అన్వేషించండి

Wayanad Landslide: పోస్టుమార్టం చేయలేక పారిపోదామనుకున్నా - వయనాడ్‌లో మృతదేహాలను చూసి వణికిపోతున్న డాక్టర్లు

Wayanad Disaster: వయనాడ్ లో శిథిలాలను తీస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే 250లకు పైగా మృతదేహాలను బయటకు తీసినట్లు సమాచారం. వాటిని చూసి వైద్యులు కూడా వణికిపోతున్నట్లు తెలుస్తోంది.

Waynad Landslide: కొండచరియలు విరిగిపడిన కేరళలోని వాయనాడ్‌లో వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు 24 గంటలు నిరంతరం పనిచేస్తున్నారు. విధ్వంసకర ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందించడం, మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేయడం వారికి భారంగా మారుతోంది. ఓ మహిళా డాక్టర్ హృదయ విదారకమైన కథనాన్ని మీడియాతో పంచుకున్నారు. ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు.  ప్రమాదంలో మరణించిన వ్యక్తుల పోస్ట్‌మార్టం నిర్వహించే బాధ్యతను ఆమె నిర్వర్తిస్తున్నారు. తనకు పోస్ట్‌మార్టం చేయడం అలవాటని, అయితే వాయనాడ్ కొండచరియలు విరిగిపడిన తర్వాత మృతదేహాలను తీసుకువచ్చిన పరిస్థితిని చూసి కలవరపడ్డానని మహిళా డాక్టర్ చెప్పారు.

పారిపోదాం అనుకున్నా 
విధ్వంస ప్రాంతంలో శిథిలాలను తీస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే 250లకు పైగా మృతదేహాలను బయటకు తీసినట్లు సమాచారం. అయితే, దారుణ స్థితిలో ఉన్న వాటిని చూసి వైద్యులు కూడా వణికిపోతున్నట్లు తెలుస్తోంది. అక్కడి హృదయవిదారక పరిస్థితులతో కలత చెందుతున్నట్లు శవపరీక్షలు చేస్తోన్న వైద్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.  అక్కడికి వస్తున్న మృతదేహాలన్నీ ఛిద్రమై ఉన్నాయని డాక్టర్ చెప్పారు. కొందరి ముఖాలు బాగా చిట్లి.. ఎవరో ఉద్దేశపూర్వకంగా తమ ముఖాలను కొట్టి చితకబాదినట్లు అనిపించిందని డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళా డాక్టర్ మాట్లాడుతూ.. నా కెరీర్‌లో నేను చాలా మృతదేహాలకు పోస్ట్ మార్టం చేశాను. కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఓ శరీరం చూస్తే మొత్తం చిద్రమైపోయింది. రెండో దాన్ని అసలు చూడలేకపోయాను. అది కూడా ఏడాది చిన్నారిది. అటువంటి మృతదేహాలు వస్తూనే ఉన్నాయి. అందులో అనేకం గుర్తు పట్టలేని విధంగా ఉండడం కలచివేసింది. ఇక పోస్టు మార్టం చేయలేనని అనుకున్నా. ఆ ప్రాంగణం నుంచి బాధితుల సంరక్షణ కేంద్రానికి పారిపోదాం అనుకన్నా. కానీ ప్రత్యామ్నాయం లేదు.  అలా మొత్తంగా 18 మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించా’’ అని వయనాడ్‌ ఘటన ప్రదేశంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా డాక్టర్ ఆవేదన వ్యక్తం చేసింది.

అన్ని మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
ఇదిలావుండగా, రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ.. గురువారం ఉదయం 7 గంటల వరకు శరీర భాగాలతో సహా మొత్తం 256 పోస్టుమార్టంలు నిర్వహించబడ్డాయి. ఇవి మొత్తం 256 మృతదేహాలు కాదు, కొన్ని మృతదేహాల భాగాలు కూడా ఇందులో ఉన్నాయి. 154 మృతదేహాలను జిల్లా యంత్రాంగానికి అప్పగించాం. మలప్పురం జిల్లా పోతుకల్ ప్రాంతం నుంచి నదిలో కొట్టుకుపోయిన మృతదేహాలకు పోస్టుమార్టం కూడా చేశామన్నారు. శిబిరంలో నివసిస్తున్న ప్రజలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు.  కౌన్సెలింగ్ అందించబడుతుందని మంత్రి తెలిపారు.  ప్రత్యేక అధికారి సీరం సాంబశివరావు మాట్లాడుతూ వారసులు లేని మృతదేహాలను దహనం చేసేందుకు ప్రోటోకాల్‌ అమలులో ఉందన్నారు.   129 మొబైల్ ఫ్రీజర్లు ఉన్నాయి. వీటిలో 59 ఉపయోగించబడతాయి.  మొబైల్ ఫ్రీజర్లను అందించేందుకు కర్ణాటక సిద్ధమైందని మంత్రి తెలిపారు. 
 
297కి చేరిన మృతుల సంఖ్య 
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 450 వరకు ఇల్లు సహా భవనాలు ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 297మంది చనిపోయారు. మరో 29 మంది చిన్నారులు అదృశ్యమైనట్లు తెలుస్తోంది. గురువారం వాయనాడ్‌లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన అధికారిక సమావేశంలో కొండచరియలు విరిగిపడటంతో మూడు రోజుల పాటు జరిగిన రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రాణాలతో బయటపడిన వారందరినీ రక్షించినట్లు అంచనా వేశారు.  ముండ్కై, అత్తమాల ప్రాంతాల్లో సజీవంగా చిక్కుకునే అవకాశం లేదని కేరళ-కర్ణాటక సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్  మేజర్ జనరల్ వీటీ మాథ్యూ సమావేశానికి తెలిపారు. 500 మంది ఆర్మీ సిబ్బంది ముండ్‌కై మరియు చురల్‌మల ప్రాంతంలో వెతకడానికి అందుబాటులో ఉన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Virat Kohli Anushka Sharma Trolls: అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం

వీడియోలు

అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?
Prashant Veer Kartik Sharma CSK IPL 2026 Auction | ఎవరీ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Virat Kohli Anushka Sharma Trolls: అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
Train Tickets: ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
Bigg Boss Telugu Emmanuel Promo : స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
Nagarjuna: ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
IPL Auction 2026: ధోని స్టార్ అయ్యే టైంలో పుట్టారు.. ఇప్పుడు కెప్టెన్ కూల్‌తో డ్రెస్సింగ్ రూమ్ పంచుకుంటారు
ధోని స్టార్ అయ్యే టైంలో పుట్టారు.. ఇప్పుడు కెప్టెన్ కూల్‌తో డ్రెస్సింగ్ రూమ్ పంచుకుంటారు
Embed widget