అన్వేషించండి

Indore: డౌన్‌సిండ్రోమ్‌ ముందు ఎవరెస్ట్ తలొంచింది-తండ్రితో కలిసి ఏడేళ్ల బాలుడి సాహసయాత్ర

Indore: డౌన్‌సిండ్రోమ్ ఉన్న కొడుకుని ఎవరెస్ట్ ఎక్కించాలని ఓ తండ్రి తపన పడ్డాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సాహస యాత్రను మొదలు పెట్టారు.

Boy With Down Syndrome Scales Mount Everest: 

మెడిసిన్‌, ఆక్సిజన్‌ వెంట తీసుకుని..

డౌన్‌ సిండ్రోమ్‌తో బాధ పడుతున్న ఓ ఏడేళ్ల బాలుడు ఎవరెస్ట్ ఎక్కి ప్రపంచ రికార్డు సాధించాడు. 18,200 అడుగులు ఎత్తుకు చేరుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగరేశాడు అవనీశ్. డౌన్‌ సిండ్రోమ్‌ సమస్యతో బాధ పడుతూ ఎవరెస్ట్ ఎక్కిన తొలి బాలుడిగా చరిత్ర సృష్టించాడు. మధ్యప్రదేశ్‌లోని
ఇండోర్‌కు చెందిన అవనీశ్, అతడి తండ్రి ఆదిత్య తివారీతో కలిసి ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు సాహస యాత్రను ప్రారంభించారు. సుమారు 70 కిలోల బరువుతో ప్రయాణం మొదలు పెట్టారు తండ్రి కొడుకులు. వీటికి తోడు 10 కిలోల బరువైన ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు అవనీశ్‌కు అవసరమైన మెడిసిన్‌ను కూడా తీసుకెళ్లారు. దారి మధ్యలో అవనీశ్‌కు ఏమీ కాకూడదని ముందుగానే జాగ్రత్తపడి, మందులు తీసుకెళ్లాడు తండ్రి ఆదిత్య తివారీ. ఎత్తైన ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. అందుకే ఓ నెబ్యులైజర్‌ను కూడా వెంట తీసుకెళ్లారు. ఎవరెస్ట్ ఎక్కేందుకు అవసరమైన శిక్షణను ముందుగానే ఇచ్చాడు. ఈ యాత్రకు ముందు, కొడుకు డైట్ ప్లాన్‌ను అంతా మార్చేశాడు ఆదిత్య. ఇండోర్‌లోని పలు కేంద్రాల్లో అవనీశ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఎవరెస్ట్‌పై ఉన్న వాతావరణ పరిస్థితులను ఎలా తట్టుకోవాలనే అంశంపై వీరికి శిక్షణనిచ్చారు. 

సమాజం దృష్టిని మార్చాలనే ఉద్దేశంతోనే...

"గతంలో ఈ వయసు ఉన్న డౌన్‌సిండ్రోమ్‌ పిల్లలెవరూ ఎవరెస్ట్ ఎక్కలేదు. ఆ వయసులో ఏ పిల్లలైనా సముద్ర మట్టానికి 2,800 మీటర్ల ఎత్తు వరకూ వెళ్లటమే కష్టం. అంతకు మించి వెళ్తే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి" అని వివరించారు ఆదిత్య తివారీ. ఈ ఫీట్ చేయటం ద్వారా పిల్లలందరికీ స్ఫూర్తిగా నిలిచాడు అవనీశ్. ఆదిత్య తివారీ, అవనీశ్‌ను ఐదేళ్ల క్రితం దత్తత తీసుకున్నాడు. ఓ 26 ఏళ్ల పెళ్లికాని కుర్రాడు డౌన్‌సిండ్రోమ్‌తో బాధ పడుతున్న పిల్లాడిని దత్తత తీసుకోవటంపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ప్రస్తుతం ఆ బాలుడికి శిక్షణనిస్తూ అథ్లెట్‌గా తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు. ఇప్పటికే అవనీశ్ స్పెషల్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. ఇలాంటి పిల్లలను ప్రపంచం వింతగా చూస్తుంది. ఆ చూసే కోణంలో మార్పు రావాలనే ఉద్దేశంతోనే అవనీశ్‌తో ఈ రికార్డు సాధించానని చెప్పాడు ఆదిత్య తివారీ. అలాంటి మెడికల్ కండీషన్‌లో ఉన్న పిల్లాడితో ట్రెకింగ్ చేయటం కష్టమైన పనే అయినప్పటికీ...పట్టుదలతో ముందుకు సాగామని వివరించాడు. ఉష్ణోగ్రతతో పాటు ఆక్సిజన్ కూడా తక్కువగా ఉండే ఆ ఎత్తుకు వెళ్లాలన్న సాహసం చేయాలని గట్టిగా అనుకున్నాకే, ప్రయాణం మొదలు పెట్టానని చెప్పాడు. 

Also Read: Chittor Flys Issue: ‘ఈగ’ సినిమా చూపిస్తున్న ఈగలు! పడుకోనివ్వవు తిననివ్వవు - ఆ ఊరే ఎందుకు టార్గెట్ అంటే?

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
Milei Cabala Magic: వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget