అన్వేషించండి

Diabetes: డయాబెటిస్ ఉందా... ఈ మూడూ పదార్థాలు రోజూ తినండి, ఎంతో మేలు

డయాబెటిస్ రావడం సాధారణంగా మారిపోయింది. కానీ ఏమరపాటుగా ఉంటే మాత్రం తీవ్రంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

ఒక్కసారి వచ్చిందా జీవితాంతం వెంటాడే ఆరోగ్య సమస్య మధుమేహం. ఏటా పదిలక్షలమందిని బలితీసుకుంటున్న మహమ్మారి ఇది. రక్తంలోకి వచ్చే గ్లూకోజ్ ను శక్తిగా మార్చే ప్రక్రియ సక్రమంగా జరగనప్పుడు డయాబెటిస్ వస్తుంది. ఇది రావడమే కాదు గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు, అంధత్వం, పాదాలు, కాళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చి వాటిని తొలగించే పరిస్థితికి తీసుకురావడం వంటి సమస్యలకు కూడా దారితీసేలా చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల మంది ప్రజలు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ప్రతి ఏటా ఈ మహమ్మారి బారిన పడే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 

డయాబెటిస్ రోగం ఉన్న వారు ఆహారపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే పరిస్థితి అకస్మాత్తుగా తలకిందులు అవుతుంది. వారు కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారపదార్థాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా కింద చెప్పిన మూడు పదార్థాలు రోజూ తీసుకుంటే షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇతర ఆరోగ్యసమస్యలు రాకుండా కాపాడతాయి. 

కాకరకాయ రసం
మధుమేహం ఉన్న వారు రోజూ కాకరకాయను కూరగానో, పులుసుగానో తినడం అలవాటు చేసుకోవాలి. లేదా ఉదయాన లేచిన వెంటనే 30 ఎమ్ఎల్ కాకరకాయ జ్యూస్ తాగాలి. రోజూ ఇలా కాకరకాయ జ్యూస్ తాగితే షుగర్ ఉన్నవారికి ఎంతో మేలు. ఇందులో చారన్టిన్, పాలీపెప్టైడ్2 అనే ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి చక్కెరస్థాయిని నియంత్రించేందుకు సహకరిస్తాయి. అలాగే గుండెపోటు వచ్చే అవకాశాన్ని కూడా తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

మెంతులు
షుగర్ వ్యాధిగ్రస్తులు మెంతులు కూడా ఎంతో మేలు చేస్తాయి. మెంతులను పొడి చేసి ఒక డబ్బాలో దాచుకోండి. గ్లాసు నీటిలో స్పూను పొడి కలుపుకుని తాగితే చాలా మంచిది. లేదా రాత్రి మెంత్రుల్ని నీటి నానబెట్టి ఉదయానే ఆ నీటిని తాగినా మంచిదే. షుగర్ లెవెల్స్ ను పెరగకుండా చూడడంలో మెంతులు బాగా పనిచేస్తాయి. మెంతాకులతో కూర, పప్పు వండుకుని తినడం తరచూ చేస్తుండాలి. 

ఉసిరి రసం
పచ్చి ఉసిరి కాయలు తిన్నా, ఉసిరి రసం రోజూ తాగినా డయాబెటిక్ రోగులకు చాలా మంచిది. పరగడుపునే 30 ఎమ్ఎల్ ఉసిరి రసం తాగడం అలవాటు చేసుకుంటే మధుమేహం వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులేవీ మీ జోలికి రావు. ఉసిరి వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఏవైనా దెబ్బలు తాకినా త్వరగా తగ్గిపోయేందుకు కావాల్సిన శక్తిని ఉసిరి రసం అందిస్తుంది. 

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

Also read: ఉల్లిపాయ అధికంగా తింటే మేలే కాదు, కీడు కూడా చేస్తుంది

Also read: చలికాలంలో వేడి పుట్టించే నువ్వులు తినడం అవసరమే

Also read: ఈ అలవాట్లు ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget