అన్వేషించండి

Karnataka Muda scam: సిద్దరామయ్య ప్లాట్లు తిరిగిచ్చేసినా వదలని ఈడీ - మైసూరులో వరుసగా రెండో రోజూ సోదాలు !

CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్యను ఈడీ వదిలి పెట్టడం లేదు. భూములు తిరిగి ఇచ్చేసి హమ్మయ్య అనుకున్నా ఈడీ మాత్రం సోదాలు చేసేస్తోంది.

Karnataka Muda scam ED raids continue : కర్ణాటక రాజకీయాల్లో  ముడా స్కాం వ్యవహారం ఇప్పటికీ కలకలం రేపుతోంది. ఈడీ కేసు నమోదు చేసిన తర్వాత కొన్నిరోజులు సైలెంట్ గా ఉంది. తాజాగా ఈడీ మైసూరులో ముడా కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తోంది. ఆ సోదాలు వరుసగా రెండో రోజూ కొనసాగుతున్నాయి. ముడా స్కాంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ అనుమానిస్తోంది. ఈ సోదాల తర్వాత కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. 

ముడా ప్లాట్లను అక్రమంగా పొందారని  సిద్దారమయ్యపై ఆరోపణలు               

మైసూర్ అర్బన్  డెవలప్‌మెంట్ అధారిటీ మైనసూరులో డెలవప్ చేసిన ఓ వెంచర్ లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్యకు ప్లాట్లు కేటాయించారు. ఎందుకంటే.. సిద్ధరామయ్య స్వగ్రామంలో ఆయన భార్యకు చెందిన భూమిని ముడా తీసుకుంది. దానికి ప్రతిఫలంగా అత్యంత విలువైన భూములు ఇచ్చారన్నది ఆరోపణ. సిద్దరామయ్య స్వగ్రామం కూడా మైసూరుకు సమీపంలోనే ఉంటుంది. ఈ విషయంపై విజిల్ బ్లోయర్లు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు అనుమతి ఇచ్చారు. లోకాయక్త విచారణకు రెడీ కావడంతో ఇదందా రాజకీయ కుట్ర అని సిద్దరామయ్య హైకోర్టుకు వెళ్లారు. కానీ హైకోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది. 

జీతం మూడు కోట్లు - వెయ్యి రూపాయలకు కక్కుర్తి పడి ఉద్యోగం పోగొట్టుకున్నారు ! మెటాలో వీళ్లే బలిపశువులు

ప్లాట్లు తిరిగి ఇచ్చినా ఈడీ కేసు నమోదు                            

చివరికి లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు ఆధారంగా ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థను తనను టార్గెట్ చేస్తున్నాయని అనుకుంటున్న సిద్దరామయ్య వెంటనే వ్యూహాత్మకంగా ఆలోచించారు. తన భార్యకు ముడా కేటాయించిన  ప్లాట్లు అన్నీ తిరిగి ఇచ్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ముడా అధికారులు కూడా అంగీకరించారు. దీంతో కేసు క్లోజ్ అయిపోయిందని సిద్దరామయ్య ఊపిరి పీల్చుకున్నారు. కానీ అసలు కేసు ఇంకా ఉందని ఈడీ రంగంలోకి దిగిపోయింది. ముడా కార్యాలయాల్లో సోదాల్లో ఏం బయటపడుతుందో కానీ కర్ణాటక రాజకీయవర్గాల్లో మాత్రం ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది.         

బాంబులు పేల్చేందుకు కిమ్‌కు కూడా ఉబలాటమే - దక్షిణ కొరియాను రెచ్చగొట్టే పనులు షురూ !

మనీలాండరింగ్ ఆధారాలు దొరికితే సిద్దరామయ్యకు  మరిన్ని చిక్కులు              

మామూలుగా ముడా ప్లాట్లను అక్రమంగా కేటాయించారా లేదా అన్నదానిపై ఈడీ దర్యాప్తు చేయదు. ఈ మొత్తం వ్యవహారంలో నేరపూరితమైన లావాదేవీలు, అక్రమ నగదు చెలామణి ఏమైనా ఉంటే కేసులు నమోదు  చేస్తుంది. అయితే  ఈ వ్యవహారంలో భూమి తీసుకుని ప్లాట్లు కేటాయించారు తప్ప ఎక్కడా నగదు లావాదేవీలు లేవని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి రాజకీయ కుట్ర పూరితంగానే ఈ కేసులు పెట్టారని అంటున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RS Praveen Kumar: తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Ration Card EKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
IRCTC Good News: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
Kannappa: 'కన్నప్ప' విడుదల వాయిదా - క్షమాపణలు చెప్పిన నటుడు మంచు విష్ణు
'కన్నప్ప' విడుదల వాయిదా - క్షమాపణలు చెప్పిన నటుడు మంచు విష్ణు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Fastest Stumping vs RCB | వరుసగా రెండో మ్యాచ్ లోనూ ధోని మెరుపు స్టంపింగ్ | ABP DesamMS Dhoni Sixers vs RCB IPL 2025 | యధావిథిగా ధోనీ ఆడాడు..CSK ఓడింది | ABP DesamCSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP DesamMyanmar Bangkok Earthquake | మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భారీ భూకంపం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RS Praveen Kumar: తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Ration Card EKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
IRCTC Good News: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
Kannappa: 'కన్నప్ప' విడుదల వాయిదా - క్షమాపణలు చెప్పిన నటుడు మంచు విష్ణు
'కన్నప్ప' విడుదల వాయిదా - క్షమాపణలు చెప్పిన నటుడు మంచు విష్ణు
Viral News:17 ఏళ్లుగా మహిళకు పొట్టనొప్పి- ఎక్స్‌రేతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భర్త
17 ఏళ్లుగా మహిళకు పొట్టనొప్పి- ఎక్స్‌రేతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భర్త
Swati Sachdeva: రణవీర్ అల్లాబదియాకు ఫీమేల్ వెర్షన్ స్వాతి సచ్‌దేవ - తల్లి వైబ్రేటర్ గురించి  కుళ్లు జోకులు
రణవీర్ అల్లాబదియాకు ఫీమేల్ వెర్షన్ స్వాతి సచ్‌దేవ - తల్లి వైబ్రేటర్ గురించి కుళ్లు జోకులు
Malla Reddy: 'ఆ హీరోయిన్ కసికసిగా ఉంది' - నటిపై మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
'ఆ హీరోయిన్ కసికసిగా ఉంది' - నటిపై మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
Embed widget