అన్వేషించండి

Is Ethanol Cheaper than Petrol: పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌ వాడకంతో ఖర్చు పెరుగుతుందా ? మైలేజ్‌లోనూ వ్యత్యాసం

ధరలో లీటరుకు 20 రూపాయలు వ్యత్యాసం ఉన్నప్పటికీ, పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌తో మెయింటనెన్స్ ఖర్చుతో కూడుకున్నదా? మైలేజీలో తగ్గుదలతో అయ్యే ఖర్చుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

దేశంలో ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ (E85, E100)ను భారత ప్రభుత్వం చాలా వేగంగా ప్రమోట్ చేస్తోంది. ఢిల్లీ లాంటి నగరాల్లో E85 ఫ్యూయల్ లీటరుకు సుమారు రూ.82.12 ధరతో లాంచ్ అయింది. ఇది నార్మల్ పెట్రోల్ కంటే దాదాపు 20 రూపాయలు చౌక. బంక్ దగ్గర ఉన్న ఈ రేటును చూసి ప్రతి ఒక్కరూ ఇకపై ఇథనాల్ పెట్రోల్ కొట్టించాలని అనుకుంటున్నారు. అయితే మీ వాహనం ఇంజిన్ ఇథనాల్ ను సపోర్ట్ చేయకపోతే కొత్త రకం ఇంధనాన్ని కొట్టించవద్దు.

కేవలం ఇథనాల్ పెట్రోల్ ధర తక్కువగా ఉందని కొట్టించి కొత్త సమస్యలు తెచ్చుకోవద్దు. కేవలం లీటరు ధర తగ్గడం వల్లే మీ ఖర్చు తగ్గుతుందని చెప్పలేం. ఇథనాల్‌తో బండి నడిపితే అయ్యే మొత్తం ఖర్చు అర్థం చేసుకున్నప్పుడు, చౌకగా కనిపించే ఈ ఫ్యూయల్ నిజానికి మీ జేబుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో క్లారిటీ వస్తుంది. ఇథనాల్ పెట్రోల్ వల్ల బండి మైలేజీ తగ్గుతుందా, పెరుగుతుందా అనే అంశాలు ప్రభావితం చేస్తాయి. 

మైలేజ్ ఎందుకు తగ్గిపోతుంది?
ఇథనాల్‌తో కార్ నడిపితే ఏం జరుగుతుందో ఇక్కడ అందిస్తున్నా. ముందుగా మీరు ఎనర్జీ డెన్సిటీని అర్థం చేసుకోవాలి. సైన్స్ ప్రకారం, ఇథనాల్‌లో పెట్రోల్‌తో పోలిస్తే దాదాపు 30 నుండి 35 శాతం ఎనర్జీ తక్కువగా ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే, 1 లీటరు పెట్రోల్ మండటం వల్ల ఇంజన్‌కు లభించే అంత శక్తిని, 1 లీటరు ఇథనాల్ ఇంధనం ఇవ్వలేదు. ఇదే కారణంతో  ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్ అంతే శక్తిని ఉత్పత్తి చేయడానికి ఎక్కువ మొత్తంలో ఇథనాల్‌ను ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఇథనాల్ (E85 లేదా E100) వినియోగించేటప్పుడు మీ బండి మైలేజ్ నేరుగా 20 నుండి 30 శాతం వరకు కిందకు పడిపోయే అవకాశం ఉంది. 

Also Read: Bajaj Chetak 2026 Price: ఒకసారి ఛార్జ్ చేస్తే 153 కిలోమీటర్లు ఆగాల్సిన పని లేదు! బజాజ్‌ చేతక్‌ ఈవీ పూర్తి వివరాలు ఇవే!

ఇప్పుడు ఉదాహరణకు మీ కార్ పెట్రోల్ (E20) పై లీటరుకు 18 కిలోమీటర్ల మైలైజీ ఇస్తుందనుకుందాం. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.102 ఉంది, కాబట్టి మీకు ఒక కిలోమీటర్ జర్నీకి అయ్యే ఖర్చు దాదాపు 5.67 రూపాయలు అవుతుంది. ఒకవేళ మీరు అదే బండిలో 82.12 లీటర్ ధర గల E85 ఫ్యూయల్ పోయిస్తే, తక్కువ ఎనర్జీ డెన్సిటీ కారణంగా మైలేజ్ తగ్గి ఒక లీటరుకు 13.5 నుంచి 14 కిలోమీటర్ల వరకు మాత్రమే వస్తుంది.

ఇప్పుడు ఈ తగ్గిన మైలేజ్ ప్రకారం మీరు చెక్ చేస్తే E85 పై మీ కార్ ఒక కిలోమీటర్ ప్రయాణ ఖర్చు రూ.6.08 అవుతుంది. అంటే బంక్ వద్ద 20 రూపాయలు చౌకగా లభించినప్పటికీ, మైలేజీ తగ్గడంతో మీకు పెట్రోల్ కంటే కాస్త ఖర్చు ఎక్కువే చేయాల్సి వస్తుంది. 

Also Read: SUV కొనాలని ఆలోచిస్తున్నారా? త్వరలో మార్కెట్లోకి రానున్న 6 పవర్‌ఫుల్ వెహికల్స్

ఇథనాల్ ఎప్పుడు లాభదాయకం
ప్రపంచంలో ఇథనాల్‌కు అతిపెద్ద మార్కెట్ బ్రెజిల్ కాగా, అక్కడ ప్రజలు బండిలో ఫ్యూయల్ పోయించేటప్పుడు ఒక చాలా సింపుల్ ఫార్ములాను పాటిస్తారు, దాన్నే 70% రూల్ అంటారు. ఈ నియమం ప్రకారం, ఇథనాల్ ధర పెట్రోల్ ధరతో పోలిస్తే 70% లేదా అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే బండిలో ఇథనాల్‌ పోయించి నడుపుతారు. 

భారత్ విషయానికి వస్తే, ప్రస్తుతం E85 ధర పెట్రోల్ ధరతో పోలిస్తే దాదాపు 80 శాతంగాఉంది. అంటే ప్రభుత్వం ఇథనాల్ ధరలను తగ్గించి లీటరుకు 70 నుండి 72 రూపాయలు తీసుకురానంత వరకు, మధ్యతరగతి వారికి ఇథనాల్ వాడకంతో పెద్దగా ప్రయోజనం లేకపోగా ఖర్చు కాస్త పెరుగుతుందని అర్థమవుతోంది. అయితే, భవిష్యత్తులో ఒకవేళ ముడి చమురు ధరలు పెరిగితే, ఇథనాల్ ఇంధనంతో ప్రయోజనం కలగనుంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indian Passport Fee Hike 2026: జులై 1 నుంచి పెరగనున్న పాస్‌పోర్ట్ ధరలు! ఏ కేటగిరీకి ఎంత రుసుం? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
జులై 1 నుంచి పెరగనున్న పాస్‌పోర్ట్ ధరలు! ఏ కేటగిరీకి ఎంత రుసుం? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
Breaking News:గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
Muthu Master Tamil Nadu Story: తల్లే తండ్రి - 37 ఏళ్లుగా నాన్నగా మారి కుమార్తెను కాపాడుకున్న ముత్తు మాస్టర్ - కళ్లు చెమర్చే కథ
తల్లే తండ్రి - 37 ఏళ్లుగా నాన్నగా మారి కుమార్తెను కాపాడుకున్న ముత్తు మాస్టర్ - కళ్లు చెమర్చే కథ
Tungabhadra Dam 33 Crest Gates Inauguration: గోదావరి-కృష్ణా-కావేరి అనుసంధానం - తుంగభద్ర కార్యక్రమంలో సీఎంల కీలక ప్రకటనలు
గోదావరి-కృష్ణా-కావేరి అనుసంధానం - తుంగభద్ర కార్యక్రమంలో సీఎంల కీలక ప్రకటనలు
Advertisement

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha Local Status Speech: గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
Breaking News:పాస్‌పోర్ట్ ఫీజులను భారీగా పెంచిన కేంద్రం!
పాస్‌పోర్ట్ ఫీజులను భారీగా పెంచిన కేంద్రం!
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
SEBI New Rules 2026: 5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!
5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!
Darshanam Mogilaiah Land Dispute: వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు
వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు
Dharman OTT : రజనీ ధర్మన్ ఓటీటీ డీల్ క్లోజ్ - రిలీజ్‌కు ముందే రికార్డులు
రజనీ ధర్మన్ ఓటీటీ డీల్ క్లోజ్ - రిలీజ్‌కు ముందే రికార్డులు
Embed widget