అన్వేషించండి

Kerala Train Fire: కేరళలో దారుణం, రైలు ప్రయాణికులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి, చిన్నారి సహా ముగ్గురు మృతి

Kerala Train Fire: రైలు ప్ర‌యాణంలో వివాదం తలెత్తడంతో ఆగ్ర‌హించిన‌ ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కేరళలో జరిగిన ఈ ఘ‌ట‌న‌లో మహిళ సహా ముగ్గురు మరణించారు.

Kerala Train Fire: కేరళలో దారుణ ఘ‌ట‌న జ‌రిగింది. రైలు ప్ర‌యాణంలో వివాదం తలెత్తడంతో ఆగ్ర‌హించిన‌ ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘ‌ట‌న‌లో మహిళ సహా ముగ్గురు మరణించారు. రైలు బోగీకికూడా మంటలు వ్యాపించడంలో ప్రయాణికులు భయభ్రాంతులకు గురై చైన్ లాగి ట్రైన్‌ను నిలిపివేశారు. ఈ క్రమంలో నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిని చికిత్సనిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఆదివారం రాత్రి 9.50 గంటల ప్రాంతంలో కోజికోడ్ రైల్వే స్టేషన్ (ఉత్తరం) నుంచి అలపుజా-కన్నూరు ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరింది. ఎలత్తూరు, కోయిలాండి రైల్వే స్టేషన్ల మధ్య కోరాపుజ రైల్వే వంతెన వద్దకు చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు బ‌య‌లుదేరిన‌ కొద్దిసేప‌టికే డి-1 కోచ్‌లో వివాదం త‌లెత్తి ఆగ్ర‌హానికి గురైన‌ గుర్తు తెలియని వ్యక్తి సహ ప్రయాణికులపై పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో ముగ్గురు మరణించార‌ని ప‌లువురికి గాయాలయ్యాయ‌ని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘ‌ట‌న‌లో ఉగ్ర‌వాద దాడికి సంబంధించిన ఆధారాలేవీ లేవ‌ని వెల్ల‌డించారు.

రైలు ఎక్కే సమయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. సీటు విషయంలో మహిళతో వ్యక్తి గొడవ పడ్డాడు. అయితే బోగీలోని కొందరు ప్రయాణికులు ఆమెకు మద్దతుగా నిల‌వ‌డంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన నిందితుడు.. తన వద్దఉన్న పెట్రోల్ బాటిల్‌ తీసుకొని మహిళా ప్రయాణికురాలిపై పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఓ చిన్నారి, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ముగ్గురూ మరణించారు. రైలు పట్టాలపై నుంచి పసిపాపతో సహా మూడు మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మృతుల్లో ఇద్దరిని తౌఫిక్‌, రెహానాగా గుర్తించారు. మంట‌లు వ్యాపించ‌డంతో కదులుతున్న రైలులో నుంచి వారు భయంతో దూకి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టాల నుంచి మరో బాటిల్ పెట్రోల్, రెండు మొబైల్ ఫోన్‌లు ఉన్న బ్యాగ్‌ని స్వాధీనం చేసుకున్నారు.

మంటలు బోగీకి వ్యాపించడంతో తీవ్ర ఆందోళ‌న‌కు గురైన‌ ప్రయాణీకులు చైన్ లాగి రైలును నిలిపివేశారు. ఈ క్రమంలో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో బోగీలోని తొమ్మిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ స‌మాచారం అందుకున్న రైల్వే ర‌క్ష‌క ద‌ళం (ఆర్పీఎఫ్) బృందం ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని మంటలను అదుపు చేసింది. ఘటనపై ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని రైల్వే పోలీసులు తెలిపారు.

ఘ‌ట‌న అనంత‌రం కోరాపుజా నది వెంబడి ఉన్న వంతెనపై రైలు ఆగిన వెంటనే, ముప్పై ఏళ్ల వయస్సు గల వ్యక్తి దాని నుంచి దూకి తన కోసం వేచి ఉన్న బైక్‌పై పారిపోయాడ‌ని ప్ర‌త్య‌క్ష సాక్షి తెలిపాడు.  ప‌రారైన నిందితుడు ఇత‌ర‌ వ్యక్తుల సహాయంతో బైక్‌పై వెళుతున్న‌ట్టు సీసీ టీవీల్లో గుర్తించిన పోలీసులు ఆ పుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పక్కా ప్రణాళికతో జరిగిన దాడిగా అనుమానిస్తున్నారు.

గుర్తుతెలియని వ్యక్తి మండే స్వ‌భావ‌మున్న ద్రావ‌ణంతో ఉన్న‌ బాటిల్‌ను తీసి సహ ప్రయాణికులపై చ‌ల్లాడ‌ని, వారు స్పందించేలోపే నిప్పంటించి పారిపోయాడని గాయపడిన వారిలో ఒకరు పోలీసులకు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రమాద సమయంలో మహిళ, ఓ చిన్నారి కనిపించకుండా పోయినట్లు గాయపడిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మహిళ ఫోన్, చెప్పుల‌ను పోలీసులు గుర్తించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh in Davos: ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
Harish Rao SIT investigation : ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
Durgam Cheruvu ABP Country Effect: దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
Traffic challan: వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్

వీడియోలు

Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
Medaram Jatara Gattamma Thalli History | ఎవరీ గట్టమ్మ తల్లి ? | ABP Desam
WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh in Davos: ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
Harish Rao SIT investigation : ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
Durgam Cheruvu ABP Country Effect: దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
Traffic challan: వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
Japanese Andhra Meals: తెలుగు భోజనానికి జపాన్ దౌత్యవేత్తలు ఫ్లాట్ - ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో భోజనం చేసి పొగడకుండా ఉండలేకపోయారు!
తెలుగు భోజనానికి జపాన్ దౌత్యవేత్తలు ఫ్లాట్ - ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో భోజనం చేసి పొగడకుండా ఉండలేకపోయారు!
TGSRTC Medaram Prasadam: మేడారం వెళ్లలేని భక్తుల ఇంటికే అమ్మవారి బంగారం! తెలంగాణ ఆర్టీసీ వినూత్న ప్రయోగం!
మేడారం వెళ్లలేని భక్తుల ఇంటికే అమ్మవారి బంగారం! తెలంగాణ ఆర్టీసీ వినూత్న ప్రయోగం!
Stock market crash: స్టాక్ మార్కెట్‌లో తుడిచిపెట్టుకుపోయిన పది లక్షల కోట్లు - మహా పతనానికి కారణాలు ఇవే !
స్టాక్ మార్కెట్‌లో తుడిచిపెట్టుకుపోయిన పది లక్షల కోట్లు - మహా పతనానికి కారణాలు ఇవే !
Mana Shankara Varaprasad Garu Review : ఇది సంక్రాంతి 'బాస్' బస్టర్ - 'మన శంకరవరప్రసాద్ గారు'పై బన్నీ రివ్యూ
ఇది సంక్రాంతి 'బాస్' బస్టర్ - 'మన శంకరవరప్రసాద్ గారు'పై బన్నీ రివ్యూ
Embed widget