అన్వేషించండి

Kerala Landslides: వారం ముందే హెచ్చరించాం, ప్రభుత్వం పట్టించుకోలేదు - వయనాడ్‌ విపత్తుపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

Wayanad Landslides: వయనాడ్‌లో విపత్తు ముంచుకొస్తుందని వారం రోజుల ముందే హెచ్చరించామని అమిత్ షా తేల్చి చెప్పారు. కేరళ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

Wayanad News in Telugu: వయనాడ్‌ విపత్తుపై రాజ్యసభలో కేంద్రమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు హెచ్చరికలు ఇచ్చినా పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. జులై 23వ తేదీనే కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించామని స్పష్టం చేశారు. కొండచరియలు విరిగి పడే ప్రమాదముందని, భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరుగుతుందని ముందే అప్రమత్తం చేశామని వెల్లడించారు. ఇప్పటికే ఈ ఘటనలో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 180 మంది గల్లంతయ్యారు. కేరళలో భారీ వర్షాలు మొదలైన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి 9 NDRF బృందాలను పంపినట్టు వివరించారు అమిత్ షా. కానీ కేరళ ప్రభుత్వం ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల్ని సరైన సమయంలో అలెర్ట్ చేయలేదని, వాళ్లను వేరే చోటకు తరలించలేదని ఆరోపించారు. ఏదైనా ప్రకృతి విపత్తు సంభవించే ప్రమాదముందని తెలిస్తే వారం రోజుల ముందే అలెర్ట్ చేసే టెక్నాలజీ భారత్ వద్ద ఉందని తేల్చి చెప్పారు. ప్రపంచంలో ఇలాంటి సాంకేతికత ఉన్న నాలుగు దేశాల్లో భారత్ కూడా ఒకటి అని తెలిపారు. కేరళ ప్రభుత్వం కాస్త ముందే అప్రమత్తమై ఉంటే ఈ స్థాయిలో ప్రాణనష్టం జరిగి ఉండేది కాదని అన్నారు. కేరళ ప్రభుత్వానికి మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వయనాడ్‌ విపత్తుని కచ్చితంగా ఎదుర్కొంటామని వెల్లడించారు. (Also Read: Kerala Landslide: భారత్‌ని వెంటాడుతున్న వరుస విపత్తులు, వరదలు తుఫాన్లతో విధ్వంసం)

"జులై 23వ తేదీన మేం కేరళ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాం. కొండ చరియలు విరిగిపడే ప్రమాదముందని అప్రమత్తం చేశాం. 9 NDRF బృందాలను పంపాం. కానీ కేరళ ప్రభుత్వం ఏం చేసింది..? సరైన సమయంలో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారా..? ఒకవేళ వాళ్లు ఆ పని చేసుంటే ఇంత మంది ఎందుకు చనిపోతారు..? 2016 లోనే ముందస్తు హెచ్చరికలు చేసే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. వారం రోజుల ముందే అలెర్ట్ చేసే టెక్నాలజీ మన దగ్గరుంది"

- అమిత్ షా, కేంద్రహోం మంత్రి

 

ఇప్పటికే కేంద్రమంత్రి జార్జ్ కురియన్‌ అక్కడి పరిస్థితులు సమీక్షించేందుకు వెళ్లారు. రిలీఫ్ క్యాంప్‌లలో తలదాచుకున్న బాధితులను పరామర్శించారు. రెస్క్యూ ఆపరేషన్‌ ఎలా జరుగుతోందో సమీక్షించారు. కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి 160 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం అందింది. అయితే..ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. కొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నారని వెల్లడించారు.

Also Read: Wayanad Landslides: వయనాడ్ విధ్వంసానికి కారణమిదే, మరో రెండు రోజుల పాటు ఇదే బీభత్సం!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP Leaders Suspension: కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలపై పార్టీ వేటు
కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలపై పార్టీ వేటు
Minors Drugs Party: మొయినాబాద్ ఫాంహౌస్‌లో మైనర్ల మత్తు పార్టీ కలకలం, ఎస్ఓటీ పోలీసుల ఆకస్మిక దాడి
మొయినాబాద్ ఫాంహౌస్‌లో మైనర్ల మత్తు పార్టీ కలకలం, ఎస్ఓటీ పోలీసుల ఆకస్మిక దాడి
Ind vs Pak Womens World Cup: అదరగొట్టిన అమ్మాయిలు.. పాక్ మీద 88 పరుగుల తేడాతో ఘన విజయం, క్రాంతి గౌడ్ అదుర్స్
అదరగొట్టిన అమ్మాయిలు.. పాక్ మీద 88 పరుగుల తేడాతో ఘన విజయం, క్రాంతి గౌడ్ అదుర్స్
Multibagger Stock: రూ.50 విలువ ఉన్న మల్టీబ్యాగర్ స్టాక్.. 6 నెలల్లో మీ పెట్టుబడిని రెట్టింపు చేసింది
రూ.50 విలువ ఉన్న మల్టీబ్యాగర్ స్టాక్.. 6 నెలల్లో మీ పెట్టుబడిని రెట్టింపు చేసింది
Advertisement

వీడియోలు

దుర్గా నిమజ్జనంలో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లదాడి, వాహనాలకు నిప్పు.. ఇంటర్నెట్ నిషేధం
కాంతార భూతగణాల కథ.. ఊహకందని ఈ శక్తి ఈ గణాల సొంతం
Surya Kumar Yadav as T20 Captain | టీ20 కెప్టెన్ గా కొనసాగనున్న సూర్య కుమార్ యాదవ్
Rohit Sharma Virat Kohli 2027 ODI World Cup | చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కీలక ప్రకటన
India vs West Indies Test Match Day 3 | విండీస్‌పై ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో భారత్ విజయం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Leaders Suspension: కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలపై పార్టీ వేటు
కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలపై పార్టీ వేటు
Minors Drugs Party: మొయినాబాద్ ఫాంహౌస్‌లో మైనర్ల మత్తు పార్టీ కలకలం, ఎస్ఓటీ పోలీసుల ఆకస్మిక దాడి
మొయినాబాద్ ఫాంహౌస్‌లో మైనర్ల మత్తు పార్టీ కలకలం, ఎస్ఓటీ పోలీసుల ఆకస్మిక దాడి
Ind vs Pak Womens World Cup: అదరగొట్టిన అమ్మాయిలు.. పాక్ మీద 88 పరుగుల తేడాతో ఘన విజయం, క్రాంతి గౌడ్ అదుర్స్
అదరగొట్టిన అమ్మాయిలు.. పాక్ మీద 88 పరుగుల తేడాతో ఘన విజయం, క్రాంతి గౌడ్ అదుర్స్
Multibagger Stock: రూ.50 విలువ ఉన్న మల్టీబ్యాగర్ స్టాక్.. 6 నెలల్లో మీ పెట్టుబడిని రెట్టింపు చేసింది
రూ.50 విలువ ఉన్న మల్టీబ్యాగర్ స్టాక్.. 6 నెలల్లో మీ పెట్టుబడిని రెట్టింపు చేసింది
Medaram Jatara 2026: మేడారంలో గద్దెల చుట్టూ ఉన్న నిర్మాణాల కూల్చివేత ప్రారంభించిన అధికారులు
మేడారంలో గద్దెల చుట్టూ ఉన్న నిర్మాణాల కూల్చివేత ప్రారంభించిన అధికారులు
Tirumala Darshan Update: తిరుమలలో వృద్ధుల దర్శనంపై వదంతులు నమ్మొద్దు.. శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
తిరుమలలో వృద్ధుల దర్శనంపై వదంతులు నమ్మొద్దు.. శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
KTR Fires on RTC Charges Hike: కాంగ్రెస్‌ను ఓడించారనే కక్షతో హైదరాబాద్‌లో ఆర్టీసీ ఛార్జీలు పెంపు, పండుగ పూట దుర్మార్గం: కేటీఆర్
కాంగ్రెస్‌ను ఓడించారనే కక్షతో హైదరాబాద్‌లో ఆర్టీసీ ఛార్జీలు పెంపు: కేటీఆర్
Jubilee Hills By Election: బీసీలకే జూబ్లీహిల్స్ టికెట్.. కాంగ్రెస్ టికెట్ రేసులో నలుగురిలో ముందున్నది ఎవరు?
బీసీలకే జూబ్లీహిల్స్ టికెట్.. కాంగ్రెస్ టికెట్ రేసులో నలుగురిలో ముందున్నది ఎవరు?
Embed widget