By: ABP Desam | Updated at : 13 Nov 2021 11:49 AM (IST)
Edited By: Murali Krishna
కేరళలో కొత్త వైరస్
కేరళలో మరో వైరస్ కలకలం రేపుతోంది. నోరో వైరస్ పేరుతో పిలుస్తోన్నఈ వ్యాధి అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. 2 వారాల వ్యవధిలో 13 కేసులు నమోదయ్యాయి. వయనాడ్ జిల్లాలోనే అన్ని కేసులు నిర్ధారణయ్యాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
Koo App#నోరోవైరస్ కేరళలోని వాయనాడ్ జిల్లాలో నోరోవైరస్ ఉన్నట్లు ధృవీకృతమైంది. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ప్రధానంగా కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తుంది. ముందు జాగ్రత్తలు తీసుకుంటే దీనిని నివారించవచ్చు. ఇదో అత్యంత అంటు వ్యాధి. వాయనాడ్ జిల్లాలోని వైథిరీ సమీపంలోని పూకొడేలోని వెటర్నరీ కాలేజ్లో13 కన్నా ఎక్కువ మంది విద్యార్థులకు ఇది సోకింది. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రమాదంలేదు.- Lakshmi (@లక్ష్మి77) 13 Nov 2021
ఎలా వ్యాపిస్తోంది?
ఈ వైరస్ సోకిన వారంతా వయనాడ్ జిల్లా పూకోడేలోని ఓ పశువైద్య కళాశాల విద్యార్థులు. వాంతులు, డయేరియాను ఈ వైరస్ లక్షణాలుగా గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.
పశువైద్య కళాశాల క్యాంపస్ బయట ఉండే హాస్టళ్లల్లోని విద్యార్థుల్లో తొలిసారి ఈ వైరస్ను గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. వారి రక్తనమూనాలను సేకరించి అలప్పుజలోని జాతీయ వైరాలజీ సంస్థ(ఎన్ఐవీ)కి పంపించారు. వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆరోగ్య మంత్రి ఆదేశించారు.
ఇవే ప్రధాన లక్షణాలు..
చికిత్స..
నోరో వైరస్కు ఇప్పటివరకు సరైన చికిత్స ఇది అని చెప్పడానికి లేదు. అయితే రికవరీ అనేది బాధిత వ్యక్తి రోగనిరోధక శక్తి పైన ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యక్తులు కొద్ది రోజుల్లోనే కోలుకుంటున్నారు. తాగు నీటి వనరులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, చికిత్స తీసుకుంటే వ్యాధి నుంచి కోలుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మొదటిసారి..
1929లో తొలిసారి నోరో వైరస్ను గుర్తించారు. దీన్ని వాంతుల రోగంగా పిలిచేవారు. అయితే 1968లోనే దీన్ని ఓ ప్రమాదకర రోగంగా పరిగణించారు. అమెరికాలోని ఓ ఎలిమెంట్రీ పాఠశాలలో ఈ వైరస్ సోకినప్పుడు అంతా భయపడ్డారు. కానీ 1990 నుంచి మాత్రమే శాస్త్రవేత్తలు ఈ వైరస్పై అధ్యయనాలు మొదలు పెట్టారు.
Also Read:Business Idea: ఏం చేద్దామని ఆలోచిస్తున్నారా? ఈ పనిచేయండి.. నెలకు రూ.2 లక్షలు మీ సొంతం!
Also read: Kangana Ranaut: 'కంగనాకు బాగా తలకెక్కింది.. పద్మశ్రీ లాగేసుకొని.. జైల్లోకి తోసేయండి'
Also read: Srinagar Encounter: కశ్మీర్ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
Also read: Corona Cases: దేశంలో కొత్తగా 12,516 కరోనా కేసులు, 501 మరణాలు
Also read: ఏడ్చే మగాడిని నమ్మాల్సిందే... మగాళ్లూ హ్యాపీగా ఏడవండి, మానసిక ప్రశాంతత పొందండి
Also read: ఈ వధువు మామూలుది కాదు... పెళ్లికి పిలిచింది, పెళ్లిభోజనం మాత్రం కొనుక్కోమంది, ధరెంతో తెలుసా?
Also read: డయాబెటిస్ ఉందా... ఈ మూడూ పదార్థాలు రోజూ తినండి, ఎంతో మేలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Election Campaign Ends: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు
Telangana Deeksha Divas 2023: నవంబర్ 29న దీక్షా దివస్, చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్!
Minister Roja: నేను చదువుకున్న కాలేజీకి నేనే చీఫ్ గెస్ట్, కన్నీళ్లు ఆగలేదు - రోజా
KCR Speech in Gajwel: ఒకే విడతలో గజ్వేల్లో దళితులందరికీ దళితబంధు, అధికారంలోకి రాగానే - కేసీఆర్ హామీ
Uttarakhand Tunnel Rescue: టన్నెల్ రెస్క్యూ పనులు పూర్తి, మరికాసేపట్లో బయటకు రానున్న 41మంది కార్మికులు: సీఎం ధామి
Telangana Elections 2023 : కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !
Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు
Telangana Elections Holiday: పోలింగ్ రోజు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: సీఈవో వికాస్ రాజ్
Hi Nanna: ఒడియమ్మా... నానితో ఆట, తమిళ హీరోతో పాట - శృతి హాసన్ సాంగ్ స్పెషాలిటీస్ ఎన్నో!
/body>