయాలు గుర్తుంచుకోండి
Tamil Nadu Assembly Elections 2026: దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
Embed widget