అన్వేషించండి

J&K - G-20 Summit: జమ్మూకశ్మీర్‌లో తొలిసారి ఆ సదస్సు, ఎందుకో తెలుసా?

2023లో జరగనున్న జీ20 సదస్సుని జమ్ము, కశ్మీర్‌లో నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కమిటీని నియమించింది.

జమ్ముకశ్మీర్‌లో జీ-20 సదస్సు జరగనుందా? 

జమ్ముకశ్మీర్‌లో జీ-20 సదస్సు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలున్నదేశాలు సమావేశమై తమ భవిష్యత్ ప్రణాళికలు వెల్లడిస్తుంటాయి. అయితే ఈ సారి జమ్ము,కశ్మీర్ వేదికగా ఈ అత్యున్నత భేటీ జరిపేందుకు కేంద్రం మంతనాలు జరుపుతోంది. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని కూడా నియమించింది. 2023లో జరగనున్న ఈ సమ్మిట్‌నువిజయవంతం చేయాలని భావిస్తోంది. కమిటీలోని ఐదుగురు సభ్యులు మిగతా దేశాల ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ సమావేశాన్ని ప్లాన్ చేయనున్నారు. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ గతేడాది జీ20 సమావేశానికి భారత ప్రతినిధిగా ఎంపికయ్యారు. ఈ ఏడాది జీ 20 సమావేశానికి భారత్ తరపున ఎవరు అధ్యక్షత వహిస్తారో  డిసెంబర్ 1వ తేదీన నిర్ణయిస్తామని వెల్లడించారు భారత విదేశాంగ మంత్రి. 2023లో జీ20 సమ్మిట్‌ను భారత్‌ నిర్వహించనుందని స్పష్టం చేశారు. 

ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ నియామకం 

ఆర్టికల్ 370 రద్దు తరవాత జమ్ము కశ్మీర్‌లో జరిగే తొలి అంతర్జాతీయ సమావేశం ఇదే అవనుంది. గృహ, పట్టణాభివృద్ధి విభాగానికి చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీ మనోజ్ కుమార్ ద్వివేది..కేంద్రం నియమించిన కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. జూన్ 4వ తేదీనే ఈ కమిటీని ఏర్పాటు చేసింది విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఇకపై జీ 20 దేశాల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఈ సమ్మిట్ సక్సెస్‌ అయ్యేలా చూస్తానని వెల్లడించారు మనోజ్ కుమార్. ఈ కమిటీలో రవాణా శాఖకు చెందిన కమిషనర్ సెక్రటరీ, టూరిజం శాఖకు చెందిన అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, హాస్పిటాలిటీ విభాగానికి చెందిన అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, సాంస్కృతిక విభాగానికి చెందిన అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ సభ్యులుగా ఉన్నారు. 

పెట్టుబడులను ఆకర్షించేందుకేనా..? 

2014 నుంచి జరుగుతున్న జీ20 సమావేశాలకు భారత్ తరపున ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తూ వస్తున్నారు. 1999నుంచి జీ 20లోసభ్య దేశంగా ఉంది భారత్. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న 19 దేశాలతో పాటు ఐరోపా సమాఖ్యకు చెందినే దేశాల ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాల్గొంటారు. ప్రపంచ జీడీపీలో ఈ దేశాల వాటా 80%. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, జర్మనీ, భారత్, ఫ్రాన్స్, ఇండోనేషియా తదితర దేశాలు ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నాయి. జమ్ము, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసినప్పటి నుంచి ఆ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించింది కేంద్రం. అక్కడ పురోగతి సాధించేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పుడు ఇలాంటి అంతర్జాతీయ సమ్మిట్‌ను కశ్మీర్‌లో నిర్వహించటం ద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. 

Also Read: Maharashtra Political Crisis: థాక్రే ప్రభుత్వం కుప్ప కూలినట్టేనా, షిండే శిబిరాన్ని ఎవరూ కదపలేరా?

Also Read: Delhi Crime: అమ్మాయి ఫ్లాట్‌కు రమ్మనగానే వెళ్లిపోయాడు, ఆ తరవాత ఏమైందంటే

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Breaking News: కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
Rahul Gandhi Protest Modi House: బీజేపీ గేమ్‌లో పావుగా మారిన కాంగ్రెస్ - కాక్రోచ్‌లకు అడ్డుగా రాహుల్ - ఇదే మాస్టర్ క్లాస్ రాజకీయం?
బీజేపీ గేమ్‌లో పావుగా మారిన కాంగ్రెస్ - కాక్రోచ్‌లకు అడ్డుగా రాహుల్ - ఇదే మాస్టర్ క్లాస్ రాజకీయం?

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Embed widget