అన్వేషించండి

Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు

Telangana News సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే వరుష ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చునని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు.

Harish Rao slams Revanth Reddy over food poison incidents in Telangana | హైదరాబాద్: సొంత జిల్లాను పట్టించుకోని నిర్లక్ష్యపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా? గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్‌ ఘటనలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై రేవంత్ రెడ్డికి ఉన్న ధ్యాస, పిల్లల భవిష్యత్తుపై లేదా? అని ప్రశ్నించారు. 

రాష్ట్రం సంగతి దేవుడెరుగు, సొంత జిల్లాలో ఇంత దారుణమా

రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పట్టించుకోవడం కాదు, కనీసం ఆయన సొంత జిల్లాలోని గవర్నమెంట్ స్కూల్స్, గురుకులాలను సైతం పట్టించుకోని నిర్లక్ష్యపు ముఖ్యమంత్రి అంటూ నిప్పులు చెరిగారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయి. పలు సందర్భాలలో ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిలదీశారు.

వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలపై హరీష్ రావు ఫైర్

10 రోజులు కాకముందే తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగి 15 మంది ఆసుపత్రి పాలయ్యారని హరీష్ రావు తెలిపారు. సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే, తెలంగాణ వ్యాప్తంగా పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా వరుస ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడక పోవడం దుర్మార్గం. విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోవడం లేదని హరీష్ రావు ఆరోపించారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు మాటలు నీటి మూటలే అయ్యాయని.. కాంగ్రెస్ ది మాటల సర్కారే కానీ చేతల ముఖ్యమంత్రి కాదు, చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యతో రాష్ట్రంలో ఇంకెంత మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవాలి? ఇంకెందరు ఆస్పత్రి పాలు కావాలని హరీష్ రావు మండిపడ్డారు.

తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెప్పి బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారంలో నాణ్యతా లోపం కారణంగా పదే పదే ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థినులు వాంతులు చేసుకుంటున్నారు. తలనొప్పి, విరేచనాలు, ఇతర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నామని బాలికలు తెలిపారు. కానీ ప్రభుత్వం దీనిపై స్పందించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వ స్కూళ్లు, గురుకుల విద్యార్థులు, విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Manchu Vs Bhuma: భూమా ఇంటి ఆడబిడ్డకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకుంటారా ? మంచు కుటుంబం ఫ్యాక్షన్ ఎదుర్కోక తప్పదా ?

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Blast: ఢిల్లీలో పేలుడు విద్రోహక చర్య? ప్రమాదమా?
ఢిల్లీలో పేలుడు విద్రోహక చర్య? ప్రమాదమా?
Delhi Blast : ఢిల్లీలో ఎర్రకోట దగ్గర పేలుడు తర్వాత దృశ్యాలు, ఇలా ఉంది పరిస్థితి
ఢిల్లీలో ఎర్రకోట దగ్గర పేలుడు తర్వాత దృశ్యాలు, ఇలా ఉంది పరిస్థితి
Jubilee Hills byelection arrangements: జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు పూర్తయిన ఏర్పాట్లు -మంగళవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ !
జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు పూర్తయిన ఏర్పాట్లు -మంగళవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ !
AP Cabinet decisions: ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్‌స్టేషన్స్‌ - విశాఖలో రోడ్ల విస్తరణ - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్‌స్టేషన్స్‌ - విశాఖలో రోడ్ల విస్తరణ - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
Advertisement

వీడియోలు

IPL Trade Deal CSK, RR | ఐపీఎల్ ట్రేడ్ డీల్ పై ఉత్కంఠ
Akash Choudhary Half Century | 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన ఆకాష్ చౌదరి
మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా?  డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
రియల్ లైఫ్ OG.. షూటింగ్ రేంజ్‌లో గన్ ఫైర్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Narmada Human: భారతదేశ చరిత్రని మార్చిన ఆ పుర్రె ఎవరిది?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Blast: ఢిల్లీలో పేలుడు విద్రోహక చర్య? ప్రమాదమా?
ఢిల్లీలో పేలుడు విద్రోహక చర్య? ప్రమాదమా?
Delhi Blast : ఢిల్లీలో ఎర్రకోట దగ్గర పేలుడు తర్వాత దృశ్యాలు, ఇలా ఉంది పరిస్థితి
ఢిల్లీలో ఎర్రకోట దగ్గర పేలుడు తర్వాత దృశ్యాలు, ఇలా ఉంది పరిస్థితి
Jubilee Hills byelection arrangements: జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు పూర్తయిన ఏర్పాట్లు -మంగళవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ !
జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు పూర్తయిన ఏర్పాట్లు -మంగళవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ !
AP Cabinet decisions: ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్‌స్టేషన్స్‌ - విశాఖలో రోడ్ల విస్తరణ - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్‌స్టేషన్స్‌ - విశాఖలో రోడ్ల విస్తరణ - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
Mahindra XEV 9e or Tata Harrier EV: మహీంద్రా XEV 9e లేదా టాటా హారియర్ EVలలో భారతదేశపు అత్యంత ప్రీమియం ఎలక్ట్రిక్ SUV ఏది?
మహీంద్రా XEV 9e లేదా టాటా హారియర్ EVలలో భారతదేశపు అత్యంత ప్రీమియం ఎలక్ట్రిక్ SUV ఏది?
UIDAI Aadhaar app: ఈ యాప్ ఉంటే ఆధార్ కార్డు ఉన్నట్లే - కొత్త యాప్ లాంఛ్ చేసిన ఉడాయ్ !
ఈ యాప్ ఉంటే ఆధార్ కార్డు ఉన్నట్లే - కొత్త యాప్ లాంఛ్ చేసిన ఉడాయ్ !
Another storm AP: ఏపీని పలకరించబోతున్న మరో తుఫాన్ - 20వ తేదీన అల్పడీనం - తుఫాన్‌గా మారే చాన్స్
ఏపీని పలకరించబోతున్న మరో తుఫాన్ - 20వ తేదీన అల్పడీనం - తుఫాన్‌గా మారే చాన్స్
Andhra Cabinet: ఆ 48 మంది ఎమ్మెల్యేల బాధ్యత మీదే - ఇంచార్జ్ మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం - కేబినెట్ భేటీలో కీలక చర్చ
ఆ 48 మంది ఎమ్మెల్యేల బాధ్యత మీదే - ఇంచార్జ్ మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం - కేబినెట్ భేటీలో కీలక చర్చ
Embed widget