అన్వేషించండి

Indian fishermen : బంగ్లాదేశ్ చెరలో బందీలుగా ఉన్న భారతీయ జాలర్లకు విముక్తి - నాలుగు రోజుల్లో విశాఖకు రాక !

Bangladesh: భారతీయ మత్స్యకారులు బంగ్లాదేశ్ తీరంలోకి వెళ్లి అక్కడి కోస్ట్ గార్డ్‌కు పట్టుబడ్డారు. వారిని భారత అధికారులు విడిపించారు. వారిలో 9 మంది విశాఖ ప్రాంతా మత్స్యకారులు ఉన్నారు.

Indian fishermen held captive in Bangladesh successfully released: బంగ్లాదేశ్‌లోని బాగర్‌హాట్ జైలులో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులు ఎట్టకేలకు స్వేచ్ఛను పొందారు. భారత ప్రభుత్వం, బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో మంగళవారం మత్స్యకారుల విడుదల ప్రక్రియ పూర్తయ్యింది. బంగ్లాదేశ్ హోం శాఖ డిప్యూటీ సెక్రటరీ మహమ్మద్ అఫీజ్ ఆల్ అసాద్ స్వయంగా డాకా నుంచి జైలుకు చేరుకుని మత్స్యకారులను విడుదల చేశారు. ఈ క్రమంలో భారత హైకమిషన్ కౌన్సిలర్ చంద్రజీత్, ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ కలిసి విడుదలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.

ప్రస్తుతం భారత్-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొంత ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, భారతీయ మత్స్యకారులకు జైలులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేశామని బంగ్లాదేశ్ అధికారులు వెల్లడించారు. విడుదలైన అనంతరం మత్స్యకారులను కట్టుదిట్టమైన భద్రత మధ్య మోంగ్లా పోర్టుకు తరలించారు. ప్రస్తుతం మోంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వారి ఫిషింగ్ బోట్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ పనులు ముగిసిన తర్వాత, భారత్-బంగ్లాదేశ్ విదేశాంగ ఒప్పందం ప్రకారం జనవరి 29వ తేదీన అంతర్జాతీయ జలాల్లో ఇరు దేశాల కోస్ట్ గార్డ్ అధికారుల సమక్షంలో మత్స్యకారులను భారత అధికారులకు అప్పగించనున్నారు.

ఈ 23 మంది మత్స్యకారుల్లో 9 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు. మోంగ్లా పోర్టుకు చేరుకున్న వెంటనే వీరు తమ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి కన్నీటిపర్యంతమయ్యారు. దాదాపు నాలుగు నుంచి ఐదు రోజుల్లో వీరంతా విశాఖపట్నం చేరుకుంటారని, కుటుంబ సభ్యులు ఎవరూ ఆందోళన చెందవద్దని వాసుపల్లి జానకిరామ్ భరోసా ఇచ్చారు. తమ విడుదలకు సహకరించిన భారత విదేశాంగ శాఖ, ఇండియన్ హైకమిషన్ మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు మత్స్యకారులు, వారి సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.         

మత్స్యకారుల క్షేమ సమాచారం కోసం భారత విదేశాంగ శాఖ నిరంతరం బంగ్లాదేశ్ అధికారులతో సమన్వయం చేసుకుంటోంది. మోంగ్లా పోర్ట్ వద్ద బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ మరియు మెజిస్ట్రేట్ అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. రేపు సాయంత్రం కల్లా బోట్లు సిద్ధమైతే, ఎల్లుండి ఉదయంకల్లా వీరు భారత జలాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ మత్స్యకారులు సురక్షితంగా విడుదల కావడం పట్ల ఏపీలోని వారి స్వగ్రామాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.                        

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
Embed widget