అన్వేషించండి

Bharat Ratna: అసలు ఎవరీ కర్పూరి ఠాకూర్? ఆయనకు భారతరత్న ఎందుకు ప్రకటించారో తెలుసా?

Jan Nayak: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయం కోసం పోరాడిన బీహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు దేశ అత్యున్నత పురష్కారం దక్కింది.

Karpoori Thakur: దివంగత నేత, బీహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌ (Karpoori Thakur) (1924-1988)ను దేశ అత్యున్నత పురష్కారం వరించింది. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయం కోసం కర్పూరీ ఠాకూర్‌ చేసిన కృషికి గుర్తుగా ఆయన మరణానంతరం భారత ప్రభుత్వం ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఆయన శత జయంతి వేళ దేశ అత్యున్నత పురస్కారానికి ఆయనను ఎంపిక చేస్తూ మంగళవారం రాష్ట్రపతి భవన్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

1970వ దశకంలో రెండు సార్లు బీహార్‌ సీఎంగా పనిచేసిన కర్పూరీ ఠాకూర్‌.. జన నాయక్‌(జననేత)గా గుర్తింపుపొందారు. రాజకీయంగా అగ్రకులాలు ఆధిపత్యం వహించే బీహార్‌లో ఓబీసీల రాజకీయాలకు ఆయన నాంది పలికారు. మొదటిసారిగా రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్ యేతర సోషలిస్టు నాయకుడు కూడా కర్పూరి ఠాకూరే కావడం విశేషం. భారత అత్యున్నత పురస్కారమైన భారతరత్న గ్రహీతల్లో ఠాకూర్‌ 49వ వ్యక్తి. చివరిసారిగా కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్‌ ముఖర్జీకి 2019లో ఈ పురస్కారాన్ని ప్రకటించింది.

అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతి, సమానత్వం, సాధికారత కోసం కర్పూరి ఠాకూర్‌ తిరుగులేని నిబద్ధతతో పనిచేశారని ప్రధాని మోదీ కొనియాడారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని, విజనరీ నాయకత్వం ద్వారా దేశ సామాజిక-రాజకీయ నిర్మాణంలో ఆయన చెరగని ముద్ర వేశారని అన్నారు. సామాజిక న్యాయం అనే పదానికి చిహ్నంగా నిలిచారని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని  చెప్పారు. 

స్వాతంత్ర్య పోరాటం
కర్పూరి ఠాకూర్‌ 1924, జనవరి 24న నాయీ బ్రాహ్మణ సామాజికవర్గంలో జన్మించారు. ఆయన తండ్రి సన్నకారు రైతుగా ఉండేవారు. యుక్త వయసులో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. 1942-1945 మధ్య క్విట్‌ ఇండియా ఉద్యమంలో 26 నెలల పాటు జైలు జీవితం గడిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1952లో తొలిసారిగా బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తేజ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 1967-68 మధ్య రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా సేవలందించారు.

ఠాకూర్ తన రాజకీయ జీవితంలో అనేక మైలురాళ్లను అధిగమించారు. ముఖ్యమంత్రి అవకముందు ఉప ముఖ్యమంత్రిగా, విద్యాశాఖా మంత్రిగా పనిచేశారు. 1970లో రాష్ట్ర మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు అప్పటికే రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న మద్యపాన నిషేధిస్తూ బీహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించారు. అంతేకాకుండా విద్యకు ప్రధాన్యత ఇస్తూ.. పాఠశాలలు, కళాశాలలను స్థాపించడంలో ముఖ్యపాత్ర పోషించారు. బీహార్‌లో అభివృద్ధి చెందని ప్రాంతాలు, అట్టడుగు ప్రజలకు  విద్య అందుబాటులోకి వచ్చేలా చేశారు. 

బిహార్‌లో రిజర్వేషన్ల అమలుకు ఆద్యుడు
స్వాతంత్య్రం అనంతరం భారతదేశంలో సోషలిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించిన రామ్‌ మనోహర్‌ లోహియా వంటి వ్యక్తుల నుంచి కర్పూరి ఠాకూర్‌ స్ఫూర్తి పొందారు. తర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) అభ్యున్నతిపై ఆయన తీవ్రంగా ఆలోచించేవారు. ఈ నేపథ్యంలోనే ఓబీసీలకు రిజర్వేషన్ కోసం పోరాడారు. 1990 మండల్ కమిషన్‌కు ముందుగానే 1977లో  ముంగేరి లాల్ కమిషన్ నివేదిక మేరకు 9178లోనే ముస్లింలలోని బలహీన వర్గాలతో సహా వెనుకబడిన తరగతుల వారి కోసం రిజర్వేషన్లు అమలు చేశారు.  

ఠాకూర్ బీహార్ విద్యా మంత్రిగా ఉన్నప్పుడు మెట్రిక్యులేషన్ స్థాయిలో ఇంగ్లిష్‌ను తప్పనిసరి సబ్జెక్ట్‌ నుంచి తొలగించారు. విద్యాపరంగా వెనుకబడినవారిని ప్రోత్సహిస్తూ, ఉన్నత విద్యను అభ్యసించేలా ఆయన కృషి చేశారు. కర్పూరీ ఠాకూర్ విధానాలు ఇప్పటికి బీహార్‌లో కనిపిస్తాయి. వెనుకబడిన తరగతుల సాధికారతకు ఆయన చేసిన పోరాటం నేడు జనతాదళ్ (యునైటెడ్), రాష్ట్రీయ జనతాదళ్ వంటి ప్రాంతీయ పార్టీల ఏర్పాటుపై ప్రభావం చూపింది.

లాలూ, నితీశ్‌, పాశ్వాన్‌లకు గురువు
బీహార్‌లో ఓబీసీ రాజకీయాలకు పునాది వేసిన వారిలో కర్పూరి ఠాకూర్‌ ప్రథములు. జయప్రకాశ్‌ నారాయణ్‌ ఇచ్చిన పిలుపుతో ఎంతో మంది ఉద్యమంలోకి రాగా.. అలా వచ్చిన వారిలో లాలూప్రసాద్‌ యాదవ్‌, నితీశ్‌ కుమార్‌, రాంవిలాస్‌ పాశ్వాన్‌ వంటి నేతలకు ఠాకూర్‌ రాజకీయ గురువు. గొప్ప రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు పొందిన కర్పూరి ఠాకూర్‌ 1988, ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget