అన్వేషించండి

Kerala Train Fire: కేరళలో దారుణం, రైలు ప్రయాణికులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి, చిన్నారి సహా ముగ్గురు మృతి

Kerala Train Fire: రైలు ప్ర‌యాణంలో వివాదం తలెత్తడంతో ఆగ్ర‌హించిన‌ ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కేరళలో జరిగిన ఈ ఘ‌ట‌న‌లో మహిళ సహా ముగ్గురు మరణించారు.

Kerala Train Fire: కేరళలో దారుణ ఘ‌ట‌న జ‌రిగింది. రైలు ప్ర‌యాణంలో వివాదం తలెత్తడంతో ఆగ్ర‌హించిన‌ ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘ‌ట‌న‌లో మహిళ సహా ముగ్గురు మరణించారు. రైలు బోగీకికూడా మంటలు వ్యాపించడంలో ప్రయాణికులు భయభ్రాంతులకు గురై చైన్ లాగి ట్రైన్‌ను నిలిపివేశారు. ఈ క్రమంలో నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిని చికిత్సనిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఆదివారం రాత్రి 9.50 గంటల ప్రాంతంలో కోజికోడ్ రైల్వే స్టేషన్ (ఉత్తరం) నుంచి అలపుజా-కన్నూరు ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరింది. ఎలత్తూరు, కోయిలాండి రైల్వే స్టేషన్ల మధ్య కోరాపుజ రైల్వే వంతెన వద్దకు చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు బ‌య‌లుదేరిన‌ కొద్దిసేప‌టికే డి-1 కోచ్‌లో వివాదం త‌లెత్తి ఆగ్ర‌హానికి గురైన‌ గుర్తు తెలియని వ్యక్తి సహ ప్రయాణికులపై పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో ముగ్గురు మరణించార‌ని ప‌లువురికి గాయాలయ్యాయ‌ని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘ‌ట‌న‌లో ఉగ్ర‌వాద దాడికి సంబంధించిన ఆధారాలేవీ లేవ‌ని వెల్ల‌డించారు.

రైలు ఎక్కే సమయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. సీటు విషయంలో మహిళతో వ్యక్తి గొడవ పడ్డాడు. అయితే బోగీలోని కొందరు ప్రయాణికులు ఆమెకు మద్దతుగా నిల‌వ‌డంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన నిందితుడు.. తన వద్దఉన్న పెట్రోల్ బాటిల్‌ తీసుకొని మహిళా ప్రయాణికురాలిపై పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఓ చిన్నారి, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ముగ్గురూ మరణించారు. రైలు పట్టాలపై నుంచి పసిపాపతో సహా మూడు మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మృతుల్లో ఇద్దరిని తౌఫిక్‌, రెహానాగా గుర్తించారు. మంట‌లు వ్యాపించ‌డంతో కదులుతున్న రైలులో నుంచి వారు భయంతో దూకి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టాల నుంచి మరో బాటిల్ పెట్రోల్, రెండు మొబైల్ ఫోన్‌లు ఉన్న బ్యాగ్‌ని స్వాధీనం చేసుకున్నారు.

మంటలు బోగీకి వ్యాపించడంతో తీవ్ర ఆందోళ‌న‌కు గురైన‌ ప్రయాణీకులు చైన్ లాగి రైలును నిలిపివేశారు. ఈ క్రమంలో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో బోగీలోని తొమ్మిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ స‌మాచారం అందుకున్న రైల్వే ర‌క్ష‌క ద‌ళం (ఆర్పీఎఫ్) బృందం ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని మంటలను అదుపు చేసింది. ఘటనపై ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని రైల్వే పోలీసులు తెలిపారు.

ఘ‌ట‌న అనంత‌రం కోరాపుజా నది వెంబడి ఉన్న వంతెనపై రైలు ఆగిన వెంటనే, ముప్పై ఏళ్ల వయస్సు గల వ్యక్తి దాని నుంచి దూకి తన కోసం వేచి ఉన్న బైక్‌పై పారిపోయాడ‌ని ప్ర‌త్య‌క్ష సాక్షి తెలిపాడు.  ప‌రారైన నిందితుడు ఇత‌ర‌ వ్యక్తుల సహాయంతో బైక్‌పై వెళుతున్న‌ట్టు సీసీ టీవీల్లో గుర్తించిన పోలీసులు ఆ పుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పక్కా ప్రణాళికతో జరిగిన దాడిగా అనుమానిస్తున్నారు.

గుర్తుతెలియని వ్యక్తి మండే స్వ‌భావ‌మున్న ద్రావ‌ణంతో ఉన్న‌ బాటిల్‌ను తీసి సహ ప్రయాణికులపై చ‌ల్లాడ‌ని, వారు స్పందించేలోపే నిప్పంటించి పారిపోయాడని గాయపడిన వారిలో ఒకరు పోలీసులకు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రమాద సమయంలో మహిళ, ఓ చిన్నారి కనిపించకుండా పోయినట్లు గాయపడిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మహిళ ఫోన్, చెప్పుల‌ను పోలీసులు గుర్తించారు.

టాప్ హెడ్ లైన్స్

Simon Wall Broken: సీమోన్ అజేయమైన కోటకు బెల్జియం బీటలు.. 650 నిమిషాల రికార్డ్ క్లీన్ షీట్ బ్రేక్, అయినా సెమీస్ లోకి దూసుకెళ్లిన స్పెయిన్!
సీమోన్ అజేయమైన కోటకు బెల్జియం బీటలు.. 650 నిమిషాల రికార్డ్ క్లీన్ షీట్ బ్రేక్, అయినా సెమీస్ లోకి దూసుకెళ్లిన స్పెయిన్!
Jofra Archer Vs Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ బలహీనతను పట్టేసిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ నెట్స్ లో దొరికిపోయిన బీహార్ బ్యాటర్!
15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ బలహీనతను పట్టేసిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ నెట్స్ లో దొరికిపోయిన బీహార్ బ్యాటర్!
IND VS ENG 5th T20i Preview: శ్రేయస్  కెప్టెన్సీకి పొంచి ఉన్న గండం.. ఇంగ్లాండ్‌తో లాస్ట్ పోరుకు టీమిండియా సై, సంజూ శాంసన్ కంబ్యాక్ పై ఊహాగానాలు!
శ్రేయస్  కెప్టెన్సీకి పొంచి ఉన్న ముప్పు.. ఇంగ్లాండ్‌తో లాస్ట్ పోరుకు టీమిండియా సై, సంజూ శాంసన్ కంబ్యాక్ పై ఊహాగానాలు!
Smriti Mandhana Historic Milestone:  స్మృతి మంధాన సరికొత్త హిస్టారికల్ రికార్డ్..ఆ మైలురాయిని అందుకున్న యంగెస్ట్ ప్లేయర్ గా ఘ‌న‌త‌
స్మృతి మంధాన సరికొత్త హిస్టారికల్ రికార్డ్..ఆ మైలురాయిని అందుకున్న యంగెస్ట్ ప్లేయర్ గా ఘ‌న‌త‌

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Embed widget