అన్వేషించండి

Wayanad Landslide: పోస్టుమార్టం చేయలేక పారిపోదామనుకున్నా - వయనాడ్‌లో మృతదేహాలను చూసి వణికిపోతున్న డాక్టర్లు

Wayanad Disaster: వయనాడ్ లో శిథిలాలను తీస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే 250లకు పైగా మృతదేహాలను బయటకు తీసినట్లు సమాచారం. వాటిని చూసి వైద్యులు కూడా వణికిపోతున్నట్లు తెలుస్తోంది.

Waynad Landslide: కొండచరియలు విరిగిపడిన కేరళలోని వాయనాడ్‌లో వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు 24 గంటలు నిరంతరం పనిచేస్తున్నారు. విధ్వంసకర ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందించడం, మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేయడం వారికి భారంగా మారుతోంది. ఓ మహిళా డాక్టర్ హృదయ విదారకమైన కథనాన్ని మీడియాతో పంచుకున్నారు. ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు.  ప్రమాదంలో మరణించిన వ్యక్తుల పోస్ట్‌మార్టం నిర్వహించే బాధ్యతను ఆమె నిర్వర్తిస్తున్నారు. తనకు పోస్ట్‌మార్టం చేయడం అలవాటని, అయితే వాయనాడ్ కొండచరియలు విరిగిపడిన తర్వాత మృతదేహాలను తీసుకువచ్చిన పరిస్థితిని చూసి కలవరపడ్డానని మహిళా డాక్టర్ చెప్పారు.

పారిపోదాం అనుకున్నా 
విధ్వంస ప్రాంతంలో శిథిలాలను తీస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే 250లకు పైగా మృతదేహాలను బయటకు తీసినట్లు సమాచారం. అయితే, దారుణ స్థితిలో ఉన్న వాటిని చూసి వైద్యులు కూడా వణికిపోతున్నట్లు తెలుస్తోంది. అక్కడి హృదయవిదారక పరిస్థితులతో కలత చెందుతున్నట్లు శవపరీక్షలు చేస్తోన్న వైద్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.  అక్కడికి వస్తున్న మృతదేహాలన్నీ ఛిద్రమై ఉన్నాయని డాక్టర్ చెప్పారు. కొందరి ముఖాలు బాగా చిట్లి.. ఎవరో ఉద్దేశపూర్వకంగా తమ ముఖాలను కొట్టి చితకబాదినట్లు అనిపించిందని డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళా డాక్టర్ మాట్లాడుతూ.. నా కెరీర్‌లో నేను చాలా మృతదేహాలకు పోస్ట్ మార్టం చేశాను. కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఓ శరీరం చూస్తే మొత్తం చిద్రమైపోయింది. రెండో దాన్ని అసలు చూడలేకపోయాను. అది కూడా ఏడాది చిన్నారిది. అటువంటి మృతదేహాలు వస్తూనే ఉన్నాయి. అందులో అనేకం గుర్తు పట్టలేని విధంగా ఉండడం కలచివేసింది. ఇక పోస్టు మార్టం చేయలేనని అనుకున్నా. ఆ ప్రాంగణం నుంచి బాధితుల సంరక్షణ కేంద్రానికి పారిపోదాం అనుకన్నా. కానీ ప్రత్యామ్నాయం లేదు.  అలా మొత్తంగా 18 మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించా’’ అని వయనాడ్‌ ఘటన ప్రదేశంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా డాక్టర్ ఆవేదన వ్యక్తం చేసింది.

అన్ని మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
ఇదిలావుండగా, రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ.. గురువారం ఉదయం 7 గంటల వరకు శరీర భాగాలతో సహా మొత్తం 256 పోస్టుమార్టంలు నిర్వహించబడ్డాయి. ఇవి మొత్తం 256 మృతదేహాలు కాదు, కొన్ని మృతదేహాల భాగాలు కూడా ఇందులో ఉన్నాయి. 154 మృతదేహాలను జిల్లా యంత్రాంగానికి అప్పగించాం. మలప్పురం జిల్లా పోతుకల్ ప్రాంతం నుంచి నదిలో కొట్టుకుపోయిన మృతదేహాలకు పోస్టుమార్టం కూడా చేశామన్నారు. శిబిరంలో నివసిస్తున్న ప్రజలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు.  కౌన్సెలింగ్ అందించబడుతుందని మంత్రి తెలిపారు.  ప్రత్యేక అధికారి సీరం సాంబశివరావు మాట్లాడుతూ వారసులు లేని మృతదేహాలను దహనం చేసేందుకు ప్రోటోకాల్‌ అమలులో ఉందన్నారు.   129 మొబైల్ ఫ్రీజర్లు ఉన్నాయి. వీటిలో 59 ఉపయోగించబడతాయి.  మొబైల్ ఫ్రీజర్లను అందించేందుకు కర్ణాటక సిద్ధమైందని మంత్రి తెలిపారు. 
 
297కి చేరిన మృతుల సంఖ్య 
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 450 వరకు ఇల్లు సహా భవనాలు ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 297మంది చనిపోయారు. మరో 29 మంది చిన్నారులు అదృశ్యమైనట్లు తెలుస్తోంది. గురువారం వాయనాడ్‌లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన అధికారిక సమావేశంలో కొండచరియలు విరిగిపడటంతో మూడు రోజుల పాటు జరిగిన రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రాణాలతో బయటపడిన వారందరినీ రక్షించినట్లు అంచనా వేశారు.  ముండ్కై, అత్తమాల ప్రాంతాల్లో సజీవంగా చిక్కుకునే అవకాశం లేదని కేరళ-కర్ణాటక సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్  మేజర్ జనరల్ వీటీ మాథ్యూ సమావేశానికి తెలిపారు. 500 మంది ఆర్మీ సిబ్బంది ముండ్‌కై మరియు చురల్‌మల ప్రాంతంలో వెతకడానికి అందుబాటులో ఉన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

West Bengal Elections: ప్రధాని మోదీ నుంచి హేమా మాలిని వరకు... 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన బీజేపీ
ప్రధాని మోదీ నుంచి హేమా మాలిని వరకు... 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన బీజేపీ
Kerala Assembly Elections: ఇంట్లో కుస్తీ - బయట దోస్తీ - కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల తీరుపై అమిత్ షా ఫైర్
ఇంట్లో కుస్తీ - బయట దోస్తీ - కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల తీరుపై అమిత్ షా ఫైర్
PM Modi: దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Strait of Hormuz: హర్మూజ్ దాటిన భారత 7వ LPG ట్యాంకర్.. ఇరాన్ స్పెషల్ మెస్సేజ్ - అసూయతో రగిలిపోతున్న పాక్
హర్మూజ్ దాటిన భారత 7వ LPG ట్యాంకర్.. ఇరాన్ స్పెషల్ మెస్సేజ్ - అసూయతో రగిలిపోతున్న పాక్

వీడియోలు

Rajasthan Royals vs Gujarat Titans IPL 2026 | రాజ‌స్థాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విక్ట‌రీ
IPL 2026 Jofra Archer Death Overs RR vs GT | 19వ ఓవర్ లో జోఫ్రా ఆర్చర్ మ్యాజిక్
Siraj Catch Drop GT vs RR IPL 2026 | సిరాజ్ ఈజీ క్యాచ్‌ను సిక్సర్‌గా మార్చేశాడా
IPL 2026 Delhi Capitals vs Mumbai Indians | ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం
Riyan Parag Credits Dhruv Jurel RR vs GT IPL 2026 | రియాన్ పరాగ్ ప్లాన్ వెనుక ఉన్నది అతనే

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB VS CSK Updates: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ.. 2 వ‌రుస విజ‌యాలతో జోరు.. స‌త్తా చాటిన భువీ, 43 ర‌న్స్ తో సీఎస్కే చిత్తు
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ.. 2 వ‌రుస విజ‌యాలతో జోరు.. స‌త్తా చాటిన భువీ, 43 ర‌న్స్ తో సీఎస్కే చిత్తు
AP Rains Alert: ఏపీలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మరోవైపు నిప్పులు చెరిగే ఎండలు!
ఏపీలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మరోవైపు నిప్పులు చెరిగే ఎండలు!
IPL 2026 SRH VS LSG Result Update: పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన ల‌క్నో.. బ్యాటింగ్ వైఫల్యంతో స‌న్ రైజ‌ర్స్ కు ప‌రాజ‌యం
పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన ల‌క్నో.. బ్యాటింగ్ వైఫల్యంతో స‌న్ రైజ‌ర్స్ కు ప‌రాజ‌యం
MAVIGUN : జగన్ MAVIGUN ట్రెండ్ - టైటిల్ రిజిస్టర్ చేయించిన ప్రొడ్యూసర్!... ఏ జానర్‌లో మూవీ తీస్తారో?
జగన్ MAVIGUN ట్రెండ్ - టైటిల్ రిజిస్టర్ చేయించిన ప్రొడ్యూసర్!... ఏ జానర్‌లో మూవీ తీస్తారో?
Khanapur Municipal Chairman: కాంగ్రెస్‌కు నిరాశే.. ఖానాపూర్ మున్సిపాలిటీ దక్కించుకున్న బీజేపీ, వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్
కాంగ్రెస్‌కు నిరాశే.. ఖానాపూర్ మున్సిపాలిటీ దక్కించుకున్న బీజేపీ, వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్
RTC Bus Catches Fire: హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సులో మంటలు.. కడప జిల్లాలో ప్రమాదం
హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సులో మంటలు.. కడప జిల్లాలో ప్రమాదం
Vignesh Shivan : హీరోగా సినిమా ఓకే చేసిన అనిరుధ్ - లాస్ట్ మూమెంట్‌లో యాక్టింగ్ ఎందుకు మానేశాడంటే?
హీరోగా సినిమా ఓకే చేసిన అనిరుధ్ - లాస్ట్ మూమెంట్‌లో యాక్టింగ్ ఎందుకు మానేశాడంటే?
ఎస్‌యూవీల‌కు గండి కొట్టిన‌ మారుతి డిజైర్.. మార్చి 2026 సేల్స్‌లో నంబర్ వన్ కారుగా రికార్డు!
ఎస్‌యూవీల‌కు గండి కొట్టిన‌ మారుతి డిజైర్.. మార్చి 2026 సేల్స్‌లో నంబర్ వన్ కారుగా రికార్డు!
Embed widget