అన్వేషించండి

Viral News: డాల్ఫిన్ దొరికిందని కూర వండుకుని తిన్నారు! కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి అరెస్ట్

Viral News: యమునా నదిలో దొరికిన డాల్ఫిన్ ను వండుకుని తిన్న మత్స్యకారులను పోలీసులు అరెస్టు చేశారు.

Viral News: యమునా నది ఒప్పొంగి ప్రవహిస్తుంది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తోంది. ఈ క్రమంలో యమునా నదిలో రకరకాల చేపలు కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ కనిపించనన్ని చేపలు ప్రస్తుతం ప్రవాహంలో కనిపిస్తున్నట్లు యమునా పరీవాహక ప్రాంతాల ప్రజలు అంటున్నారు. యమునా నదిలో డాల్ఫిన్లు కూడా కనిపిస్తుండటం విశేషం. ఈ క్రమంలో యూపీలోని కౌశంబి జిల్లా పిపరీ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు మత్స్యకారులకు డాల్ఫిన్ దొరికినట్లు కూడా వార్తలు వచ్చాయి.

యమునా నదిలో దొరికిన డాల్ఫిన్ ను కొందరు మత్స్యకారులు పట్టుకుని ఇంటికి తీసుకెళ్లి కూర వండుకుని తినడం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి మత్స్యకారులు డాల్ఫిన్ ను మోసుకెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. నసీర్ పూర్ గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులపై కౌశంబి జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్ర కుమార్ ఫిర్యాదు మేరకు పిపరీ పోలీసు అధికారి శ్రవణ్ కుమార్ సింగ్ తెలిపారు. సదరు మత్స్యకారులు తమ వలలో పడిన డాల్ఫిన్ ను ఇంటికి తీసుకెళ్లి, కూర వండుకుని తిన్నారని రవీంద్ర కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు. నలుగురు మత్స్యకారులు డాల్ఫిన్ ను మోసుకెళ్తుండటాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారని, దానిపై విచారణ జరిపి, రంజీత్ కుమార్, సంజయ్, దీవన్, బాబాలపై వన్యప్రాణి సంరక్షణ చట్టం (1972) కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరిలో రంజీత్ కుమార్ అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. మిగిలిన వారు పరారీ ఉండగా వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. 

ఢిల్లీలో కొనసాగుతున్న యమునా నది ఉద్ధృతి

దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ఉద్ధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వరద పోటెత్తడంతో యమునా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. నగరంలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద 206.42 మీటర్ల ఎత్తులో ఉరకలు వేస్తోంది. ఆదివారంతో పోలిస్తే నీటిమట్టం స్థాయి కాస్త ఎక్కువగానే ఉంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హత్నికుండ్ బ్యారేజీ నుంచి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలోనే ఢిల్లీ సర్కారు అప్రమత్తమైంది. ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించింది. ఓల్డ్ యమునా బ్రిడ్జ్ సమీపంలో నది డేంజర్ మార్కు దాటడంతో తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఢిల్లీ నుంచి షహదారా మధ్య రాకపోకలు సాగించే రైళ్లను కూడా రద్దే చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget