అన్వేషించండి

Jamili Elections: 2029 కూడా కాదు పూర్తి స్థాయి జమిలీ 2034లోనే - బిల్లులో బయటకు రాని సంచలన విషయం ఇదే!

National News: జమిలీ ఎన్నికలు 2034లో పూర్తి స్థాయిలో పెట్టేలా బిల్లు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. సోమవారం పార్లమెంట్ లో పెట్టనున్న బిల్లులో ఉన్న సమాచారం విశ్వసనీయంగా తెలిసింది.

Jamili elections are likely to be held in 2034:  జమిలీ ఎన్నికల బిల్లు పెట్టడం కాదు అసలు ఎప్పుడు జమిలీ ఎన్నికలు నిర్వహిస్తారన్న సస్పెన్స్ చాలా మందిలో ఉంది. బిల్లులో ఆ విషయం ప్రస్తావించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రచారం జమిలీ ఎన్నికలు పూర్తి స్థాయిలో 2034లో జరుగుతాయి. ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ మాత్రమే చట్టంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. 

వెంటనే జమిలీ ఎన్నికలు అని ఆశపడుతున్న కొన్ని పార్టీలు 

జమిలీ ఎన్నికల బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందగానే ప్రభుత్వాలన్నీకూలిపోతాయని .. ఇక ఎన్నికలే అని కొన్నిపార్టీలు అనుకుంటున్నాయి. ఏపీలో వైసీపీ, తెలంగాణ బీఆర్ఎస్ ఇలాంటి జమిలీ ఎన్నికల ప్రకటనలు చేస్తున్నారు. కానీ  బిల్లులో ఉన్న అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బిల్లు ఇంకా పార్లమెంట్ లో పెట్టలేదు కానీ అందులో అంశాలను మీడియా రిపోర్టుచేస్తోంది. తాజాగా బిల్లులో ఓ కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రకారం జమిలీ ఎన్నికలు 2034లో నిర్వహిస్తారు. అప్పటి వరకూ గ్రౌండ్ ప్రిపేర్ అయ్యేలా  చట్టాల సవరణ, ఇతర జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది.         

Also Read: YSRCP: ఆ ఎన్నికలనూ బహిష్కరించిన వైసీపీ - ఇక ఐదేళ్లు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేరు - మరి క్యాడర్ ఉంటుందా ?

మహిళా బిల్లు కూడా గతంలో కేంద్రం ప్రభుత్వం ఆమోదించింది. ఆ బిల్లు కూడా అంతే. వెంటనే అమల్లోకి రాదు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే అమల్లోకి వస్తుందని చట్టంలో చేర్చారు. జమిలీ ఎన్నికలకూ అదే ఫార్ములా ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ లో చేయబోయే రాజ్యాంగ సవరణలో రాజ్యాంగంలో కొత్తగా 82A సెక్షన్ చేర్చబోతున్నారు. ఇది జమిలీ ఎన్నికలను నిర్దేశిస్తుంది.  అలాగే 83 సెక్షన్ ప్రభుత్వాల కాలపరిమితికి సంబంధించి మారుస్తారు. ఆర్టికల్ 172, ఆర్టికల్ 327లో కూడా మార్పులు చేస్తారు. ఈ రెండు ఎమ్మెల్యేల పదవికాలం,  ప్రజాప్రతినిధుల విషయంలో పార్లమెంట్ అధికారాలకు సంబంధించిన అంశాలవి. వీటిలోనూ సవరణలు చేయనున్నారు. ఇవన్నీ చేయాలంటే విపక్షాల మద్దతు అవసరం. 

Also Read: Ravi Kishan On Allu Arjun Arrest: ఫిల్మ్ ఇండస్ట్రీకి చీకటి రోజు... అల్లు అర్జున్ అరెస్టుపై ఘాటుగా స్పందించిన బీజేపీ ఎంపీ

ప్రస్తుతానికి చట్టంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను మాత్రమే కలిపి జమిలీగా నిర్వహించేలా చట్టంలో పెడుతున్నారు. జమిలీ ఎన్నికలకు ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటిని ఒక్క సారిగా అన్ని ప్రభుత్వాలను రద్దు చేసేసి మళ్లీ ఎన్నికలు పెట్టడం ద్వారా సాధ్యం కాదు. మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి.. ఆ సమయానికి అంతా పకడ్బందీగా అయ్యేలా ప్రణాళికలు రెడీ చేసుకుంటారు.ఈ లెక్కన చూస్తే 2029కి పాక్షిక జమిలీ జరిగే అవకాశం ఉంది. ఆ ఎన్నికలకు ఆరు నెలల ముందు.. ఆరు నెలల తర్వాత జరిగే ఎన్నికలన్నింటినీ కలిపితే పాక్షిక జమిలీ అవుతుంది. ఆ తర్వాత ఎన్నికల నాటికి పూర్తి స్థాయి జమిలీకి రెడీ అవుతారని అర్థం చేసుకోవచ్చు. బిల్లు పెట్టిన తర్వాత పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది  .

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Ration Shops: ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget