By: ABP Desam | Updated at : 13 Feb 2022 06:05 PM (IST)
Edited By: Murali Krishna
కర్ణాటకలో పాఠశాలలు పునఃప్రారంభం
కర్ణాటకలో హిజాబ్ వివాదం కారణంగా మూసివేసిన పాఠశాలలు సోమవారం తెరుచుకోనున్నాయి. దీంతో ఫిబ్రవరి 14-19 వరకు ఉడుపిలోని అన్ని ఉన్నత పాఠశాలల వద్ద సెక్షన్ 144 విధించింది ఆ జిల్లా యంత్రాంగం. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 19 సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
పరిస్థితి చూసి
హిజాబ్ వివాదంతో అట్టుడుకిన కర్ణాటకలో మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తాయని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. పరిస్థితిని అంచనా వేసిన తర్వాత ప్రీ యూనివర్సిటీ, డిగ్రీ కళాశాలను తెరవడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
హిజాబ్ అనుకూల, వ్యతిరేక ఆందోళనలు తీవ్రమైన నేపథ్యంలో కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లోని పాఠశాలలకు ఫిబ్రవరి 9న మూడు రోజుల సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 14 నుంచి పదో తరగతి వరకు పాఠశాలలను తెరవాలని నిర్ణయించింది.
మధ్యంతర ఉత్తర్వులు
హిజాబ్ వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించిన కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. విద్యాసంస్థల్లోకి అడుగుపెట్టినప్పుడు విద్యార్థులు ఎలాంటి మతపరమైన దుస్తులను ధరించరాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. హిజాబ్ లేదా కాషాయ కండువా ఇలా.. ఏదీ ధరించవద్దని పేర్కొంది. కోర్టులో ఈ వ్యవహారంలో పెండింగ్లో ఉన్నంతవరకు ఇది పాటించాలని ఆదేశించింది.
మరోవైపు హిజాబ్కు వ్యతిరేకంగా కాషాయపు కండువాలు ధరించిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. శనివారం ఉడుపి కుండాపూర్లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి 'జై శ్రీరామ్' నినాదాలతో ర్యాలీలు చేశారు. ప్రస్తుతం ఈ వివాదం దేశవ్యాప్త చర్చకు తెరలేపింది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఘోర ప్రమాదం- కుప్పకూలిన ఛార్టడ్ , సుఖోయ్-మిరాజ్ విమానాలు
Vivekananda Reddy Case: విచారణకు హాజరవుతా కానీ ఆ పని చేయండి- సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ!
Budget 2023: తెలుగు రాష్ట్రాలకు మరిన్ని వందే భారత్ రైళ్లు, బడ్జెట్లో శుభవార్త వినే ఛాన్స్!
Hyderabad IIIT: త్రిబుల్ ఐటీ హైదరాబాద్ సిల్వర్ జూబ్లీ టాక్ సిరీస్ ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
Nizamabad KTR Convoy: మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు
Chiranjeevi Targets Summer : సంక్రాంతి హిట్టు - సమ్మర్ చిరంజీవికి హిట్ ఇస్తుందా?
Tarak Ratna Health Update: నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఎక్మోపై చికిత్స పొందుతున్న తారకరత్న!
RBI Governor: బ్యాడ్ టైమ్ వెళ్లిపోతోందట, గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ గవర్నర్
Vitamin D: మనదేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురికి విటమిన్ డి లోపం - చెబుతున్న టాటా ల్యాబ్స్ సర్వే