అన్వేషించండి

Karnataka Muda scam: సిద్దరామయ్య ప్లాట్లు తిరిగిచ్చేసినా వదలని ఈడీ - మైసూరులో వరుసగా రెండో రోజూ సోదాలు !

CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్యను ఈడీ వదిలి పెట్టడం లేదు. భూములు తిరిగి ఇచ్చేసి హమ్మయ్య అనుకున్నా ఈడీ మాత్రం సోదాలు చేసేస్తోంది.

Karnataka Muda scam ED raids continue : కర్ణాటక రాజకీయాల్లో  ముడా స్కాం వ్యవహారం ఇప్పటికీ కలకలం రేపుతోంది. ఈడీ కేసు నమోదు చేసిన తర్వాత కొన్నిరోజులు సైలెంట్ గా ఉంది. తాజాగా ఈడీ మైసూరులో ముడా కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తోంది. ఆ సోదాలు వరుసగా రెండో రోజూ కొనసాగుతున్నాయి. ముడా స్కాంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ అనుమానిస్తోంది. ఈ సోదాల తర్వాత కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. 

ముడా ప్లాట్లను అక్రమంగా పొందారని  సిద్దారమయ్యపై ఆరోపణలు               

మైసూర్ అర్బన్  డెవలప్‌మెంట్ అధారిటీ మైనసూరులో డెలవప్ చేసిన ఓ వెంచర్ లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్యకు ప్లాట్లు కేటాయించారు. ఎందుకంటే.. సిద్ధరామయ్య స్వగ్రామంలో ఆయన భార్యకు చెందిన భూమిని ముడా తీసుకుంది. దానికి ప్రతిఫలంగా అత్యంత విలువైన భూములు ఇచ్చారన్నది ఆరోపణ. సిద్దరామయ్య స్వగ్రామం కూడా మైసూరుకు సమీపంలోనే ఉంటుంది. ఈ విషయంపై విజిల్ బ్లోయర్లు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు అనుమతి ఇచ్చారు. లోకాయక్త విచారణకు రెడీ కావడంతో ఇదందా రాజకీయ కుట్ర అని సిద్దరామయ్య హైకోర్టుకు వెళ్లారు. కానీ హైకోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది. 

జీతం మూడు కోట్లు - వెయ్యి రూపాయలకు కక్కుర్తి పడి ఉద్యోగం పోగొట్టుకున్నారు ! మెటాలో వీళ్లే బలిపశువులు

ప్లాట్లు తిరిగి ఇచ్చినా ఈడీ కేసు నమోదు                            

చివరికి లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు ఆధారంగా ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థను తనను టార్గెట్ చేస్తున్నాయని అనుకుంటున్న సిద్దరామయ్య వెంటనే వ్యూహాత్మకంగా ఆలోచించారు. తన భార్యకు ముడా కేటాయించిన  ప్లాట్లు అన్నీ తిరిగి ఇచ్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ముడా అధికారులు కూడా అంగీకరించారు. దీంతో కేసు క్లోజ్ అయిపోయిందని సిద్దరామయ్య ఊపిరి పీల్చుకున్నారు. కానీ అసలు కేసు ఇంకా ఉందని ఈడీ రంగంలోకి దిగిపోయింది. ముడా కార్యాలయాల్లో సోదాల్లో ఏం బయటపడుతుందో కానీ కర్ణాటక రాజకీయవర్గాల్లో మాత్రం ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది.         

బాంబులు పేల్చేందుకు కిమ్‌కు కూడా ఉబలాటమే - దక్షిణ కొరియాను రెచ్చగొట్టే పనులు షురూ !

మనీలాండరింగ్ ఆధారాలు దొరికితే సిద్దరామయ్యకు  మరిన్ని చిక్కులు              

మామూలుగా ముడా ప్లాట్లను అక్రమంగా కేటాయించారా లేదా అన్నదానిపై ఈడీ దర్యాప్తు చేయదు. ఈ మొత్తం వ్యవహారంలో నేరపూరితమైన లావాదేవీలు, అక్రమ నగదు చెలామణి ఏమైనా ఉంటే కేసులు నమోదు  చేస్తుంది. అయితే  ఈ వ్యవహారంలో భూమి తీసుకుని ప్లాట్లు కేటాయించారు తప్ప ఎక్కడా నగదు లావాదేవీలు లేవని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి రాజకీయ కుట్ర పూరితంగానే ఈ కేసులు పెట్టారని అంటున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay Protest: గ్రూప్ 1 వివాదంపై రోడ్డుపై బైఠాయించి బండి సంజయ్ నిరసన, ఛలో సెక్రటేరియట్‌కు పిలుపు
గ్రూప్ 1 వివాదంపై రోడ్డుపై బైఠాయించి బండి సంజయ్ నిరసన, ఛలో సెక్రటేరియట్‌కు పిలుపు
AP CM Chandrababu: రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు
Unstoppable Season 4 - AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు అతిథిగా బాలయ్య పండగ మొదలు... రేపే 'అన్‌స్టాపబుల్ 4' ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్
ఏపీ సీఎం చంద్రబాబు అతిథిగా బాలయ్య పండగ మొదలు... రేపే 'అన్‌స్టాపబుల్ 4' ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ లిక్కర్‌తో హెల్త్ పాడైంది, ఈ రూ.100 మందు బాగుందివీడియో: రూ.50కే కిలో చికెన్, ఇక్కడ అస్సలు తినకండి!!Hamas Chief Yahya Sinwar Killed | హమాస్ చీఫ్‌ సిన్వర్‌ని ఇజ్రాయేల్ ఎలా చంపింది | ABP Desamనటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Protest: గ్రూప్ 1 వివాదంపై రోడ్డుపై బైఠాయించి బండి సంజయ్ నిరసన, ఛలో సెక్రటేరియట్‌కు పిలుపు
గ్రూప్ 1 వివాదంపై రోడ్డుపై బైఠాయించి బండి సంజయ్ నిరసన, ఛలో సెక్రటేరియట్‌కు పిలుపు
AP CM Chandrababu: రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు
Unstoppable Season 4 - AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు అతిథిగా బాలయ్య పండగ మొదలు... రేపే 'అన్‌స్టాపబుల్ 4' ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్
ఏపీ సీఎం చంద్రబాబు అతిథిగా బాలయ్య పండగ మొదలు... రేపే 'అన్‌స్టాపబుల్ 4' ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Salman Khan: సల్మాన్ ఖాన్ కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్ దిగుతోంది - దాని రేటు ఎంత, ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?
సల్మాన్ ఖాన్ కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్ దిగుతోంది - దాని రేటు ఎంత, ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?
KTR News: గత పాలకుల వల్లే మురికికూపంలా మూసీ - సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని సమర్థించిన కేటీఆర్
గత పాలకుల వల్లే మురికికూపంలా మూసీ - సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని సమర్థించిన కేటీఆర్
Musi  Politics : రేవంత్‌ సవాల్‌పై స్పష్టత ఇవ్వని బీఆర్ఎస్ - మూసీపై అసెంబ్లీ చర్చకు సిద్ధం కాదా ?
రేవంత్‌ సవాల్‌పై స్పష్టత ఇవ్వని బీఆర్ఎస్ - మూసీపై అసెంబ్లీ చర్చకు సిద్ధం కాదా ?
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
Embed widget