అన్వేషించండి

Uttarkashi Tunnel Rescue Updates: తుది దశకు చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్,ఆ ఒక్క లైన్ క్లియర్ అయితే అంతా సక్సెస్

Uttarkashi Tunnel Collapse: ఉత్తరాఖండ్ సొరంగం వద్ద రెస్క్యూ ఆపరేషన్‌ తుది దశకు చేరుకుంది.

Uttarkashi Tunnel Rescue Operation Updates:

తుది దశలో..

ఉత్తరాఖండ్‌ సొరంగం వద్ద రెస్క్యూ ఆపరేషన్‌ (Uttarkhand Tunnel Rescue) తుది దశకు చేరుకుంది. మరి కొద్ది గంటల్లోనే శిథిలాల కింద చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకురానున్నారు. ఇప్పటికే సొరంగం వద్దకు ఆంబులెన్స్‌లు తరలి వచ్చాయి. ఢిల్లీ నుంచి 7గురు నిపుణులు ఘటనా స్థలంలోనే ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ని దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకూ రెస్క్యూ ఆపరేషన్‌కి ఉన్న అడ్డంకులన్నింటినీ రాత్రి పూట తొలగించారు. ఫలితంగా డ్రిల్లింగ్ (Vertical Drilling) ప్రక్రియ వేగంగా పూర్తైంది. మరో 12 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేస్తే కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు లైన్ క్లియర్ అవుతుందని అధికారులు వెల్లడించారు. అమెరికా నుంచి తెప్పించి Augur Machineని అసెంబుల్ చేయనున్నారు. బుధవారం (నవంబర్ 22) సాయంత్రం 6 గంటల తరవాత ఉన్నట్టుండి రెస్క్యూ ఆపరేషన్‌కి సవాళ్లు ఎదురయ్యాయి. స్టీల్ స్ట్రక్చర్స్ అడ్డుపడ్డాయి. వీటిని డ్రిల్లింగ్ మెషీన్‌తో కట్ చేయలేకపోయారు. ఈ పని NDRF చేపట్టింది. ఇక ఈ ఘటనా స్థలం వద్దే ఉన్న ఇంటర్నేషనల్ టన్నెలింగ్ ఎక్స్‌పర్ట్ ఆర్నాల్డ్ డిక్స్ (Arnold Dix)...రెస్క్యూ ఆపరేషన్‌ దాదాపు పూర్తైనట్టే అని స్పష్టం చేశారు. "సొరంగం ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాం. అక్కడి శిథిలాలు తొలగిస్తే సక్సెస్ అయినట్టే" అని వివరించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల్ని దగ్గరుండి పరిశీలిస్తున్నారు. 

 

"ప్రస్తుతానికి మేం దాదాపు సొరంగం ఎంట్రెన్స్ డోర్‌ వద్దకు వచ్చేశాం. తలుపు కొడితే లోపలి వాళ్లు బయటకు వచ్చేసినట్టు...సొరంగంలో ఉన్న వాళ్లు బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేశాం"

- ఆర్నాల్డ్ డిక్స్, ఇంటర్నేషనల్ టన్నెలింగ్ ఎక్స్‌పర్ట్

అప్‌డేట్స్ ఇవీ..

ఉత్తరాఖండ్‌లోని చిన్యాలిసౌర్‌లో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో 41 బెడ్స్ సిద్ధంగా ఉంచారు. కార్మికులు బయటకు రాగానే వాళ్లకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. డ్రిల్లింగ్ చేసిన తరవాత ఆ రంధ్రంలోకి పైప్స్‌ని అమర్చుతారు. ఒకటి లోపలికి వెళ్లిన తరవాత దానికి మరోటి జత చేర్చి వెల్డింగ్ చేస్తారు. అలా ఎస్కేప్ రూట్‌ ఏర్పాటు చేసి వాళ్లను బయటకు తీసుకువస్తారు. ఇప్పడీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అయితే...వాళ్లు బయటకు వచ్చిన తరవాత ఇక్కడి వాతావరణానికి అలవాటు పడడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. దాదాపు 12 రోజులుగా లోపల చీకట్లోనే ఉండారు. ఉన్నట్టుండి బయటకు వచ్చాక...ఉష్ణోగ్రతలు మారిపోతాయి. ఇది శరీరంపైనే కాకుండా మానసికంగానా వాళ్లపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. వాళ్లు బయటకు వచ్చీ రాగానే NDRFకి చెందిన సీనియర్ వైద్యుడు వాళ్లను పరీక్షిస్తారు. అయితే..లోపల నుంచి పైప్‌లోకి వచ్చి మెల్లగా అందులో పాకుకుంటూ బయటకు రావాల్సి ఉంటుంది. ఈ సమయంలోనూ రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది కార్మికులకు అన్ని విధాలుగా గైడ్ చేయనున్నారు. వెల్డింగ్ జాయింట్స్ ఉండడం వల్ల అవి తగిలి ఎలాంటి గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు.

Also Read: 'పొత్తులపై కాంగ్రెస్‌ పార్టీ ఫూల్‌ చేస్తోంది' - ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget