అన్వేషించండి

Wayanad Landslide: పోస్టుమార్టం చేయలేక పారిపోదామనుకున్నా - వయనాడ్‌లో మృతదేహాలను చూసి వణికిపోతున్న డాక్టర్లు

Wayanad Disaster: వయనాడ్ లో శిథిలాలను తీస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే 250లకు పైగా మృతదేహాలను బయటకు తీసినట్లు సమాచారం. వాటిని చూసి వైద్యులు కూడా వణికిపోతున్నట్లు తెలుస్తోంది.

Waynad Landslide: కొండచరియలు విరిగిపడిన కేరళలోని వాయనాడ్‌లో వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు 24 గంటలు నిరంతరం పనిచేస్తున్నారు. విధ్వంసకర ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందించడం, మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేయడం వారికి భారంగా మారుతోంది. ఓ మహిళా డాక్టర్ హృదయ విదారకమైన కథనాన్ని మీడియాతో పంచుకున్నారు. ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు.  ప్రమాదంలో మరణించిన వ్యక్తుల పోస్ట్‌మార్టం నిర్వహించే బాధ్యతను ఆమె నిర్వర్తిస్తున్నారు. తనకు పోస్ట్‌మార్టం చేయడం అలవాటని, అయితే వాయనాడ్ కొండచరియలు విరిగిపడిన తర్వాత మృతదేహాలను తీసుకువచ్చిన పరిస్థితిని చూసి కలవరపడ్డానని మహిళా డాక్టర్ చెప్పారు.

పారిపోదాం అనుకున్నా 
విధ్వంస ప్రాంతంలో శిథిలాలను తీస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే 250లకు పైగా మృతదేహాలను బయటకు తీసినట్లు సమాచారం. అయితే, దారుణ స్థితిలో ఉన్న వాటిని చూసి వైద్యులు కూడా వణికిపోతున్నట్లు తెలుస్తోంది. అక్కడి హృదయవిదారక పరిస్థితులతో కలత చెందుతున్నట్లు శవపరీక్షలు చేస్తోన్న వైద్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.  అక్కడికి వస్తున్న మృతదేహాలన్నీ ఛిద్రమై ఉన్నాయని డాక్టర్ చెప్పారు. కొందరి ముఖాలు బాగా చిట్లి.. ఎవరో ఉద్దేశపూర్వకంగా తమ ముఖాలను కొట్టి చితకబాదినట్లు అనిపించిందని డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళా డాక్టర్ మాట్లాడుతూ.. నా కెరీర్‌లో నేను చాలా మృతదేహాలకు పోస్ట్ మార్టం చేశాను. కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఓ శరీరం చూస్తే మొత్తం చిద్రమైపోయింది. రెండో దాన్ని అసలు చూడలేకపోయాను. అది కూడా ఏడాది చిన్నారిది. అటువంటి మృతదేహాలు వస్తూనే ఉన్నాయి. అందులో అనేకం గుర్తు పట్టలేని విధంగా ఉండడం కలచివేసింది. ఇక పోస్టు మార్టం చేయలేనని అనుకున్నా. ఆ ప్రాంగణం నుంచి బాధితుల సంరక్షణ కేంద్రానికి పారిపోదాం అనుకన్నా. కానీ ప్రత్యామ్నాయం లేదు.  అలా మొత్తంగా 18 మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించా’’ అని వయనాడ్‌ ఘటన ప్రదేశంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా డాక్టర్ ఆవేదన వ్యక్తం చేసింది.

అన్ని మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
ఇదిలావుండగా, రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ.. గురువారం ఉదయం 7 గంటల వరకు శరీర భాగాలతో సహా మొత్తం 256 పోస్టుమార్టంలు నిర్వహించబడ్డాయి. ఇవి మొత్తం 256 మృతదేహాలు కాదు, కొన్ని మృతదేహాల భాగాలు కూడా ఇందులో ఉన్నాయి. 154 మృతదేహాలను జిల్లా యంత్రాంగానికి అప్పగించాం. మలప్పురం జిల్లా పోతుకల్ ప్రాంతం నుంచి నదిలో కొట్టుకుపోయిన మృతదేహాలకు పోస్టుమార్టం కూడా చేశామన్నారు. శిబిరంలో నివసిస్తున్న ప్రజలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు.  కౌన్సెలింగ్ అందించబడుతుందని మంత్రి తెలిపారు.  ప్రత్యేక అధికారి సీరం సాంబశివరావు మాట్లాడుతూ వారసులు లేని మృతదేహాలను దహనం చేసేందుకు ప్రోటోకాల్‌ అమలులో ఉందన్నారు.   129 మొబైల్ ఫ్రీజర్లు ఉన్నాయి. వీటిలో 59 ఉపయోగించబడతాయి.  మొబైల్ ఫ్రీజర్లను అందించేందుకు కర్ణాటక సిద్ధమైందని మంత్రి తెలిపారు. 
 
297కి చేరిన మృతుల సంఖ్య 
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 450 వరకు ఇల్లు సహా భవనాలు ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 297మంది చనిపోయారు. మరో 29 మంది చిన్నారులు అదృశ్యమైనట్లు తెలుస్తోంది. గురువారం వాయనాడ్‌లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన అధికారిక సమావేశంలో కొండచరియలు విరిగిపడటంతో మూడు రోజుల పాటు జరిగిన రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రాణాలతో బయటపడిన వారందరినీ రక్షించినట్లు అంచనా వేశారు.  ముండ్కై, అత్తమాల ప్రాంతాల్లో సజీవంగా చిక్కుకునే అవకాశం లేదని కేరళ-కర్ణాటక సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్  మేజర్ జనరల్ వీటీ మాథ్యూ సమావేశానికి తెలిపారు. 500 మంది ఆర్మీ సిబ్బంది ముండ్‌కై మరియు చురల్‌మల ప్రాంతంలో వెతకడానికి అందుబాటులో ఉన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Happy New Year 2026:భారతదేశం నుంచి జపాన్ వరకు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన ప్రపంచం! బాణసంచా కాల్పులతో 2026కి స్వాగతం!
భారతదేశం నుంచి జపాన్ వరకు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన ప్రపంచం! బాణసంచా కాల్పులతో 2026కి స్వాగతం!
Spirit First Look: 'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
Psych Siddhartha Review - సైక్ సిద్ధార్థ రివ్యూ: బోల్డ్ కంటెంట్, బీప్ సౌండులేనా? నందు సినిమా బావుందా?
సైక్ సిద్ధార్థ రివ్యూ: బోల్డ్ కంటెంట్, బీప్ సౌండులేనా? నందు సినిమా బావుందా?
2026 జనవరి 1 రాశిఫలాలు! మేషం నుంచి మీనం.. ఈ రోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
2026 జనవరి 1 రాశిఫలాలు! మేషం నుంచి మీనం.. ఈ రోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!

వీడియోలు

పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Happy New Year 2026:భారతదేశం నుంచి జపాన్ వరకు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన ప్రపంచం! బాణసంచా కాల్పులతో 2026కి స్వాగతం!
భారతదేశం నుంచి జపాన్ వరకు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన ప్రపంచం! బాణసంచా కాల్పులతో 2026కి స్వాగతం!
Spirit First Look: 'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
Psych Siddhartha Review - సైక్ సిద్ధార్థ రివ్యూ: బోల్డ్ కంటెంట్, బీప్ సౌండులేనా? నందు సినిమా బావుందా?
సైక్ సిద్ధార్థ రివ్యూ: బోల్డ్ కంటెంట్, బీప్ సౌండులేనా? నందు సినిమా బావుందా?
2026 జనవరి 1 రాశిఫలాలు! మేషం నుంచి మీనం.. ఈ రోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
2026 జనవరి 1 రాశిఫలాలు! మేషం నుంచి మీనం.. ఈ రోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
Bajaj Platina 100 : ఫుల్ ట్యాంక్‌లో 800 కి.మీ ప్రయాణం! కొత్త సంవత్సరంలో తక్కువ ధరకే బజాబ్‌ ప్లాటినా 100!
ఫుల్ ట్యాంక్‌లో 800 కి.మీ ప్రయాణం! కొత్త సంవత్సరంలో తక్కువ ధరకే బజాబ్‌ ప్లాటినా 100!
Japan Earthquake News: నూతన సంవత్సర వేడుకలకు ముందు జపాన్‌లో తీవ్ర భూకంపం !
నూతన సంవత్సర వేడుకలకు ముందు జపాన్‌లో తీవ్ర భూకంపం !
Tatamel Bike: ఇప్పుడు పార్కింగ్ టెన్షన్‌కు గుడ్ బై! కుర్చీలా మడతెట్టే ఎలక్ట్రిక్ బైక్ లాంచ్! రేంజ్, ధర తెలుసుకోండి
ఇప్పుడు పార్కింగ్ టెన్షన్‌కు గుడ్ బై! కుర్చీలా మడతెట్టే ఎలక్ట్రిక్ బైక్ లాంచ్! రేంజ్, ధర తెలుసుకోండి
Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
Embed widget